| నంది పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసంనంది (అయోమయ నివృత్తి) చూడండి. |
| నంది | |
|---|---|
నంది | |
| దేవనాగరి | नन्दि |
| అనుబంధం | శివుని వాహనం |
| నివాసం | కైలాసం |
| భర్త / భార్య | సుయాస[1] |
నంది (నందీశ్వరుడు)శివునివాహనం. శివుని సేవకుడిగా,కైలాస లోక సేనలకుఅధిపతిగా కూడా ఉంటాడు.[2] శైవ సిద్ధాంత సంప్రదాయం ప్రకారం, శైవమత జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి ఎనిమిది వేర్వేరు దిశల్లో పంపబడిన నంది ఎనిమిది మంది శిష్యులైనసనక,సనాతన,సనందన,సనత్కుమార, తిరుములర్, వ్యాగ్రాపాడ,పతంజలి, శివయోగ మొదలైన మునులకు ఈయనే ప్రధాన గురువు.[3] వియత్నాం హిందువులు చనిపోయినప్పుడు, నంది వచ్చి వారి ఆత్మను వియత్నాం నుండి భారత పవిత్ర భూమికి తీసుకువెళతారని అక్కడి వారు నమ్ముతారు.[4]
నంది అనే పదంతమిళ మూల పదం అయినలో (తమిళం: నన్) నుండి వచ్చింది. దీని అర్థం పెరగడం, వృద్ధి చెందడం లేదా కనిపించడం. ఇది తెల్ల ఎద్దుల పెరుగుదల లేదా వృద్ధిని సూచించడానికి ఉపయోగించబడింది. అదేవిధంగా దైవత్వం కలిగినఎద్దును నందిగా భావిస్తారు.[5][6]సంస్కృతంలో నంది అన్న పదానికి సంతోషం, ఆనందం, సంతృప్తి అనే అర్ధం ఉంది. శివుడి నంది దైవత్వ లక్షణాలతో కూడి ఉంటుంది.[7] దాదాపు అన్నిశివాలయాలలో కూర్చున్న నంది విగ్రహాలు ఉంటాయి. అవి సాధారణంగా ప్రధాన మందిరానికి ఎదురుగానే ఉంటాయి.
నంది అనే పేరును ఎద్దుకు ఉపయోగించడమనేది ఇటీవలే డాక్యుమెంట్ చేయబడింది.[8] సంస్కృత, తమిళం, ఇతర భారతీయ భాషలలోని పురాతన శైవ గ్రంథాలలో నంది శివుని వాహనంగానే కాకుండా కైలాసం ద్వార పాలకుడిగా ప్రస్తావించబడింది. సిద్ధాంత గ్రంథాలు ఎద్దు నుండి నందిని స్పష్టంగా వేరు చేస్తున్నాయి. ఆ సిద్ధాంతాల ప్రకారం దేవి, చండేశ, మహాకాల, వాభ, నంది, గణేశ, భృంగి, మురుగన్ అనే ఎనిమిదిమంది శివుని గణాధిపతులు.[9]
శివుడు, నందిల ఆరాధనసింధు లోయ నాగరికత కాలానికి చెందినది. 'పసుపతి ముద్ర' కూర్చున్న బొమ్మను వర్ణిస్తుంది. దీనిని సాధారణంగా శివుడిగా గుర్తిస్తారు.మొహెంజో-దారో,హరప్పాలలో అనేక ఎద్దు ముద్రలు ఉన్నాయి. నంది ఆరాధన సంప్రదాయం అనేక వేల సంవత్సరాలుగా ఉన్నదని వీటిని బట్టి తెలుస్తోంది.[10]
నందిని శిరాదుడు అనే రుషి కుమారుడిగా అభివర్ణించారు. శిరాదుడు చేసిన యజ్ఞం నుండి వజ్రాలతో తయారు చేసిన కవచంతో నంది జన్మించాడని చెబుతారు. నందీశ్వరుడు గొప్ప సద్గుణాలతో పెరుగుతూ ఉండగా, ఒకరోజునారదుడు వచ్చి ఈ బాలుడు అల్పాయుష్కుడు అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో శివుని కోసం ఘోర తపస్సు చేసిన నంది, ఎల్లప్పుడు శివున్ని చూస్తూ, సేవిస్తూ ఉండాలనే వరం కోరాడు. అలా నందీశ్వరుడు పూర్ణాయిష్కుడయ్యాడు.[11]మధ్యప్రదేశ్ లోనిజబల్పూర్లోనర్మదా నది ఒడ్డున ఉన్న ప్రస్తుత నందికేశ్వర్ ఆలయంలం.. త్రిపూర్ తీర్థ క్షేత్ర సమీపంలో ఒకపర్వతం పై ఉంది.
పార్వతి, శివుడికి బోధించిన అగామిక్, తాంత్రిక జ్ఞానం నుండి నందికి దైవిక జ్ఞానం లభించింది. నంది తన ఎనిమిది మంది శిష్యులైనసనక,సనాతన,సనందన,సనత్కుమార, తిరుములర్, వ్యాగ్రాపాడ,పతంజలి, శివయోగలకు ఆ జ్ఞానాన్ని బోధించాడు. ఆ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఈ ఎనిమిది మంది శిష్యులను ప్రపంచంలోని ఎనిమిది వేర్వేరు దిశలలో పంపాడు.[3]
నంది గురించి మరెన్నో పురాణ కథలు ప్రాచూర్యంలో ఉన్నాయి.లంక రాజ్యం ఒక కోతి (వనారా) చేత దహనం చేయబడుతుందని నంది రావణుడిని (లంక రాక్షసుడు) శపించగా, అశోక వాటికలో రావణుడు బంధించినసీతను వెతుక్కుంటూ వెళ్ళినహనుమంతుడు లంకను తగలబెట్టాడు.[12]
తమిళ తిరువిలయదల్ పురాణంలో నంది తిమింగలం అవతారమెత్తిన మరో కథ ఉంది.[13] శివుడు వేదాల అర్ధాన్ని పార్వతికి వివరించేటప్పుడు పార్వతి తన ఏకాగ్రతను కోల్పోగా, అప్పుడు ప్రాయశ్చిత్తం కోసం ఒక మత్స్యకారురాలుగా అవతరించింది. శివుడిని, పార్వతిని కలపడానికి నంది ఒక తిమింగలం రూపాన్ని ధరించి ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. దాంతో ఆ మత్స్యకారురాలు (పార్వతి) తండ్రి, తిమింగలాన్ని చంపినవాడిని తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. తరువాత, శివుడు ఒక మత్స్యకారుని అవతారం ధరించి తిమింగలాన్ని చంపి, పార్వతిని వివాహం చేసుకుంటాడు.
అగామాస్ నందిని జూ-ఆంత్రోపోమోర్ఫిక్ రూపంలో ఎద్దుల తల, నాలుగు చేతులతో జింక, గొడ్డలి, జాపత్రి, అభయముద్రతో వర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాలలో నంది శివుని వాహనంగా చిత్రీకరించబడింది.కాంబోడియాతో సహాఆగ్నేయాసియా దేశాలలో కూడా ఈ రూపంలోనే ఉంటుంది.[14]
ఎద్దుకున్న తెలుపు రంగు స్వచ్ఛత, న్యాయాన్ని సూచించగా... శివాలయాలలో గర్భగుడి వైపు కూర్చున్న నంది వ్యక్తి జీవాత్మను, మనసు ఎల్లప్పుడూ పరమేశ్వరపై దృష్టి పెట్టాలి అనే సందేశాన్ని సూచిస్తుంది. నంది సంపూర్ణంగా తన మనస్సును శివుడిని అంకితం చేసింది.[15]

నంది జెండా (వృషభ జెండా) కూర్చున్న ఎద్దు యొక్క చిహ్నంతో ఉన్న జెండా శైవ మతం, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో ఉంటుంది.పల్లవ రాజవంశం, జాఫ్నా రాజ్యం వంటి చారిత్రక తమిళ శైవ చక్రవర్తులు నందిని చిహ్నంగా ఉపయోగించారు.[18]శ్రీలంక,తమిళనాడు, ప్రవాసుల తమిళ సమాజంలోని శైవులు తమ నంది జెండా గురించి తెలుసుకోవటానికిశివరాత్రి సందర్భంగా ప్రచారాలు నిరంతరం జరుగుతాయి.[19]
ప్రస్తుతం ఉపయోగిస్తున్న నంది జెండాను 1990లలో శ్రీలంక శైవుడు ఎస్. దనపాల మార్గదర్శకత్వంలో తమిళనాడుమధురైకి చెందిన రవీంద్ర శాస్త్రి రూపొందించాడు. శ్రీలంకలోని రత్మలానాలోని కొలంబో హిందూ కళాశాలలో 1998లో మొదటిసారిగా ఈ నంది జెండాను ఎగురవేశారు.[20][21] 2008లో జూరిచ్లో జరిగిన నాల్గవ అంతర్జాతీయ శైవ సిద్ధాంత సమావేశంలో దీనిని అధికారికంగా శైవ జెండాగా ప్రకటించారు. ప్రస్తుతం, తమిళ శైవులు, ముఖ్యంగా శ్రీలంక,కెనడా,ఆస్ట్రేలియా,యునైటెడ్ కింగ్డమ్,దక్షిణాఫ్రికా,స్విట్జర్లాండ్ దేశాలలో జరిగే అన్ని మత, సాంస్కృతిక ఉత్సవాల్లో ఈ జెండాను ఎగురవేస్తారు.[17][20][21] నంది జెండాను శ్రీలంక అధికారిక హిందూ జెండాగా ప్రకటించారు.[22][23]