తువాలు /tuːˈvɑːluː/ too-VAH-loo )[7] అనేది పసిఫిక్ మహాసముద్రంలోని ఓషియానియాలోని పాలినేషియన్ ఉపప్రాంతంలో, హవాయి, ఆస్ట్రేలియా మధ్య ఉన్న ఒక ద్వీప దేశం . ఇది శాంటా క్రజ్ దీవులకు తూర్పు-ఈశాన్యంగా (ఇవి సోలమన్ దీవులకు చెందినవి), వనౌటు ఈశాన్యంగా,నౌరుకు ఆగ్నేయంగా,కిరిబాటి దక్షిణంగా, టోకెలావుకు పశ్చిమాన,సమోవా, వాలిస్, ఫుటునాకు వాయువ్యంగా,ఫిజీకి ఉత్తరాన ఉంది.
తువాలు మూడు రీఫ్ దీవులు, ఆరు అటాల్లతో కూడి ఉంది. ఇది 5° - 10° దక్షిణ అక్షాంశం మధ్య 176° - 180° రేఖాంశం మధ్య విస్తరించి ఉంది. అవి అంతర్జాతీయ తేదీ రేఖకు పశ్చిమాన ఉన్నాయి.[8] 2017 జనాభా లెక్కల ప్రకారం తువాలు జనాభా 10,645 అని నిర్ధారించబడింది,[9] ఇదివాటికన్ నగరం తర్వాత ప్రపంచంలో రెండవ అత్యల్ప జనాభా కలిగిన దేశంగా నిలిచింది. తువాలు మొత్తం భూభాగం 26 చదరపు kiloమీటర్లు (10 చ. మై.) .
తువాలులో మొదటి నివాసులు పాలినేషియన్లు. వారు దాదాపు 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన పాలినేషియన్ల పసిఫిక్ వలసలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చారు.[10] పసిఫిక్ దీవులతో యూరోపియన్ సంబంధానికి చాలా కాలం ముందు, పాలినేషియన్లు తరచుగా దీవుల మధ్య పడవలో ప్రయాణించేవారు. పాలినేషియన్ నావిగేషన్ నైపుణ్యాలు వారు డబుల్-హల్ ఉన్న సెయిలింగ్ పడవలు లేదా ఔట్రిగ్గర్ పడవలలో విస్తృతంగా ప్రణాళికాబద్ధమైన ప్రయాణాలు చేయడానికి వీలు కల్పించాయి.[11] పాలినేషియన్లు సమోవా, టోంగా నుండి తువాలువాన్ అటాల్స్ వరకు వ్యాపించారని మేధావులు విశ్వసిస్తున్నారు. ఇది తరువాత మెలనేషియా, మైక్రోనేషియాలోని పాలినేషియన్ అవుట్లైయర్లలో మరింత వలసలకు ఒక మజిలీగా పనిచేసింది.[12][13][14]
1568లో స్పానిష్ అన్వేషకుడు కార్టోగ్రాఫర్ అల్వారో డి మెండానా టెర్రా ఆస్ట్రాలిస్ను వెతుకుతూ చేస్తున్న యాత్రలో నుయ్ ద్వీపాన్ని చూసిన తరువాత ద్వీపసమూహం గుండా ప్రయాణించిన మొదటి యూరోపియన్ అయ్యాడు. 1819లో ఫనాఫుటి ద్వీపానికి ఎల్లిస్ ద్వీపం అని పేరు పెట్టారు. తరువాత మొత్తం సమూహానికి ఇంగ్లీష్ హైడ్రోగ్రాఫర్ అలెగ్జాండర్ జార్జ్ ఫైండ్లే ఎల్లిస్ దీవులు అని పేరు పెట్టారు. 19వ శతాబ్దం చివరలో గ్రేట్ బ్రిటన్ ఎల్లిస్ దీవుల మీద నియంత్రణను ప్రకటించుకుని వాటిని వారి ప్రభావ పరిధిలోకి తీసుకువెళ్లింది.[15] 1892 అక్టోబర్ 9 - 16 మధ్య, హెచ్.ఎం.ఎస్ కెప్టెన్ హెర్బర్ట్ గిబ్సన్ కురాకోవా ఎల్లిస్ దీవులలో ప్రతిదాన్ని బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా ప్రకటించింది. బ్రిటిష్ వెస్ట్రన్ పసిఫిక్ టెరిటరీస్ (బి.డబల్యూ.పి.టి)లో భాగంగా ఎల్లిస్ దీవులను నిర్వహించడానికి బ్రిటన్ ఒక రెసిడెంట్ కమిషనర్ను నియమించింది. 1916 నుండి 1975 వరకు వాటిని గిల్బర్ట్, ఎల్లిస్ దీవుల కాలనీలో భాగంగా నిర్వహించేవారు.
గిల్బర్ట్ దీవులు, ఎల్లిస్ దీవులు ఒక్కొక్కటి తమ సొంత పరిపాలనను కలిగి ఉండాలా వద్దా అని నిర్ణయించడానికి 1974లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.[16] ఫలితంగా గిల్బర్ట్, ఎల్లిస్ దీవుల కాలనీ చట్టబద్ధంగా 1975న అక్టోబరు 1 న నిలిచిపోయింది; 1976 జనవరి 1 పరిపాలన అధికారికంగా వేరు చేయబడింది.[17] రెండు ప్రత్యేక బ్రిటిష్ కాలనీలు కిరిబాటి, తువాలు ఏర్పడ్డాయి. 1 అక్టోబర్ 1978 అక్టోబరు 1 తువాలు కామన్వెల్త్లో సార్వభౌమ రాజ్యంగా పూర్తిగా స్వతంత్రంగా మారింది. ఇది మూడవ కింగ్ చార్లెస్ తువాలు రాజుగా రాజ్యాంగబద్ధమైన రాచరికం అంగీకరించింది . 2000 సెప్టెంబర్ 5న తువాలు ఐక్యరాజ్యసమితిలో 189వ సభ్యదేశంగా చేరింది.
ఈ దీవులలో గణనీయమైన స్థాయిలో నేల లేదు కాబట్టి దేశం ఆహారం కోసం దిగుమతులు, చేపలు పట్టడం మిద ఎక్కువగా ఆధారపడుతుంది. అంతర్జాతీయ కంపెనీలకు ఫిషింగ్ పర్మిట్లకు లైసెన్స్ ఇవ్వడం, గ్రాంట్లు, సహాయ ప్రాజెక్టులు, కార్గో షిప్లలో పనిచేసే తువాలువాన్ నావికులు వారి కుటుంబాలకు చెల్లింపులు చేయడం ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగాలుగా ఉన్నాయి. తువాలు ఒక లోతట్టు ద్వీప దేశం కాబట్టి వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం పెరగడానికి ఇది చాలా హాని కలిగిస్తుంది.[18] ఇది చిన్న ద్వీప దేశాల కూటమిలో భాగంగా
తువాలు ప్రజల మూలాలు సుమారు 3,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన పసిఫిక్లోకి వలసలకు సంబంధించిన సిద్ధాంతాలలో ప్రస్తావించబడ్డాయి. యూరోపియన్-సంపర్కానికి ముందు కాలంలో, సమోవా,టోంగాతో సహా సమీప దీవుల మధ్య తరచుగా పడవ ప్రయాణం ఉండేది.[19] తువాలులోని తొమ్మిది దీవులలో ఎనిమిది దీవులలో జనావాసాలు ఉన్నాయి. ఇది తువాలు అనే పేరు మూలాన్ని వివరిస్తుంది. దీని అర్థం తువాలూన్ భాషలో "ఎనిమిది మంది కలిసి నిలబడటం" ( ప్రోటో-ఆస్ట్రోనేషియన్ భాషలో *వాలు అంటే "ఎనిమిది" అని అర్థం) తో పోల్చండి. ననుమంగా గుహలలో మానవులు వెలిగించి ఉపయోగించిన మంటలు సంభవించాయనే ఆధారాలు, మానవులు వేల సంవత్సరాలుగా ఈ దీవులను ఆక్రమించి ఉండవచ్చని సూచిస్తున్నాయి.
తువాలు దీవులలో ఒక ముఖ్యమైన పురాణం కథనం టె పుసి మో టె అలీ (ఈల్, ఫ్లౌండర్) కథ, వీరు తువాలు దీవులను సృష్టించారని చెబుతారు. తువాలులోని ఫ్లాట్ అటాల్స్కు టె అలీ ( ఫ్లౌండర్ ) మూలం అని నమ్ముతారు. తువాలువాన్ల జీవితాల్లో ముఖ్యమైనకొబ్బరి చెట్లకు టె పుసి ( ఈల్ ) నమూనా. తువాలువాన్ల పూర్వీకుల కథలు ద్వీపం నుండి ద్వీపానికి మారుతూ ఉంటాయి. నియుటావోలో,[20] ఫనాఫుటి, వైటుపులో, స్థాపకుడైన పూర్వీకుడు సమోవా నుండి వచ్చినట్లు వర్ణించబడింది,[21][22] అయితే ననుమియాలో, స్థాపకుడైన పూర్వీకుడు టోంగా నుండి వచ్చినట్లు వర్ణించబడింది.[21]
1841లో యునైటెడ్ స్టేట్స్ అన్వేషణ యాత్ర సందర్భంగా ఆల్ఫ్రెడ్ అగేట్ గీసిన సాంప్రదాయ దుస్తులలో ఒక తువాలువాన్ వ్యక్తి[23]
1568 జనవరి 16న స్పెయిన్కు చెందిన అల్వారో డి మెండానా సముద్రయానంలో తువాలును చేరి ఈ ప్రాంతానికి చేరిన మొదటిసారి యూరోపియన్గా గుర్తించబడ్డాడు. ఆయన నుయ్ దాటి ప్రయాణించి, దానికి ఇస్లా డి జెసస్ (స్పానిష్లో "యేసు ద్వీపం" అని అర్థం) అని పేరు పెట్టారు. ఎందుకంటే అంతకుముందు రోజు పవిత్ర నామ పండుగ. మెండానా ద్వీపవాసులతో సంబంధాలు ఏర్పరచుకుంది కానీ దిగలేకపోయింది. .[24][25] పసిఫిక్ మీదుగా మెండానా రెండవ సముద్రయానంలో, అతను 1595 ఆగస్టు 29న నియులకిటాను దాటాడు, దానికి అతను లా సోలిటారియా అని పేరు పెట్టాడు.[25][26]
1764లో కెప్టెన్ జాన్ బైరాన్ డాల్ఫిన్ కెప్టెన్గా ప్రపంచాన్ని చుట్టి వస్తున్న సమయంలో తువాలు దీవుల గుండా ప్రయాణించాడు. (1751) .[27] ఆయన పగడపు దీవులను లగూన్ దీవులుగా చార్ట్ చేశాడు. యూరోపియన్లు ననుమియాను మొదటిసారిగా చూసినట్లు నమోదు చేయబడినది. స్పానిష్ 1781 మే 5న లా ప్రిన్సేసా యుద్ధనౌక కెప్టెన్గా ఫిలిప్పీన్స్ నుండి న్యూ స్పెయిన్కు పసిఫిక్ దక్షిణం దాటడానికి ప్రయత్నించినప్పుడు నావికాదళ అధికారి ఫ్రాన్సిస్కో మౌరెల్ డి లా రువా తువాలును దాటి ప్రయాణించాడు. ఆయన ననుమియాను శాన్ అగస్టిన్గా పేర్కొన్నాడు.[28][29] కీత్ ఎస్. చాంబర్స్, డౌగ్ మున్రో (1980) మౌరెల్ కూడా 1781 మే 5న నియుటావో ద్వీపం మీదుగా ప్రయాణించి వెళ్ళారని గుర్తించారు. తద్వారా యూరోపియన్లు ది మిస్టరీ ఆఫ్ గ్రాన్ కోకల్ అని పిలిచే దానిని పరిష్కరించారు.[26][30] మౌరెల్ మ్యాప్, జర్నల్ ఈ ద్వీపానికి ఎల్ గ్రాన్ కోకల్ ('ది గ్రేట్ కోకనట్ ప్లాంటేషన్') అని పేరు పెట్టింది; అయితే అక్షాంశం , రేఖాంశం అనిశ్చితంగా ఉన్నాయి.[30] 18వ శతాబ్దం చివరి వరకు ఖచ్చితమైన క్రోనోమీటర్లు అందుబాటులోకి రాలేదు కాబట్టి ఆ సమయంలో రేఖాంశాన్ని స్థూలంగా మాత్రమే లెక్కించగలిగేవారు.
1809లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని పోర్ట్ జాక్సన్ నుండి చైనాకు వాణిజ్య ప్రయాణంలో ఉత్తర తువాలు జలాల గుండా వెళుతున్నప్పుడు బ్రిగ్ ఎలిజబెత్లోని కెప్టెన్ ప్యాటర్సన్ ననుమియాను చూశాడు.[28] 1819 మే న్యూయార్క్కు చెందిన ఆరెంట్ షుయ్లర్ డి పెయిస్టర్, సాయుధ బ్రిగేంటైన్ ( ప్రైవేట్ రెబెక్కా ) కెప్టెన్, బ్రిటిష్ కలర్స్లో ప్రయాణించి,[31][32] దక్షిణ తువాలువాన్ జలాల గుండా వెళ్ళాడు. డి ' నుకుఫెటౌ, ఫనాఫుటిలను చూశాడు. దీనికి ఆయన ఎల్లిస్ ఐలాండ్ అని పేరు పెట్టాడు. దీనికి కోవెంట్రీ పార్లమెంటు సభ్యుడు, రెబెక్కా కార్గో యజమాని అయిన ఎడ్వర్డ్ ఎల్లిస్ అనే ఆంగ్ల రాజకీయ నాయకుడు పేరు పెట్టారు.[30][33][34] ఇంగ్లీష్ హైడ్రోగ్రాఫర్ అలెగ్జాండర్ జార్జ్ ఫైండ్లే కృషి తర్వాత తొమ్మిది దీవులకు ఎల్లిస్ అనే పేరు వర్తించబడింది.[35]
1820లో రష్యన్ అన్వేషకుడు మిఖాయిల్ లాజరేవ్ మిర్నీ కమాండర్గా నుకుఫెటౌను సందర్శించాడు.[30] లా కోక్విల్లె కెప్టెన్ లూయిస్-ఇసిడోర్ డ్యూపెర్రీ 1824 మేలో భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు (1822–1825) నానుమంగా దాటి ప్రయాణించాడు.[36] కెప్టెన్ కోయెర్జెన్ నేతృత్వంలోని ఫ్రిగేట్ మరియా రీగర్స్బర్గ్[37] , కెప్టెన్ సి. ఈగ్ నేతృత్వంలోని కార్వెట్ పొలక్స్, 1825 జూన్ 14 ఉదయం నుయ్ను కనుగొని ప్రధాన ద్వీపానికి ( ఫెనువా టాపు ) నెదర్లాండ్స్చ్ ఐలాండ్ అని పేరు పెట్టారు.[38]
తిమింగలాలు పసిఫిక్ సముద్రంలో సంచరించడం ప్రారంభించాయి. అయితే పగడపు దీవులమీద దిగడం కష్టతరమైనందున అవి తువాలును అరుదుగా మాత్రమే సందర్శించాయి. నాన్టుకెట్ వీలర్ ఇండిపెండెన్స్ II అమెరికన్ కెప్టెన్ జార్జ్ బారెట్ తువాలు చుట్టూ ఉన్న జలాలను వేటాడిన మొదటి తిమింగలం వేటగాడిగా గుర్తించబడ్డాడు.[33] ఆయన 1821 నవంబరులో నుకులైలే ప్రజల నుండి కొబ్బరికాయలను మార్పిడి చేసుకుని నియులకితను కూడా సందర్శించాడు.[26] ఆయన నుకుఫెటౌలోని సకలువా ద్వీపంలో ఒక తీర శిబిరాన్ని స్థాపించాడు. అక్కడ తిమింగలం బ్లబ్బర్ను కరిగించడానికి బొగ్గును ఉపయోగించారు.[39].
1861లో కుక్ దీవులలోని మణిహికిలోని ఒక కాంగ్రిగేషనల్ చర్చికి డీకన్ ఎలేకనా తుఫానులో చిక్కుకుని ఎనిమిది వారాల పాటు కొట్టుకుపోయి 1861 మే 10న నుకులైలేలో దిగడంతో క్రైస్తవ మతం తువాలుకు వచ్చింది.[30][40] ఎలేకనా క్రైస్తవ మతాన్ని ప్రచారంచేయడం ప్రారంభించాడు. తువాలు చర్చిని స్థాపించడంలో తన పనిని ప్రారంభించడానికి ముందు ఆయన సమోవాలోని లండన్ మిషనరీ సొసైటీ (ఎల్ఎం.ఎస్) పాఠశాల మలువా థియోలాజికల్ కాలేజీలో శిక్షణ పొందాడు.[30] 1865లో ప్రొటెస్టంట్ కాంగ్రిగేషనలిస్ట్ మిషనరీ సొసైటీ ఎల్.ఎం.ఎస్కు చెందిన రెవరెండ్ ఆర్చిబాల్డ్ రైట్ ముర్రే మొదటి యూరోపియన్ మిషనరీగా వచ్చారు; ఆయన తువాలు నివాసులలో కూడా సువార్త ప్రచారంచేసాడు. 1878 నాటికి ప్రతి ద్వీపంలో ప్రచారకులు ఉన్నందున ప్రొటెస్టంటిజం బాగా స్థిరపడినట్లు పరిగణించబడింది.[30] 19వ శతాబ్దపు చివరి, 20వ శతాబ్దపు ప్రారంభంలో తువాలు చర్చి ( టె ఎకలేసియా కెలిసియానో టువాలు )గా మారిన దాని మంత్రులు ప్రధానంగా సమోవాన్లు[41] వీరు తువాలు భాష, తువాలు సంగీతం అభివృద్ధిని ప్రభావితం చేశారు.[42]
1862 - 1863 మధ్య ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం పాటు, పెరువియన్ నౌకలు " బ్లాక్బర్డింగ్ " వాణిజ్యంలో నిమగ్నమై ఉన్నాయి. దీని ద్వారా వారు కార్మికులను నియమించుకున్నారు. లేదా ఆకట్టుకున్నారు, తూర్పు పసిఫిక్లోని ఈస్టర్ ద్వీపం నుండి తువాలు గిల్బర్ట్ దీవుల (ఇప్పుడు కిరిబాటి) దక్షిణ అటాల్స్ వరకు పాలినేషియాలోని చిన్న దీవులన్నీ చూసారు. పెరూలో తీవ్ర కార్మికుల కొరతను తీర్చడానికి వారు నియామకాలను కోరారు.[43] ఫనాఫుటి, నుకులైలేలలో, నివాసి వ్యాపారులు "బ్లాక్బర్డర్స్" ద్వారా ద్వీపవాసులను నియమించుకోవడానికి వీలు కల్పించారు. తువాలులో తొలి యూరోపియన్ మిషనరీ అయిన రెవరెండ్ ఆర్చిబాల్డ్ రైట్ ముర్రే,[44] 1863లో ఫునాఫుటి నుండి దాదాపు 170 మందిని, నుకులైలే నుండి దాదాపు 250 మందిని తీసుకెళ్లారని నివేదించారు,[45] 1841లో యునైటెడ్ స్టేట్స్ అన్వేషణ యాత్ర సందర్భంగా ఆల్ఫ్రెడ్ అగేట్ గీసిన సాంప్రదాయ దుస్తులలో ఒక తువాలువాన్ వ్యక్తి[30] ఎందుకంటే 1861లో నుకులైలేలో నివసిస్తున్నట్లు నమోదు చేయబడిన 300 మందిలో 100 కంటే తక్కువ మంది ఉన్నారు.[46][47]
19వ శతాబ్దం చివరలో హెచ్.ఎం.ఎస్. కెప్టెన్ హెర్బర్ట్ గిబ్సన్ ఎల్లిస్ దీవులను అన్నింటినీ బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు ఈ దీవులు బ్రిటన్ ప్రభావ పరిధిలోకి (1892 అక్టోబర్ 9 - 16 మధ్య) వచ్చాయి.[48]
19వ శతాబ్దం మధ్యకాలంలో తువాలులో వాణిజ్య సంస్థలు చురుగ్గా మారాయి; వ్యాపార సంస్థలు ద్వీపాలలో నివసించే తెల్ల ( పలాగి ) వ్యాపారులను ప్రోత్సహించారు. జాన్ (జాక్ అని కూడా పిలుస్తారు) ఓ'బ్రెయిన్ అనే యురేపియన్ వ్యాపారి తువాలులో స్థిరపడ్డాడు. ఆయన తువాలులో స్థిరపడిన మొదటి యూరోపియన్గా గుర్తించబడ్డాడు; 1850లలో ఫనాఫుటిలో ఆయన వ్యాపారి అయ్యాడు. ఆయన ఫునఫుటి పారామౌంట్ చీఫ్ కుమార్తె సలైని వివాహం చేసుకున్నాడు. తరువాత రచయితగా విజయం సాధించిన లూయిస్ బెకే, ఏప్రిల్ 1880 ఏప్రెల్ నుండి ఆ సంవత్సరం చివర్లో తుఫానులో ట్రేడింగ్ స్టేషన్ నాశనమయ్యే వరకు నానుమంగాలో వ్యాపారిగా ఉన్నాడు.[49] తరువాత ఆయన నుకుఫెటౌలో వ్యాపారిగా మారాడు.[50][51][52]
1892లో హెచ్.ఎం.ఎస్ కెప్టెన్ ఎడ్వర్డ్ డేవిస్ ఈ దీవులను సందర్శించాడు. తరువాత ఆయన దీవులలోని వాణిజ్య కార్యకలాపాలు, వ్యాపారుల గురించి హెచ్.ఎం.ఎస్. కి నివేదించాడు. కెప్టెన్ డేవిస్ ఎలిస్ గ్రూప్లోని క్రింది వ్యాపారులను గుర్తించాడు: ఎడ్మండ్ డఫీ ( ననుమ ); జాక్ బక్లాండ్ ( నియుటావో ); హ్యారీ నిట్జ్ ( వైటుపు ); జాక్ ఓ'బ్రియన్ (ఫునాఫుటి); ఆల్ఫ్రెడ్ రెస్టీయాక్స్, ఎమిలే ఫెనిసోట్ ( నుకుఫెటౌ ); మార్టిన్ క్లీస్ ( నూయి ).[53][54] ఈ సమయంలో అత్యధిక సంఖ్యలో పలగి వ్యాపారులు పగడపు దిబ్బలలో నివసించి, వ్యాపార సంస్థలకు ఏజెంట్లుగా వ్యవహరించేవారు. కొన్ని దీవులలో పోటీ వ్యాపారులు ఉంటారు. డ్రైయర్ దీవులలో ఒకే వ్యాపారి ఉండవచ్చు.[44]
1890లలో పసిఫిక్ వాణిజ్య సంస్థల కార్యకలాపాలలో నిర్మాణాత్మక మార్పులు సంభవించాయి; ప్రతి ద్వీపంలో వ్యాపారులు నివసించే పద్ధతి నుండి “సూపర్ కార్గో” (ట్రేడింగ్ షిప్ కార్గో మేనేజర్) ఓడ ఒక ద్వీపాన్ని సందర్శించినప్పుడు ద్వీపవాసులతో నేరుగా కార్యకలాపాలు సాగించారు.[44] 1880లలో శిఖరాగ్రం చేరిన తరువాత,[44] తువాలులో పలాగి వ్యాపారుల సంఖ్య తగ్గింది; వారిలో చివరివారు నియుటావోలో ఫ్రెడ్ విబ్లే, నుకుఫెటౌలో ఆల్ఫ్రెడ్ రెస్టియక్స్,[55][56] నుయిలో మార్టిన్ క్లీస్ .[54] 1909 నాటికి వ్యాపార సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ నివసిస్తున్న పలాగి వ్యాపారులు లేరు.[44][54] అయినప్పటికీ విబ్లే, రెస్టియాక్స్, క్లీస్[57] మరణించే వరకు దీవులలోనే ఉన్నారు.
1841లో ఆల్ఫ్రెడ్ థామస్ అగేట్ గీసిన నుకుఫెటౌ అటోల్ నుండి వచ్చిన వ్యక్తి
చార్లెస్ విల్కేస్ ఆధ్వర్యంలో యునైటెడ్ స్టేట్స్ ఎక్స్ప్లోరింగ్ ఎక్స్పెడిషన్ 1841లో ఫునాఫుటి, నుకుఫెటౌ, వైటుపులను సందర్శించింది[58] ఈ యాత్రలో, చెక్కేవాడు, చిత్రకారుడు ఆల్ఫ్రెడ్ థామస్ అగేట్ నుకుఫెటౌ పురుషుల దుస్తులు మరియు పచ్చబొట్టు నమూనాలను రికార్డ్ చేశాడు.[59]
1885 లేదా 1886లో న్యూజిలాండ్ ఫోటోగ్రాఫర్ థామస్ ఆండ్రూ ఫనాఫుటి[60] , నుయ్లను సందర్శించాడు.[61][62]
1890లో న్యూజిలాండ్లోని ఆక్లాండ్కు చెందిన హెండర్సన్ మరియు మాక్ఫార్లేన్లకు స్వంతమైన జానెట్ నికోల్ అనే వాణిజ్య స్టీమర్లో రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్, ఆయన భార్య ఫ్యానీ వాండెగ్రిఫ్ట్ స్టీవెన్సన్, ఆమె కుమారుడు లాయిడ్ ఓస్బోర్న్, ప్రయాణించారు. ఇది సిడ్నీ, ఆక్లాండ్ మీదుగా మధ్య పసిఫిక్లోకి నడిచింది. .[63] జానెట్ నికోల్ ఎల్లిస్ దీవులలో మూడింటిని సందర్శించారు;[64] ఫనాఫుటి, నియుటావో, ననుమియా దీవులతీరంలో కొంత కాలం విశ్రాంతి తీసుకున్నట్ల ఫ్యానీ నమోదు చేయగా జేన్ రెస్టర్ వారు ఫనాఫుటి కంటే నుకుఫెటౌ వద్ద దిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు.[65] ఫనాఫుటిని ఆల్ఫ్రెడ్ రెస్టియక్స్, అతని భార్య లిటియాను కలిసినట్లు ఫ్యానీ వివరించినట్లుగా అవించారు; అయితే వారు 1880ల నుండి నుకుఫెటౌలో నివసిస్తున్నారు.[55][56] ఈ సముద్రయానం గురించిన కథనాన్ని ఫ్యానీ స్టీవెన్సన్ రాశారు. దీనిని ది క్రూయిజ్ ఆఫ్ ది జానెట్ నికోల్[66] రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్, లాయిడ్ ఓస్బోర్న్ తీసిన ఛాయాచిత్రాలతో పాటు అనే శీర్షికతో ప్రచురించారు.
ఉమెన్ ఆన్ ఫునఫుటి (1900) హ్యారీ క్లిఫోర్డ్ ఫాసెట్ ద్వారా ఫోటోగ్రఫీ
1894లో కౌంట్ రుడాల్ఫ్ ఫెస్టెటిక్స్ డి టోల్నా, అతని భార్య ఈలా ( నీ హగ్గిన్), ఆమె కుమార్తె బ్లాంచే హగ్గిన్ లే టోల్నా అనే పడవలో ఫునాఫుటిని సందర్శించారు.[67] కౌంట్ ఫనాఫుటిలో పురుషులు, స్త్రీలను ఫోటో తీయడానికి చాలా రోజులు గడిపాడు.[68][69]
పసిఫిక్ అటాల్స్ పగడపు లోతులో నిస్సార నీటి జీవుల జాడలు కనుగొనబడతాయో లేదో నిర్ధారించడానికి పగడపు దిబ్బల ఏర్పాటును పరిశోధించే ఉద్దేశ్యంతో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ నిర్వహించిన డ్రిల్లింగ్ ఫలితంగా ఇప్పుడు డార్విన్స్ డ్రిల్ అని పిలువబడే ప్రదేశంలో ఫనాఫుటి మీద బోర్హోల్స్ ,[70] ఉన్నాయి. పసిఫిక్లో చార్లెస్ డార్విన్ నిర్వహించిన ది స్ట్రక్చర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోరల్ రీఫ్స్పై పనిని అనుసరించి ఈ పరిశోధన జరిగింది. 1896, 1897, 1898 లలో డ్రిల్లింగ్ జరిగింది.[71] సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఎడ్జ్వర్త్ డేవిడ్, ప్రొఫెసర్ విలియం సోల్లాస్ ఆధ్వర్యంలో 1896లో జరిగిన "రాయల్ సొసైటీ, ఫనాఫుటి కోరల్ రీఫ్ బోరింగ్ ఎక్స్పెడిషన్"లో సభ్యుడు. ఆయన 1897లో ఈ యాత్రకు నాయకత్వం వహించాడు.[72] ఈ పర్యటనలలో ఫోటోగ్రాఫర్లు ఫనాఫుటిలోని ప్రజలు, సంఘాలు, దృశ్యాలను రికార్డ్ చేశారు.[73]
ఆస్ట్రేలియన్ మ్యూజియంలో ప్రకృతి శాస్త్రవేత్త చార్లెస్ హెడ్లీ 1896 యాత్రకు తోడుగా ఉన్నాడు. ఫనాఫుటిలో తన బసలో అకశేరుక, జాతి శాస్త్ర వస్తువులను సేకరించాడు. వీటి వివరణలు 1896 - 1900 మధ్య ఆస్ట్రేలియన్ మ్యూజియం సిడ్నీ మెమోయిర్ III లో ప్రచురించబడ్డాయి. హెడ్లీ జనరల్ అకౌంట్ ఆఫ్ ది అటోల్ ఆఫ్ ఫునాఫుటీ, ది ఎథ్నాలజీ ఆఫ్ ఫునాఫుటీ,[74] ది మొలస్కా ఆఫ్ ఫునాఫుటిని కూడా రాశాడు.[75][76] ఎడ్గార్ వెయిట్ కూడా 1896 యాత్రలో భాగం, ది మమ్మల్స్, రెప్టీక్స్, అండ్ ఫిష్స్ ఆఫ్ ఫనాఫుటిని ప్రచురించాడు.[77] విలియం రెయిన్బో ది ఇన్సెక్ట్ ఫనాఫుటి ఆఫ్ ఫనాలో ఫనాఫుటి వద్ద సేకరించిన సాలెపురుగులు, కీటకాలను వివరించాడు.[78]
1900లో యునైటెడ్ స్టేట్స్ ఫిష్ కమిషన్ పసిఫిక్ అటాల్స్లో పగడపు దిబ్బల మీద దర్యాప్తు చేస్తున్నప్పుడు యు.ఎస్.ఎఫ్.సి ఆల్బాట్రాస్ సందర్శన సందర్భంగా కెప్టెన్ క్లర్క్, ఫోటోగ్రాఫర్ హ్యారీ క్లిఫోర్డ్ ఫాసెట్, ఫనాఫుటి వద్ద ప్రజలు, సంఘాలు, దృశ్యాలను రికార్డ్ చేశాడు.[79]
ఎల్లిస్ దీవులు 1892 నుండి 1916 వరకు బ్రిటిష్ ప్రొటెక్టరేట్గా, బ్రిటిష్ వెస్ట్రన్ పసిఫిక్ టెరిటరీస్ (బిడల్యూపిటి)లో భాగంగా, గిల్బర్ట్ దీవులలోని రెసిడెంట్ కమిషనర్ ద్వారా నిర్వహించబడ్డాయి. (బిడల్యూపిటి) పరిపాలన 1916లో ముగిసింది, గిల్బర్ట్, ఎల్లిస్ దీవుల కాలనీ స్థాపించబడింది. ఇది అక్టోబర్ 1975 వరకు కొనసాగింది.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, బ్రిటిష్ కాలనీగా ఎల్లిస్ దీవులు మిత్రరాజ్యాలతో పొత్తు పెట్టుకున్నాయి. యుద్ధం ప్రారంభంలో ఇప్పుడు కిరిబాటిగా పిలువబడే మాకిన్, తారావా ఇతర దీవుల జపనీయులు దాడి చేసి ఆక్రమించారు . యునైటెడ్ స్టేట్స్ మెరైన్ కార్ప్స్ 1942 అక్టోబరు 2 న ఫునాఫుటీపై దిగింది[80] 1943 ఆగస్టులో ననుమియా, నుకుఫెటౌ మీదకు దిగింది. జపాన్ దళాలు ఆక్రమించిన గిల్బర్ట్ దీవులను ( కిరిబాటి ) తదుపరి సముద్ర దాడులకు సిద్ధం కావడానికి ఫనాఫుటిని ఒక స్థావరంగా ఉపయోగించారు.[81]
ద్వీపవాసులు అమెరికన్ దళాలకు ఫునఫుటి, ననుమియా, నుకుఫెటౌలలో వైమానిక స్థావరాలను నిర్మించడానికి, ఓడల నుండి సామాగ్రిని దించుటకు సహాయం చేశారు.[82] ఫునఫుటిలో, ద్వీపవాసులు చిన్న దీవులకు మారారు. తద్వారా అమెరికన్ దళాలు ఫోంగాఫాలేలో వైమానిక స్థావరం, నావల్ బేస్ ఫునఫుటిని నిర్మించడానికి వీలు కల్పించారు.[83] నావల్ కన్స్ట్రక్షన్ బెటాలియన్ ( సీబీస్ ) ఫోంగాఫాలే ద్వీపం సరస్సు వైపున ఒక సీప్లేన్ రాంప్ను నిర్మించింది, ఇది షార్ట్ -లాంగ్-రేంజ్ సీప్లేన్ల సీప్లేన్ కార్యకలాపాల కోసం నిర్మించబడింది. అలాగే ఫోంగాఫాలే మీద ఒక కాంపాక్ట్ పగడపు రన్వేను కూడా నిర్మించారు,[84] ననుమియా ఎయిర్ఫీల్డ్[85], నుకుఫెటౌ ఎయిర్ఫీల్డ్ను సృష్టించడానికి రన్వేలు కూడా నిర్మించబడ్డాయి.[86] యు.ఎస్.ఎన్ పెట్రోల్ టార్పెడో బోట్లు (పి.టి.ఎస్), సీప్లేన్లు 1942 నవంబర్ 2 నుండి 1944 మే 11 వరకు నావల్ బేస్ ఫనాఫుటిలో ఉన్నాయి.[87]
"ఆపరేషన్ గాల్వానిక్" అమలులో భాగమైన 1943 నవంబర్ 20న ప్రారంభమైన తారావా యుద్ధం, మాకిన్ యుద్ధానికి సన్నాహక సమయంలో తువాలు పగడపు దిబ్బలు వేదిక స్థావరాలుగా పనిచేశాయి.[88][89] యుద్ధం తరువాత ఫునాఫుటిలోని సైనిక వైమానిక స్థావరాన్ని ఫునాఫుటి అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేశారు.
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత - స్వాతంత్ర్యానికి పరివర్తన
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి ఏర్పడటం వలన వలసరాజ్యాల నిర్మూలన మీద ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ వలసరాజ్యాల నిర్మూలన ప్రక్రియకు కట్టుబడి ఉంది; పర్యవసానంగా, పసిఫిక్లోని బ్రిటిష్ కాలనీలు స్వీయ-నిర్ణయాత్మక మార్గంలో పయనించడం ప్రారంభించాయి.[90][91]
1974లో రాజ్యాంగంలో మార్పు ద్వారా గిల్బర్ట్ ఎల్లిస్ దీవుల కాలనీకి మంత్రివర్గ ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. ఆ సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరిగాయి.[92] గిల్బర్ట్ దీవులు, ఎల్లిస్ దీవులు ఒక్కొక్కటి తమ సొంత పరిపాలనను కలిగి ఉండాలా వద్దా అని నిర్ణయించడానికి 1974 లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.[93] ప్రజాభిప్రాయ సేకరణ ఫలితంగా, విభజన రెండు దశల్లో జరిగింది. 1975 అక్టోబరు 1 నుండి అమలులోకి వచ్చిన తువాలువాన్ ఆర్డర్ 1975 తువాలును దాని స్వంత ప్రభుత్వంతో ప్రత్యేక క్రౌన్ కాలనీగా గుర్తించింది.[94] రెండవ దశ 1976 జనవరి 1న జరిగింది ఆ సమయంలో గిల్బర్ట్, ఎల్లిస్ ఐలాండ్స్ కాలనీ పౌర సేవ నుండి ప్రత్యేక పరిపాలనలు సృష్టించబడ్డాయి.[95] : 169[96]
1976లో తువాలు తువాలువాన్ డాలర్ను స్వీకరించింది, దీని కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్తో పాటు చలామణి అవుతుంది.[97][98] దీనిని గతంలో 1966లో స్వీకరించారు.
1977 ఆగస్టు 27న బ్రిటిష్ కాలనీ ఆఫ్ తువాలు హౌస్ ఆఫ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 1977 అక్టోబర్ 1న తువాలు కాలనీ హౌస్ ఆఫ్ అసెంబ్లీలో తోరిపి లౌటి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1978 జూలైలో అసెంబ్లీ సభ రద్దు చేయబడింది. 1981 ఎన్నికలు జరిగే వరకు తోరిపి లౌటి ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగింది.[99]
1978 అక్టోబర్ 1న తువాలు స్వతంత్ర దేశంగా మారినప్పుడు టోరిపి లౌటి మొదటి ప్రధానమంత్రి అయ్యారు.[90][95] : 153–177 ఆ తేదీని దేశ స్వాతంత్ర్య దినోత్సవంగా కూడా జరుపుకుంటూ ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు.[100]
1982 అక్టోబర్ 26న రెండవ క్వీన్ ఎలిజబెత్ తువాలుకు ప్రత్యేక రాజ పర్యటన చేశారు.
2000 సెప్టెంబర్ 5న తువాలు ఐక్యరాజ్యసమితిలో 189వ సభ్యదేశంగా చేరింది.[101]
2022 నవంబర్ 15న సముద్ర మట్టం పెరుగుదల మధ్య, తువాలు తన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి మెటావర్స్లో స్వీయ-డిజిటల్ ప్రతిరూపాన్ని నిర్మించింది. అలాచేస్తూ ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా తువాలు తన ప్రణాళికలను ప్రకటించింది.[102]
2023 నవంబర్ 10 న తువాలు ఆస్ట్రేలియాతో ఫలేపిలి యూనియన్ ఒప్పందం మీద సంతకం చేసింది.[103] తువాలువాన్ భాషలో ఫలేపిలి మంచి స్వీయగౌరవం, సంరక్షణ, పరస్పర గౌరవం సాంప్రదాయ విలువలను వివరిస్తుంది.[104] ఈ ఒప్పందం వాతావరణ మార్పు, భద్రతను పరిష్కరిస్తుంది.[104] ఇది ప్రధాన ప్రకృతి వైపరీత్యాలు, ఆరోగ్యసమస్యలలో మహమ్మారి వంటి అంటువ్యాధులు, సాంప్రదాయ భద్రతా ముప్పులను కలిగి ఉన్న భద్రతా ముప్పులు వంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.[104] ఈ ఒప్పందం అమలులో ఆస్ట్రేలియా తువాలు ట్రస్ట్ ఫండ్, తువాలు కోస్టల్ అడాప్టేషన్ ప్రాజెక్ట్కు తన సహకారాన్ని పెంచుతుంది.[104] తువాలువాసులకు వాతావరణ సంబంధిత పరిశీలనను ప్రారంభించడానికి, ప్రతి సంవత్సరం 280 మంది తువాలు పౌరులు ఆస్ట్రేలియాకు వలస వెళ్ళడానికి ఆస్ట్రేలియా ఒక మార్గాన్ని కూడా అందిస్తుంది.[104][105]
ప్రధాన పట్టణాలు మరియు దీవులను చూపించే తువాలు మ్యాప్ ఫనాఫుటి అటోల్ వద్ద ఒక బీచ్
తువాలు ఒక అగ్నిపర్వత ద్వీపసమూహం. 3 రీఫ్ ద్వీపాలు ( ననుమంగా, నియుటావో, నియులాకిటా ), 6 నిజమైన అటోల్లు ( ఫునాఫుటి, ననుమెయా, నుయి, నుకుఫెటౌ, నుకులేలే, వైటుపు ) ఉన్నాయి.[106] దాని చిన్న, చెల్లాచెదురుగా ఉన్న లోతట్టు పగడపు దిబ్బల సమూహం పేలవమైన నేలను కలిగి ఉంది. మొత్తం భూభాగం కేవలం 26 చదరపు కిలో మీటర్లు (279,861,671 చదరపు అడుగులు) మాత్రమే ఉంది. ఇది ప్రపంచంలో నాల్గవ అతి చిన్న దేశంగా నిలిచింది. అత్యధిక ఎత్తు 4.6 మీటర్లు (15 అ.) సముద్ర మట్టానికి పైన నియులకిటాలో ఉంది; అయితే తువాలులోని లోతట్టు ప్రాంతాలు, రీఫ్ దీవులు తుఫానులు, తుఫానుల సమయంలో సముద్రపు నీటి వరదలకు గురవుతాయి.[107] ఫనాఫుటి టైడ్ గేజ్ వద్ద సముద్ర మట్టం 3.9 వద్ద పెరిగింది. సంవత్సరానికి మి.మీ., ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ.[108] అయితే నాలుగు దశాబ్దాలుగా ద్వీపాల భూభాగంలో నికరంగా 0.74 చదరపు కిలో మీటర్లు (7,965,293.7 చదరపు అడుగులు) (2.9%) పెరుగుదల కనిపించింది. అయితే మార్పులు ఏకరీతిగా లేవు 74% పెరుగుదల, 27% పరిమాణం తగ్గడం జరిగింది. 2018 నివేదిక ప్రకారం సముద్ర మట్టాలు పెరగడం వల్ల దిబ్బల ఉపరితలాల మీద తరంగ శక్తి బదిలీ పెరిగిందని దీనివల్ల ఇసుక తరలిపోతుందని ఫలితంగా ద్వీప తీరప్రాంతాలకు అలలు పేరుకుపోతాయని గుర్తించారు.[106] సముద్ర మట్టాలు పెరగడానికి అనుగుణంగా ద్వీపవాసులకు "ప్రత్యామ్నాయ" వ్యూహాలు ఉన్నాయని నివేదిక సూచించడాన్ని తువాలు ప్రధాన మంత్రి వ్యతిరేకించారు. సముద్ర మట్టం పెరుగుదల ఫలితంగా భూగర్భ జలాశయలలోకి ఉప్పునీరు చొరబడటం వంటి అంశాలను విస్మరించారని విమర్శించారు.[109]
ఫునాఫుటి అతిపెద్ద ద్వీపం 179°7'E, 8°30'S పై కేంద్రీకృతమై ఉన్న దీని వైశాల్యం సుమారు 25.1 కిలో మీటర్లు (15.6 మైళ్లు) (ఉ-ద) x 18.4 కిలో మీటర్లు (11.4 మైళ్లు) (ప-తూ) ఉన్న సరస్సు చుట్టూ అనేక ద్వీపాలను కలిగి ఉంది. పగడపు దిబ్బల మీద ఏడు సహజ దిబ్బ కాలువలతో సరస్సు చుట్టూ ఒక కంకణాకార దిబ్బ అంచు ఉంది.[110] 2010 మే ననుమియా, నుకులైలే, ఫనాఫుటి దిబ్బల ఆవాసాల మీద సర్వేలు జరిగాయి; ఈ తువాలు సముద్ర జీవ అధ్యయనంలో మొత్తం 317 చేప జాతులు నమోదు చేయబడ్డాయి. ఈ సర్వేలు తువాలులో గతంలో నమోదు కాని 66 జాతులను గుర్తించాయి. దీనితో య్గుర్తించబడిన మొత్తం జాతుల సంఖ్య 607కి చేరుకుంది.[111][112] తువాలు ప్రత్యేక ఆర్థిక మండలం (ఇ.ఇ.జెడ్) సుమారు 900,000 నైరుతి దిబ్బల సముద్ర ప్రాంతాన్ని కలిగి ఉంది. కి.మీ 2.[113]
తువాలు 1992 లో జీవ వైవిధ్యం మీద సమావేశం (సి.బి.డి) పై సంతకం చేసి, 2002 డిసెంబరులో దానిని ఆమోదించింది.[114][115] తువాలు దీవులలో ప్రధానమైన వృక్షసంపదగా సాగు చేయబడిన కొబ్బరి అడవులు ఉన్నాయి. ఇది 43% భూమిని ఆక్రమించి ఉంది. స్థానిక విశాలమైన అడవి వృక్షసంపద రకాల్లో 4.1% కి పరిమితం చేయబడింది.[116] తువాలులో పశ్చిమ పాలినేషియన్ ఉష్ణమండల తేమ అడవులు పర్యావరణ ప్రాంతం ఉంది.[117]
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఎయిర్ఫీల్డ్ (ఇప్పుడు ఫనాఫుటి అంతర్జాతీయ విమానాశ్రయం ) నిర్మించబడినప్పుడు ఫోంగాఫేల్లోని ఫనాఫుటి లగూన్ తూర్పు తీరప్రాంతం సవరించబడింది. రన్వేను రూపొందించడానికి పగడపు దీవి పగడపు స్థావరాన్ని నింపడానికి ఉపయోగించారు. ఫలితంగా ఏర్పడిన గుంటలు మంచినీటి జలాశయాల మీద ప్రభావం చూపాయి. ఫనాఫుటి లోని లోతట్టు ప్రాంతాలలో అధిక ఆటుపోట్లకు సముద్రపు నీరు చొచ్చుకుపోయిన కారణంగా కొలనులనులో రంధ్రాలు ఏర్పడి పగడపు శిల పైకి లేవడం చూడవచ్చు.[118][119] 2014లో తువాలు బారో పిట్స్ రెమిడియేషన్ (బి.పి.ఆర్) ప్రాజెక్ట్ ఆమోదించబడింది. తద్వారా 10 బారో పిట్లను సరస్సు నుండి ఇసుకతో నింపుతారు. సహజ చెరువు అయిన టఫువా చెరువును వదిలివేస్తారు. బి.పి.ఆర్ ప్రాజెక్టుకు న్యూజిలాండ్ ప్రభుత్వం నిధులు సమకూర్చింది.[120] ఈ ప్రాజెక్టును 2015లో చేపట్టారు. గుంతలను పూడ్చడానికి, ద్వీపంలో జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి సరస్సు నుండి 365,000 చదరపు మీటర్ల ఇసుకను తవ్వారు. ఈ ప్రాజెక్టు ఫోంగాఫేల్లో ఉపయోగించదగిన భూమి స్థలాన్ని ఎనిమిది శాతం పెంచింది.[121]
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఫనాఫుటి లగూన్లోని ఫోంగాఫాల్ మీద అనేక స్తంభాలు కూడా నిర్మించబడ్డాయి; బీచ్ ప్రాంతాలు అంతటా లోతైన నీటి ప్రవేశ మార్గాలను తవ్వారు. దిబ్బ, తీరప్రాంతంలో ఈ మార్పులు అలల నమూనాలలో మార్పులకు దారితీశాయి. మునుపటి కాలంతో పోలిస్తే బీచ్లలో తక్కువ ఇసుక పేరుకుపోయింది. తీరప్రాంతాన్ని స్థిరపరచడానికి చేసిన ప్రయత్నాలు ఆశించిన ప్రభావాన్ని సాధించలేదు.[122] 2022 డిసెంబరులో తువాలు కోస్టల్ అడాప్టేషన్ ప్రాజెక్ట్లో భాగమైన ఫనాఫుటి పునరుద్ధరణ ప్రాజెక్ట్ మీద పని ప్రారంభమైంది. 780 మీటర్లు (2,560 అ.) పొడవు 100 మీటర్లు (330 అ.) మీటర్ల వెడల్పు,ఉన్న ఫోంగాఫాలే ద్వీపంలో ఒక ప్లాట్ఫామ్ను నిర్మించడానికి సరస్సు నుండి ఇసుకను తవ్వారు. మొత్తం వైశాల్యం సుమారు 7.8 హెక్టార్లు. (19.27 ఎకరాలు), ఇది సముద్ర మట్టం పెరుగుదలకు 2100 సంవత్సరం తర్వాత తుఫాను తరంగాల చేరువలో ఉండేలా రూపొందించబడింది.[123] ఈ ప్లాట్ఫామ్ క్వీన్ ఎలిజబెత్ పార్క్ (క్యు.ఇ.పి) పునరుద్ధరణ ఉత్తర సరిహద్దు నుండి ప్రారంభమై ఉత్తర టౌసోవా బీచ్ గ్రోయిన్, కాటాలినా రాంప్ హార్బర్ వరకు విస్తరించి ఉంది.[124]
1998 - 2001 మధ్య జరిగిన ఎల్ నినో సంఘటనల సమయంలో ఫనాఫుటి వద్ద ఉన్న దిబ్బలు దెబ్బతిన్నాయి. సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల ఫలితంగా సగటున 70% స్టాఘోర్న్ ( అక్రోపోరా ఎస్.పి.పి.) పగడాలు తెల్లబారాయి.[125][126][127] ఒక రీఫ్ పునరుద్ధరణ ప్రాజెక్ట్ రీఫ్ పునరుద్ధరణ పద్ధతులను పరిశోధించింది; ;[128] జపాన్ పరిశోధకులు ఫోరామినిఫెరాను ప్రవేశపెట్టడం ద్వారా పగడపు దిబ్బలను పునర్నిర్మించడాన్ని గురించి పరిశోధించారు.[129] జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ప్రాజెక్ట్ పర్యావరణ వ్యవస్థ పునరావాసం, పునరుత్పత్తి, ఇసుక ఉత్పత్తికి మద్దతు ద్వారా సముద్ర మట్టం పెరుగుదల నియంత్రించి తువాలు తీరం స్థితిస్థాపకతను పెంచడానికి రూపొందించబడింది.[130]
పెరుగుతున్న జనాభా చేపల నిల్వల డిమాండ్ పెరగడానికి దారితీసి చేపల ఉత్పత్తి ఒత్తిడికి గురైంది.[126] అయితే ఫనాఫుటి పరిరక్షణ ప్రాంతం ఫనాఫుటి సరస్సు అంతటా చేపల జనాభాను నిలబెట్టడానికి నిర్ణీతప్రాంతంలో చేపలవేట నిషేధించబడింది.[131] ఫనాఫుటి వనరుల మీద జనాభా ఒత్తిడి, సరిపోని పారిశుద్ధ్య వ్యవస్థలు కాలుష్యానికి దారితీశాయి.[132][133] 2009 నాటి వేస్ట్ ఆపరేషన్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్, యూరోపియన్ యూనియన్ నిధులు సమకూర్చే వ్యర్థాల నిర్వహణ, కాలుష్య నియంత్రణ ప్రాజెక్టులకు చట్టపరమైన విధానాన్ని అందిస్తుంది. ఇది పర్యావరణ-పారిశుధ్య వ్యవస్థలలో సేంద్రీయ వ్యర్థాలను కంపోస్టింగ్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.[134] పర్యావరణ పరిరక్షణ (చెత్త, వ్యర్థాల నియంత్రణ) నిబంధన 2013 జీవఅధోకరణం చెందని పదార్థాల దిగుమతి నిర్వహణను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది. తువాలులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఒక సమస్య గా మారింది. ఎందుకంటే దిగుమతి చేసుకున్న ఆహారం, ఇతర వస్తువులు ఎక్కువగా ప్లాస్టిక్ కంటైనర్లు లేదా ప్యాకేజింగ్లో సరఫరా చేయబడతాయి.
2023లో తువాలుతో కలిసి వాతావరణ మార్పులకు గురయ్యే ఇతర దీవుల ప్రభుత్వాలు ( ఫిజి, నియు, సోలమన్ దీవులు, టోంగా వనాటు ) "శిలాజ ఇంధన రహిత పసిఫిక్కు న్యాయమైన పరివర్తన కోసం పోర్ట్ విలా పిలుపు"ను ప్రారంభించాయి. శిలాజ ఇంధనాలను దశలవారీగా తొలగించాలని పునరుత్పాదక శక్తికి 'వేగవంతమైన, న్యాయమైన పరివర్తన ', పర్యావరణ విధ్వంసం నేరాన్ని ప్రవేశపెట్టడంతో సహా పర్యావరణ చట్టాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చాయి.[135][136][137]
తువాలులో రెండు విభిన్న రుతువులు ఉంటాయి. నవంబర్ నుండి ఏప్రిల్ వరకు వర్షాకాలం, మే నుండి అక్టోబర్ వరకు పొడి కాలం ఉంటుంది.[138] నవంబర్ నుండి ఏప్రిల్ వరకు పశ్చిమ గాలులు భారీ వర్షాలు వాతావరణ పరిస్థితులకు కారణమౌతూ ఉంటాయి. ఈ కాలాన్ని టౌ-ఓ-లాలో అని పిలుస్తారు. మే నుండి అక్టోబర్ వరకు ఉష్ణమండల ఉష్ణోగ్రతలు తూర్పు గాలుల ద్వారా నియంత్రించబడతాయి.
భూమధ్యరేఖ, మధ్య పసిఫిక్లో సముద్ర ఉష్ణోగ్రతలలో మార్పుల వల్ల కలిగే ఎల్ నినో, లా నినా ప్రభావాలను తువాలు అనుభవిస్తుంది. ఎల్ నినో ప్రభావాలు ఉష్ణమండల తుఫానులు, తుఫానుల అవకాశాలను పెంచుతాయి, లా నినాన్ ప్రభావాలు కరువు అవకాశాలను పెంచుతాయి. సాధారణంగా తువాలు దీవులు నెలకు 200 - 400 మి.మీ. (8 - 16 అం.) మధ్య ఉష్ణోగ్రతను పొందుతాయి. మధ్య పసిఫిక్ మహాసముద్రం లా నినా కాలాల నుండి ఎల్ నినో కాలాల వరకు మార్పులను అనుభవిస్తుంది.[139]
చుట్టుపక్కల నిస్సార షెల్ఫుతో నిండిన లోతట్టు ద్వీపాలు కాబట్టి తువాలు ప్రజలు సముద్ర మట్టంలో మార్పులు, తుఫానులకు గురవుతుంటారు.[141][142][143] తువాలు ఎత్తైన ప్రదేశం సముద్ర మట్టానికి కేవలం 4.6 మీటర్లు (15 అ.) ఎత్తు మాత్రమే ఉంటుంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల కలిగే ప్రభావాల గురించి తువాలువాన్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.[144] రాబోయే 100 సంవత్సరాలలో సముద్ర మట్టం 20–40 సెంటీ మీటర్లు (7.9–15.7 అంగుళాలు) పెరగడం వల్ల తువాలు నివాసయోగ్యం కాదని అంచనా వేయబడింది.[145][146] 2018లో ప్రచురించబడిన ఒక అధ్యయనం 1971 - 2014 మధ్య తువాలులోని తొమ్మిది దీవులు, 101 రీఫ్ దీవుల భూ విస్తీర్ణంలో మార్పును అంచనా వేసింది. 75% ద్వీపాలు విస్తీర్ణంలో పెరిగాయని, మొత్తం 2% కంటే ఎక్కువ పెరుగుదల ఉందని సూచిస్తుంది.[147] ఆ సమయంలో తువాలు ప్రధాన మంత్రిగా ఉన్న ఎనెలే సోపోగా పరిశోధనకు ప్రతిస్పందిస్తూ తువాలు విస్తరించడం లేదని, అదనపు నివాసయోగ్యమైన భూమిని పొందలేదని పేర్కొన్నాడు.[148][149] దీవులను ఖాళీ చేయడమే చివరి మార్గం అని సోపోగా కూడా అన్నారు.[150]
తువాలు దీవులకు సంబంధించి సముద్ర మట్టంలో కొలవగల మార్పులు ఉన్నాయా అనేది వివాదాస్పద అంశం అయింది. .[151][152] 1993 కి ముందు ఫనాఫుటి సముద్ర మట్ట రికార్డులతో సంబంధం ఉన్న సమస్యలు ఉన్నాయి. దీని ఫలితంగా విశ్లేషణ కోసం మరింత విశ్వసనీయమైన డేటాను అందించడానికి రికార్డింగ్ సాంకేతికత మెరుగుపడింది.[146] 2002లో అందుబాటులో ఉన్న డేటా నుండి తీసుకున్న తీర్మానాలలో తువాలు దీవులకు సంబంధించి సముద్ర మట్ట మార్పు అంచనాల అనిశ్చితి స్థాయి ప్రతిబింబిస్తుంది.[153] 1993 లో ఆస్ట్రేలియన్ నేషనల్ టైడల్ ఫెసిలిటీ (ఎన్.టి.ఎఫ్) ఆస్ట్రేలియా ఎయిడ్- స్పాన్సర్ చేసిన సౌత్ పసిఫిక్ సముద్ర మట్టం - వాతావరణ పర్యవేక్షణ ప్రాజెక్టులో భాగంగా ఆధునిక అక్వాట్రాక్ అకౌస్టిక్ గేజ్ను ఏర్పాటు చేసింది.[154] ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ప్రచురించిన పసిఫిక్ క్లైమేట్ చేంజ్ సైన్స్ ప్రోగ్రామ్ 2011 నివేదిక ఇలా ముగించింది: "1993 నుండి ఉపగ్రహ ఆల్టిమీటర్ల ద్వారా కొలిచిన తువాలు సమీపంలో సముద్ర మట్టం పెరుగుదల వార్షికంగా దాదాపు 5 mమీ. (0.2 అం.) ఉంటుంది."[155]
తువాలువాసులకు గత పది నుండి పదిహేను సంవత్సరాలలో గమనించదగిన పరివర్తనలు సముద్ర మట్టాలలో మార్పులు కనిపిస్తున్నందున తువాలు ఒక జాతీయ కార్యాచరణ ప్రణాళికను స్వీకరించింది.[156] వీటిలో సముద్రపు నీరు పోరస్ పగడపు శిల ద్వారా పైకి లేచి అధిక ఆటుపోట్ల సమయంలో కొలనునీటిని అధికం చేస్తుంది. వసంతకాలపు అలలు, కింగ్ టైడ్ల సమయంలో విమానాశ్రయంతో సహా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి.[118][119][157][158][159][160]
2022 నవంబరులో న్యాయం, కమ్యూనికేషన్ & విదేశాంగ మంత్రి సైమన్ కోఫ్, సముద్ర మట్టాలు పెరగడం, గ్లోబల్ వార్మింగ్ను ఎదుర్కోవడంలో బయటి ప్రపంచం వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని దేశం తన చరిత్ర, సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నంలో మెటావర్స్లో తన వర్చువల్ వెర్షన్ను అప్లోడ్ చేస్తుందని ప్రకటించారు.[161]
వాతావరణ మార్పు గురించిన ప్రధాన ఆందోళనలు నేషనల్ అడాప్టేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ (ఎన్.ఎ.పి.ఎ) ప్రారంభించి అభివృద్ధి చేయడానికి దారితీశాయి. వాతావరణ మార్పు నుండి వచ్చే ప్రతికూల ప్రభావాల పరిమాణాన్ని తగ్గించడానికి ఈ అనుసరణ చర్యలు అవసరం. ఎన్.ఎ.పి.ఎ అన్ని విభిన్న ఇతివృత్తాలతో ఏడు అనుసరణ ప్రాజెక్టులను ఎంచుకుంది. అవి: తీరప్రాంతం, వ్యవసాయం, నీరు, ఆరోగ్యం, మత్స్య సంపద (రెండు వేర్వేరు ప్రాజెక్టులు), విపత్తు. ఉదాహరణకు "కోస్టల్" ప్రాజెక్ట్ లాగా ఈ ప్రాజెక్టులలో ఒకదాని "లక్ష్యం" "తీరప్రాంతాల స్థితిస్థాపకతను పెంచడం, వాతావరణ మార్పులకు స్థిరపడటం". "నీరు" ప్రాజెక్టుకు సంబంధించి, ఇది "గృహ నీటి సామర్థ్యాన్ని పెంచడం, నీటి సేకరణ ఉపకరణాలు, నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా తరచుగా వచ్చే నీటి కొరతకు అనుగుణంగా మార్చుకోవడం".[162]
సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి తువాలు దీవుల స్థితి పెంచే ఉద్దేశ్యంతో 2017లో తువాలులో కోస్టల్ అడాప్టేషన్ ప్రాజెక్ట్ (టి.సి.పి) ప్రారంభించబడింది.[162] తువాలు యు.ఎన్.డి.పి మద్దతుతో గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుండి వాతావరణ ఆర్థిక సహాయం అందుకుంది ఈ సహాయం అందుకున్న పసిఫిక్లో దేశాలలో తువాలు మొట్టమొదటి దేశంగా గుర్తించబడుతుంది.[162] 2022 డిసెంబరులో ఫనాఫుటి పునరుద్ధరణ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులో ఫనాఫుటి మీద మీటర్ల పొడవు 100 మీటర్లు (330 అ.), 780 మీటర్లు (2,560 అ.) మీటర్ల వెడల్పు ఒక ప్లాట్ఫామ్ను నిర్మించడానికి సరస్సు నుండి ఇసుకను తవ్వడం జరుగుతుంది. మొత్తం వైశాల్యం సుమారు 7.8 హెక్టార్లు. (19.27 ఎకరాలు), 2100 సంవత్సరం తర్వాత ఇది సముద్ర మట్టం పెరుగుదలకు, తుఫాను తరంగాలను చేరువకాకుండా దీవులను రక్షించే విధంగా రూపొందించబడింది.[162] ఆస్ట్రేలియన్ విదేశాంగ వాణిజ్య శాఖ (డి.ఎఫ్.ఎ.టి) కూడా టి.సి.ఎ.పి.లో కోసం నిధులు సమకూర్చింది. ననుమియా, ననుమాగా బయటి దీవులలో కూడ తుఫానుల వల్ల తీరప్రాంత నష్టాన్ని తగ్గించే లక్ష్యంతో టి.సి.ఎ.పి. మరిన్ని ప్రాజెక్టులు చేపడుతుంది.
ఫనాఫుటి అటోల్ యొక్క మహాసముద్ర వైపు తుఫాను దిబ్బలను చూపిస్తుంది, ఇది అటోల్లోని ఎత్తైన ప్రదేశం.
తక్కువ ఎత్తులో ఉండటం కారణంగా ఈ ద్వీపాలు ఉష్ణమండల తుఫానుల ప్రభావాలకు (ప్రస్తుతం, భవిష్యత్తులో) సముద్ర మట్టం పెరుగుదల ముప్పుకు గురవుతాయి.[132][163][164] 2016 లో ప్రకృతి వైపరీత్యాలకు బయటి దీవులు బాగా సిద్ధంగా ఉండేలా ఇరిడియం ఉపగ్రహ నెట్వర్క్ హెచ్చరిక వ్యవస్థను ప్రవేశపెట్టారు.[165]
ఈ దీవులలో నియులకిటా దీవి సముద్ర మట్టానికి అత్యధిక ఎత్తులో (4.6 మీటర్లు (15 అ.)) ఉంది.[166] అందువల్ల తువాలు మిగిలిన ద్వీపదేశాలలో ( మాల్దీవులు తర్వాత) రెండవ అత్యల్ప గరిష్ట ఎత్తును కలిగి ఉంది. దీవుల సముద్రతీరాలలో ఉన్న ఇరుకైన తుఫాను దిబ్బలలో ఎత్తైన ప్రదేశాలు ఉంటాయి. ఉష్ణమండల తుఫానులలో ఇవి మరింత అధికరించే అవకాశం ఉంది.ఇది అక్టోబర్ 1972లో సంభవించిన బెబేతో తుఫానులో సంభవింది. తువాలువాన్ ద్వీపాల గుండా వెళ్ళింది.[167] బెబే తుఫాను ఫనాఫుటిని ముంచెత్తింది. ఈ తుఫాను ద్వీపంలోని 95% నిర్మాణాలను నాశనం చేసింది. తుఫానులో 6 మంది మరణించారు.[168] తుఫాను ఉప్పెన కారణంగా మంచినీటి వనరు కలుషితమయ్యాయి.[169]
ఫనాఫుటిలో వ్యాపారి అయిన జార్జ్ వెస్ట్బ్రూక్, 1883 డిసెంబరున 23-24న ఫనాఫుటిలో తుఫాను సంభవించినట్లు నమోదు చేశాడు.[170] 1886 మార్చి 17–18 తేదీలలో నుకులైలేను తుఫాను తాకింది.[170] 1894లో వచ్చిన తుఫాను ఈ దీవులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది.[171]
1940 - 1970ల మధ్య తువాలులో దశాబ్దానికి సగటున మూడు తుఫానులు సంభవించాయి; అయితే 1980లలో ఎనిమిది తుఫానులు సంభవించాయి.[107] వ్యక్తిగత తుఫానుల ప్రభావం గాలుల శక్తి తుఫాను అధిక ఆటుపోట్లతో ఉంటుందా లేదా అనే దాని మీద ఆధారపడి నిర్ణయించబడుతూ ఉంటుంది. 1979లో మెలి తుఫాను ఫునాఫుటిలోని టెపుకా విలి విలి ద్వీపాన్ని నాశనం చేసింది. తుఫాను సమయంలో దానిలోని వృక్షసంపద, ఇసుకలో ఎక్కువ భాగం కొట్టుకుపోయాయి. కొన్ని రోజుల తరువాత దీవులను ప్రభావితం చేసిన ఉష్ణమండల వాయుగుండంతో పాటు, తీవ్రమైన ఉష్ణమండల తుఫాను ఓఫా తువాలు మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది. చాలా ద్వీపాలు వృక్షసంపద పంటలకు నష్టం కలిగించాయని నివేదించాయి.[172][173] 1997 మార్చి 2 న గవిన్ తుఫాను సంభవించింది. 1996-97 తుఫాను తువాలును ప్రభావితం చేసిన మూడు ఉష్ణమండల తుఫానులలో ఇది మొదటిది. ఆ సీజన్ చివరిలో హినా, కెలి తుఫానులు వచ్చాయి.
2015 మార్చిలో పామ్ తుఫాను సృష్టించిన గాలులు, తుఫాను కారణంగా 3 to 5 మీటర్లు (9.8 to 16.4 అ.) ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. బయటి దీవుల దిబ్బను చీల్చుకుని ఇళ్ళు, పంటలు, మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించింది.[174][175] అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నుయ్లో మంచినీటి వనరులు నాశనమయ్యాయి లేదా కలుషితమయ్యాయి.[176][177][178] నుయ్, నుకుఫెటౌలలో వరదలు సంభవించడంతో అనేక కుటుంబాలు తరలింపు కేంద్రాలలో లేదా ఇతర కుటుంబాలతో తలదాచుకున్నాయి.[179] 3 మధ్య దీవులలో (నుయ్, నుకుఫెటౌ, వైటుపు) నుయ్ అత్యధిక నష్టాన్ని చవిచూసింది;[180] నుయ్, నుకుఫెటౌ రెండూ 90% పంటలను కోల్పోయాయి.[181] 3 ఉత్తర దీవులలో (నానుమంగా, నియుటావో, నానుమియా) నానుమంగా అత్యధిక నష్టాన్ని చవిచూసింది, 60 నుండి 100 ఇళ్ళు వరదల్లో మునిగిపోయాయి. అలల కారణంగా ఆరోగ్య కేంద్రం కూడా దెబ్బతింది.[181] ఫనాఫుటి పరిరక్షణ ప్రాంతంలో భాగమైన వాసఫువా ద్వీపం, పామ్ తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతింది. కొబ్బరి చెట్లు కొట్టుకుపోయాయి, ఆ దీవి ఇసుక దిబ్బలా మిగిలిపోయింది.[182][183]
తువాలు ప్రభుత్వం పామ్ తుఫాను వల్ల దీవులకు కలిగిన నష్టాన్ని అంచనా వేసింది. తుఫాను శిథిలాలను శుభ్రం చేయడానికి వైద్య సహాయం, ఆహారం, సహాయాన్ని అందించింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు తువాలుకు పునరుద్ధరణకు సహాయం చేయడానికి సాంకేతిక, నిధులు, వస్తు సహాయాన్ని అందించాయి. వాటిలో డబల్యూ.హెచ్… , యునిసెఫ్ ఇప్రొ, యు.ఎన్.డి.పి. ఆసియా-పసిఫిక్ అభివృద్ధి సమాచార కార్యక్రమం, ఒ.సి.హె…ఎ. , ప్రపంచ బ్యాంకు, డి.ఎఫ్టి.ఇ.టి. న్యూజిలాండ్ రెడ్ క్రాస్ & ఐ.ఎఫ్.ఆ.సి. , ఫిజి నేషనల్ యూనివర్సిటీ, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, యు.ఎ.ఇ., తైవాన్, యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వాలు ఉన్నాయి.[184]
2020 లో జనవరి 16 -19 మధ్య సంభవించిన టినో తుఫాను 500 కి.మీ వేగంతో పయనిస్తూ తువాలు దక్షిణప్రాంతం దాటింది. ఈ తుఫాను మొత్తం తువాలును ప్రభావితం చేశాయి. [185][186]
తువాలు సముద్ర మట్టాన్ని వసంతకాలంలో అధిక ఆటుపోట్లకు గురిచేస్తున్న “ పెరిజియన్ స్ప్రింగ్సం టైడ్ “ కారణంగా కూడా తువాలు ప్రభావితమవుతుంది.[187] 2006న ఫిబ్రవరి 24 న తిరిగి 2015 ఫిబ్రవరి 19 న[188] ఎత్తు 3.4 మీటర్లు (11 అ.) ఎత్తున అలలు ఎగిసిపడినట్లు తువాలు వాతావరణ సేవ నమోదు చేసంది. చారిత్రక సముద్ర మట్టం పెరుగుదల ఫలితంగా కింగ్ టైడ్ సంఘటనలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతాయి. లా నినా ప్రభావాలు లేదా స్థానిక తుఫానులు, అలల వల్ల సముద్ర మట్టాలు మరింత పెరిగినప్పుడు ఇది మరింత తీవ్రమవుతుంది.[189][190]
తువాలులో సంరక్షించబడుతున్న వర్షపు నీరే దేశానికి ప్రధాన మంచినీటి వనరుగా ఉంది. ఈ దీపాలలో వైత్పు, ననుమియా ద్వీపాలలో మాత్రమే భూగర్భజలాలు ఉన్నాయి. పైకప్పులు, గట్టర్లు, పైపుల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల వర్షపు నీటి సంరక్షణ ప్రభావం తగ్గిపోతుంది.[191][192] ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ సహాయ కార్యక్రమాలు ఫనాఫుటి, బయటి దీవులలో నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.[193]
ఫనాఫుటిలో వర్షపు నీటి సంరక్షణకు రివర్స్ ఆస్మాసిస్ (ఆర్/ఓ) డీశాలినేషన్ యూనిట్లు తోడ్పడతాయి. 65 క్యూబిక్ మీటర్లు డీశాలినేషన్ ప్లాంట్ రోజుకు దాదాపు 40 క్యూబిక్ మీటర్లు ఉత్పత్తి చేస్తుంది. (ఆర్/ఓ) నీటి నిల్వ 30% కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించబడింది. అయితే ట్యాంకర్ ద్వారా పంపిణీ చేయబడిన నీటితో గృహ నిల్వ సరఫరాలను తిరిగి నింపడానికి (ఆర్/ఓ) డీశాలినేషన్ యూనిట్లు నిరంతరం పనిచేస్తూనే ఉండాలని డిమాండ్ అధికరిస్తుంది. ప్రతి క్యూబిక్ మీటరుకు A$3.50 ఖర్చుతో నీటిని సరఫరా చేయబడుతుంది. ఉత్పత్తి, డెలివరీ ఖర్చు క్యూబిక్ మీటరుకు కి A$6 వ్యయం ఔతుందని అంచనా వేయబడింది. తేడాను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందచేస్తూ ఉంది.[191]
2012 జూలైలో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక నివేదకుడు తువాలు ప్రభుత్వం సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ఒక జాతీయ నీటి వ్యూహాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చాడు.[194][195] 2012లో తువాలు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫండ్/ సొపాక్ స్పాన్సర్ చేసిన ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ (ఐ.డబల్యూ.ఆర్.ఎం) ప్రాజెక్ట్, పసిఫిక్ అడాప్టేషన్ టు క్లైమేట్ చేంజ్ (పి.ఎ.సి.సి) ప్రాజెక్ట్ కింద జాతీయ జల వనరుల విధానాన్ని అభివృద్ధి చేసింది. తాగునీరు, శుభ్రపరచడం, సమాజం, సాంస్కృతిక కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ నీటి ప్రణాళిక ఒక వ్యక్తికి రోజుకు 50 నుండి 100 లీటర్ల నీటిని లక్ష్యంగా పెట్టుకుంది.[191]
ఫోంగాఫేల్లోని సెప్టిక్ ట్యాంకుల నుండి వచ్చే మురుగునీటి బురద శుద్ధిని మెరుగుపరచడానికి, కంపోస్టింగ్ టాయిలెట్లను అమలు చేయడానికి తువాలు సౌత్ పసిఫిక్ అప్లైడ్ జియోసైన్స్ కమిషన్ (సొపాక్) తో కలిసి పనిచేస్తోంది, ఎందుకంటే సెప్టిక్ ట్యాంకులు అటోల్ -ఉపరితలంలోని మంచినీటి లెన్స్లోకి అలాగే సముద్రం సరస్సులోకి లీక్ అవుతున్నాయి. కంపోస్టింగ్ టాయిలెట్లు నీటి వినియోగాన్ని 30% వరకు తగ్గిస్తాయి.[191]
తువాలు రాజ్యాంగం "తువాలు అత్యున్నత చట్టం", "అన్ని ఇతర చట్టాలు “ ఈ రాజ్యాంగానికి లోబడి ఉండేలా రూపొందించబడి వర్తింపజేయబడతాయి" అని పేర్కొంది; ఇది హక్కుల బిల్లు, ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛల రక్షణ సూత్రాలను నిర్దేశిస్తుంది. 2023 సెప్టెంబరు 5 న తువాలు పార్లమెంట్ తువాలు రాజ్యాంగ చట్టం 2023ను ఆమోదించింది.[196] రాజ్యాంగంలో మార్పులు 2023 అక్టోబరు నుండి అమల్లోకి వచ్చాయి.[197]
తువాలు అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంగా ఉంది. తువాలు రాజుగా కామన్వెల్త్ రాజ్యం మూడవ చార్లెస్ ఉన్నారు. రాజు యునైటెడ్ కింగ్డమ్లో నివసిస్తున్నందున ఆయనకు బదులుగా తువాలులో ఒక గవర్నర్ జనరల్ ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆయనను తువాలు ప్రధాన మంత్రి సలహా మేరకు నియమించబడతాడు.[99] రాచరికాన్ని రద్దు చేసి గణతంత్ర రాజ్యాన్ని స్థాపించాలని కోరుతూ 1986 - 2008 లో ప్రజాభిప్రాయ సేకరణలు జరిగాయి. కానీ రెండు సందర్భాలలోనూ రాచరికం అలాగే కొనసాగాలని నిర్ణయించబడింది.
1974 నుండి (తువాలు బ్రిటిష్ కాలనీ సృష్టి) స్వాతంత్ర్యం వరకు తువాలు శాసనసభను హౌస్ ఆఫ్ ది అసెంబ్లీ లేదా ఫేల్ ఐ ఫోనో అని పిలిచేవారు. 1978 అక్టోబర్లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అసెంబ్లీ సభను తువాలు పార్లమెంట్ లేదా పలమెనే ఓ తువాలుగా మార్చారు.[99] పార్లమెంటు కూర్చునే ప్రదేశాన్ని వైకు మనేప అంటారు.[198] ప్రతి ద్వీపంలోని మనేపా అనేది ఒక బహిరంగ సమావేశ స్థలం, ఇక్కడ నాయకులు, పెద్దలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.[198]
ఏకసభ్య పార్లమెంటులో 16 మంది సభ్యులు ఉంటారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రిని ( ప్రభుత్వ అధిపతి ) పార్లమెంటు స్పీకర్ను ఎన్నుకుంటారు. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే మంత్రులను ప్రధానమంత్రి సలహా మేరకు గవర్నర్ జనరల్ నియమిస్తారు. అధికారిక రాజకీయ పార్టీలు లేవు; ఎన్నికల ప్రచారాలు ఎక్కువగా వ్యక్తిగత/కుటుంబ సంబంధాలు, పలుకుబడిమీద ఆధారపడి ఉంటాయి.
2023 రాజ్యాంగ సవరణలు ఫలేకాపులేను తువాలు దీవుల సాంప్రదాయ పాలక అధికారులుగా గుర్తిస్తాయి.[199]
తువాలు నేషనల్ లైబ్రరీ అండ్ ఆర్కైవ్స్ "లో తువాలు సాంస్కృతిక, సామాజిక, రాజకీయ వారసత్వం మీద కీలకమైన డాక్యుమెంటేషన్"ను ఉన్నాయి. వీటిలో వలస పాలన నుండి మిగిలి ఉన్న రికార్డులు, అలాగే తువాలు ప్రభుత్వ ఆర్కైవ్లు ఉన్నాయి.[200]
తువాలు ఈ క్రింది గ్మానవ హక్కుల ఒప్పందాలలో ఒక రాష్ట్ర పార్టీ: పిల్లల హక్కుల మీద సమావేశం (సి.ఆర్.సి); మహిళల మీద అన్ని రకాల వివక్షతలను నిర్మూలించడానికి సమావేశం (సి.ఇ.డి.ఎ.డబల్యూ) ; వికలాంగుల హక్కుల కొరకు సమావేశం (సి.ఆర్.పి.డి).[201] యూనివర్సల్ పీరియాడిక్ రివ్యూ (యు.పి.ఆర్), సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్.డి.జి.ఎస్) కింద మానవ హక్కులు గౌరవించబడుతున్నాయని నిర్ధారించడానికి తువాలు కట్టుబడి ఉంది.
జాతీయ వ్యూహ ప్రణాళిక టె కేటే - నేషనల్ స్ట్రాటజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ 2021-2030 తువాలు ప్రభుత్వ అభివృద్ధి ఎజెండాను నిర్దేశిస్తుంది.[202][203]ఇది టె కకీగా III - నేషనల్ స్ట్రాటజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్-2016-2020 (టికె III) నుండి అనుసరించబడింది. ఈ వ్యూహాత్మక ప్రణాళికలలో అభివృద్ధి రంగాలలో విద్య; వాతావరణ మార్పు; పర్యావరణం; వలస, పట్టణీకరణ ఉన్నాయి.[202][204]
దేశవ్యాప్తంగా ప్రభుత్వేతర మహిళా హక్కుల సంఘాలకు తువాలు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఉమెన్ ఒక గొడుగు సంస్థగా పనిచేస్తుంది. ఇది ప్రభుత్వంతో అనుసంధానంగా పనిచేస్తుంది.[205]
ఎనిమిది ఐలాండ్ కోర్టులు, ల్యాండ్స్ కోర్టులు ఉన్నాయి; భూ వివాదాలకు సంబంధించిన అప్పీళ్లు ల్యాండ్స్ కోర్ట్స్ అప్పీల్ ప్యానెల్కు చేయబడతాయి. ఐలాండ్ కోర్టులు, ల్యాండ్స్ కోర్టుల అప్పీల్ ప్యానెల్ నుండి అప్పీళ్లు మేజిస్ట్రేట్ కోర్టుకు చేయబడతాయి. ఇది $T 10,000 వరకు ఉన్న సివిల్ కేసులను విచారించే అధికార పరిధిని కలిగి ఉంటుంది. తువాలు హైకోర్టు దేశంలోని అత్యున్నత న్యాయస్థానంగా విశేష అధికారం కలిగి ఉంటుంది. ఇది తువాలు చట్టాన్ని నిర్ణయించడానికి, దిగువ కోర్టుల నుండి అప్పీళ్లను విచారించడానికి అపరిమిత అధికారం కలిగి ఉటుంది. హైకోర్టు తీర్పులను తువాలు అప్పీల్ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ కోర్టు నుండి, హిజ్ మెజెస్టి ఇన్ కౌన్సిల్కు (లండన్లోని ప్రివీ కౌన్సిల్కు) అప్పీల్ చేసుకునే హక్కు ఉంది.[206][207]
న్యాయవ్యవస్థ విషయానికొస్తే "1980లలో నానుమియాలోని ఐలాండ్ కోర్టుకు మొదటి మహిళా ఐలాండ్ కోర్టు మేజిస్ట్రేట్ను నియమించారు. 1990ల ప్రారంభంలో నుకులైలేలో మరొకరిని నియమించారు." "తువాలులోని ఐలాండ్ కోర్టులలో ఒకే ఒక మహిళా మేజిస్ట్రేట్ పనిచేసంది. గతంలో" పోలిస్తే (2007 నాటికి) 7 మంది మహిళా మేజిస్ట్రేట్లు ఉన్నారు.[208]
తువాలు పార్లమెంట్ ఓటు వేసి చట్టాలు రూపొందించిన తరువాత తువాలు చట్టంగా మారతాయి ; యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ ఆమోదించిన కొన్ని చట్టాలు (తువాలు బ్రిటిష్ ప్రొటెక్టరేట్ లేదా బ్రిటిష్ కాలనీగా ఉన్న సమయంలో); సాధారణ చట్టం ; ఆచార చట్టం (ముఖ్యంగా భూమి యాజమాన్యానికి సంబంధించి) ఉన్నాయి.[206][207] భూమి అద్దె వ్యవస్థ ఎక్కువగా కైతాసి (విస్తరించిన కుటుంబ యాజమాన్యం) పై ఆధారపడి ఉంటుంది.[209]
2017 నవంబర్లో తువాలు గవర్నర్ జనరల్ ఇయాకోబా ఇటలేలిని తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్-వెన్ సందర్శించారు
తువాలు పసిఫిక్ కమ్యూనిటీ (ఎస్.పి.సి) పాల్గొని పనిచేస్తుంది. అలాగే పసిఫిక్ దీవుల ఫోరం, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశంగా ఉంది. ఇది 2000 నుండి న్యూయార్క్ నగరంలోని ఐక్యరాజ్యసమితిలో ఒక మిషన్ను నిర్వహిస్తోంది. 1993లో తువాలు ఆసియా అభివృద్ధి బ్యాంకులో సభ్యదేశంగా చేరింది, ,[210] 2010లో ప్రపంచ బ్యాంకులో సభ్యదేశంగా చేరింది.[211].
తువాలు ఫిజి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (ఇది 2018 నుండి తువాలులో హైకమిషన్ను నిర్వహిస్తోంది),[212] జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ మరియు యూరోపియన్ యూనియన్లతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. ఇది తైవాన్తో దౌత్య సంబంధాలను కలిగి ఉంది;[213][214][215] ఇది తువాలులో రాయబార కార్యాలయాన్ని నిర్వహిస్తుంది. దీవులలో పెద్ద సహాయ కార్యక్రమాన్ని కలిగి ఉంది.[216][217]
దక్షిణాఫ్రికాలోని 2002 లో జోహన్నెస్బర్గ్లో నిర్వహించబడిన ఐఖ్యరాజ్యసమితి ఎర్త్ సమ్మిట్లో, ఇతర అంతర్జాతీయ వేదికలలో తువాలుకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ సమావేశాలలో గ్లోబల్ వార్మింగ్, సముద్రమట్టం పెరుగుదల గురించి ఆందోళనను ప్రోత్సహించబడింది. క్యోటో ప్రోటోకాల్ ఆమోదం అమలును తువాలు సమర్థిస్తుంది. 2009 డిసెంబరు కోపెన్హాగన్లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సమావేశంలో వాతావరణ మార్పు మీద చర్చలను దీవులు నిలిపివేసాయి. మరికొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు కార్బన్ ఉద్గారాల తగ్గింపు మీద ఒప్పందాలకు పూర్తిగా కట్టుబడి ఉండటం లేదని భయపడ్డారు. వారి ప్రధాన సంధానకర్త ఇలా అన్నాడు, "వాతావరణ మార్పులకు ప్రపంచంలోనే అత్యంత హాని కలిగించే దేశాలలో తువాలు ఒకటి. మన భవిష్యత్తు ఈ సమావేశం ఫలితం మీద ఆధారపడి ఉంటుంది."[218]
ప్రపంచ వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలకు తమ దుర్బలత్వం గురించి ఆందోళన చెందుతున్న చిన్న ద్వీప, లోతట్టు తీరప్రాంత దేశాల కూటమి అయిన అలయన్స్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ స్టేట్స్ (ఎ.ఒ.ఎస్.ఐ.ఎస్)లో తువాలు పాల్గొంటుంది. 2013న సెప్టెంబరు 5 న సంతకం చేయబడిన మజురో డిక్లరేషన్ ఆధారంగా తువాలు 100% పునరుత్పాదక శక్తితో (2013 - 2020 మధ్య) విద్యుత్ ఉత్పత్తిని అమలు చేయడానికి కట్టుబడి ఉంది. దీనిని సోలార్ పి.వి. (డిమాండ్లో 95%), బయోడీజిల్ (డిమాండ్లో 5%) ఉపయోగించి అమలు చేయాలని ప్రతిపాదించబడింది. పవన విద్యుత్ ఉత్పత్తి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు.[219] తువాలు పసిఫిక్ ఐలాండ్స్ అప్లైడ్ జియోసైన్స్ కమిషన్ (సొపాక్), సెక్రటేరియట్ ఆఫ్ ది పసిఫిక్ రీజినల్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్.పి.ఆర్.ఇ.పి) కార్యకలాపాలలో పాల్గొంటుంది.[220]
తువాలు యునైటెడ్ స్టేట్స్తో స్నేహ ఒప్పందంలో ఒక పార్టీగా ఉంది. ఇది స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే సంతకం చేయబడింది. 1983లో యు.ఎస్. సెనేట్ ద్వారా ఆమోదించబడింది. 1856 నాటి గ్వానో దీవుల చట్టం ప్రకారం నాలుగు టువాలువాన్ దీవులకు ( ఫునాఫుటి, నుకుఫెటౌ, నుకులైలే, నియులకిటా ) మునుపటి ప్రాదేశిక వాదనలను యునైటెడ్ స్టేట్స్ త్యజించింది.[221]
తువాలు పసిఫిక్ ఐలాండ్స్ ఫోరం ఫిషరీస్ ఏజెన్సీ (ఎఫ్.ఎఫ్.ఎ)[222] , వెస్ట్రన్ అండ్ సెంట్రల్ పసిఫిక్ ఫిషరీస్ కమిషన్ (డబల్యు.సి.పి.ఎఫ్.సి) కార్యకలాపాలలో పాల్గొంటుంది.[223] తువాలువాన్ ప్రభుత్వం, యు.ఎస్. ప్రభుత్వం, ఇతర పసిఫిక్ దీవుల ప్రభుత్వాలు కలిసి చేసిన దక్షిణ పసిఫిక్ ట్యూనా ఒప్పందం (ఎస్.పి.టి.టి)లో 1988లో అమల్లోకి వచ్చంది.[224] ఉష్ణమండల పశ్చిమ పసిఫిక్లో ట్యూనా పర్స్ సీన్ ఫిషింగ్ నిర్వహణను సూచించే నౌరు ఒప్పందంలో తువాలు కూడా సభ్యదేశంగా ఉంది. అమెరికా, పసిఫిక్ దీవుల దేశాలు పశ్చిమ, మధ్య పసిఫిక్లోని మత్స్య సంపదకు యు.ఎస్. ట్యూనా పడవలను అనుమతించడానికి బహుపాక్షిక మత్స్య ఒప్పందాన్ని (దక్షిణ పసిఫిక్ ట్యూనా ఒప్పందాన్ని కలిగి ఉంటుంది) గురించి చర్చించాయి. తువాలు పసిఫిక్ దీవుల ఫోరం ఫిషరీస్ ఏజెన్సీ (ఎఫ్.ఎఫ్.ఎ) లోని ఇతర సభ్యదేశాలు, యునైటెడ్ స్టేట్స్ కలిసి 2015 సంవత్సరానికి ట్యూనా చేపల వేట ఒప్పందాన్ని నిర్ణయించాయి; దీర్ఘకాలిక ఒప్పందం మీద చర్చలు జరుగుతాయి. ఈ ఒప్పందం నౌరు ఒప్పందం పొడిగింపు,$90 మిలియన్ల అమెరికా డాలర్లు చెల్లింపుకు బదులుగా తువాలు యు.ఎస్. జెండా ఉన్న పర్స్ సీన్ నౌకలు ఈ ప్రాంతంలో 8,300 రోజులు చేపలు పట్టడానికి వీలు కల్పిస్తుంది. ఈ నిధులు యు.ఎస్.-ప్రభుత్వ సహకారాల ద్వారా సమకూరుతాయి.[225] 2015లో తువాలు మిగిలిన కొన్ని దేశాలతో కలిసి తమ సొంత మత్స్య సంపదను అభివృద్ధి చేసుకోవడానికి, నిలబెట్టుకోవడానికి చొరవలను నిరోధించాయి.ఇందులో తువాలు భాగంగా నౌకాదళాలకు ఫిషింగ్ డేలను విక్రయించడానికి నిరాకరించింది.[226] 2016లో సహజ వనరుల మంత్రిత్వశాఖ డబల్యూ,సి.పి.ఎఫ్ కన్వెన్షన్ ఆర్టికల్ 30మీద దృష్టిని ఆకర్షిసారించింది. ఇది అభివృద్ధి చెందుతున్న చిన్న-ద్వీప దేశాల మీద ఉంచే నిర్వహణ భారాన్ని పరిగణనలోకి తీసుకునే సభ్యుల సమిష్టి బాధ్యతను వివరిస్తుంది.[227]
2013 జూలైలో పసిఫిక్ ఎ.సి.పి దేశాలు యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఇ.పి.ఎ) కోసం చర్చల సందర్భంలో 2006లో ప్రారంభమైన పసిఫిక్ ప్రాంతీయ వాణిజ్య, అభివృద్ధి సౌకర్యాన్ని స్థాపించడానికి తువాలు అవగాహన ఒప్పందం (ఎం.ఒ.యు)మీద సంతకం చేసింది. , ఎయిడ్-ఫర్-ట్రేడ్ (ఎ.ఎఫ్.టి) అవసరాలకు మద్దతుగా పసిఫిక్ ద్వీప దేశాలకు సహాయం అందజేయడాన్ని మెరుగుపరచడానికి ఈ సౌకర్యం కల్పించబడింది. పసిఫిక్ ఎ.సి.పి. దేశాలు యూరోపియన్ యూనియన్తో కోటోనౌ ఒప్పందం మీద సంతకం చేసాయి.[228] 2017 మే 31న ఫనాఫుటిలో కోటోనౌ ఒప్పందం ప్రకారం తువాలు, యూరోపియన్ యూనియన్ మధ్య మొదటి మెరుగైన ఉన్నత స్థాయి రాజకీయ సంభాషణ జరిగింది.[229]
2016 ,ఫిబ్రవరి 18 న తువాలు పసిఫిక్ దీవుల అభివృద్ధి వేదిక చార్టర్ మీద సంతకం చేసి అధికారికంగా పసిఫిక్ దీవుల అభివృద్ధి వేదిక (పి.ఐ.డి.ఎఫ్)లో చేరింది.[230] 2017 జూన్ లో తువాలు పసిఫిక్ అగ్రిమెంట్ ఆన్ క్లోజర్ ఎకనామిక్ రిలేషన్స్ (పి.ఎ.సి.ఇ.ఆర్) పై సంతకం చేసింది.[231][232] 2022 జనవరి తువాలు పి.ఎ.సి.ఇ.ఆర్ ఒప్పందాన్ని ఆమోదించింది. ఒప్పందం మీద సంతకం చేసిన దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను తగ్గించడానికి ఈ ఒప్పందం రూపొందించబడింది. ప్రస్తుత దిగుమతి సుంకాలు సున్నాకి తగ్గుతాయ. కస్టమ్స్ విధానాలు, మూల నియమాలను సమన్వయం చేయడం, అలాగే సేవల వాణిజ్యానికి పరిమితులను తొలగించడం, దేశాల మధ్య కార్మిక ప్రవేశ పథకాలను మెరుగుపరచడం వంటి వాణిజ్య అడ్డంకులను తగ్గించడానికి అదనపు చర్యలను ఒప్పందం పరిశీలిస్తుంది.[233]
తువాలులో సాధారణ సైనిక దళాలు లేవు. తువాలు సైన్యం కోసం డబ్బు ఖర్చు చేయదు. తువాలు జాతీయ పోలీసు దళం ప్రధాన కార్యాలయం ఫునాఫుటిలోఉంది. ఇందులో తువాలు పోలీస్ ఫోర్స్, సముద్ర నిఘా విభాగం, కస్టమ్స్, జైళ్లు ఇమ్మిగ్రేషన్లను శాఖలు ఉన్నాయి. పోలీసు అధికారులు బ్రిటిష్ తరహా యూనిఫాంలు ధరిస్తారు.
1994 నుండి 2019 వరకు తువాలు తన 200 కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలాన్ని ఆస్ట్రేలియా అందించిన పసిఫిక్-క్లాస్ పెట్రోల్ బోట్ హెచ్.ఎం.టి.ఎ.ఎస్. టె మటైలితో సంరక్షించింది.[234] 2019 లో ఆస్ట్రేలియా గార్డియన్-క్లాస్ పెట్రోల్ బోట్ను ప్రత్యామ్నాయ బహుమతిగా ఇచ్చింది. హెచ్.ఎం.టి.ఎ.ఎస్. టె మటైలితో II అని పేరు పెట్టబడిన ఇది సముద్ర నిఘా, మత్స్యకార గస్తీ, శోధన, రెస్క్యూ మిషన్లలో ఉపయోగించడానికి ఉద్దేశించబడింది. (" .హెచ్.ఎం.టి.ఎ.ఎస్.అంటే హిజ్/హర్ మెజెస్టి'స్ తువాలున్ స్టేట్ షిప్ లేదా హిజ్/హర్ మెజెస్టి'స్ తువాలు సర్వైలెన్స్ షిప్ .) టె మటైలి II తుఫానుల వల్ల తీవ్రంగా దెబ్బతింది.[235] 2024 అక్టోబర్ 16న ఆస్ట్రేలియా తువాలుకు గార్డియన్-క్లాస్ పెట్రోల్ బోట్ను అప్పగించింది, దీనికి .హెచ్.ఎం.టి.ఎ.ఎస్ టె మటైలి III[236] అని పేరు పెట్టారు.
2023 మేలో తువాలు ప్రభుత్వం నెదర్లాండ్స్లో ఉన్న సీ షెపర్డ్ గ్లోబల్తో ఒక అవగాహన ఒప్పందం (ఎం.ఒ.యు) సంతకం చేసింది. ఇది తువాలు ప్రత్యేక ఆర్థిక మండలం (ఇ.ఇ.జెడ్)లో చట్టవిరుద్ధమైన, నివేదించబడని, నియంత్రించబడని (ఐ.యు.యు) చేపల వేటను ఎదుర్కోవడానికి ఉద్దేశించబడింది.[237] సీ షెపర్డ్ గ్లోబల్ 54.6 54.6 మీటర్లు (179 అ.) మోటారు నౌక, తువాలు చట్ట అమలు కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి.[237] ' తువాలు తువాలు పోలీసు దళానికి చెందిన అల్లంకే అధికారులకు ఇ.ఇ.జెడ్. ఐ.యు.యు కార్యకలాపాలలో నిమగ్నమైన ఫిషింగ్ ఓడలను ఎక్కడానికి, తనిఖీ చేయడానికి, అరెస్టు చేయడానికి అధికారం కల్పిస్తుంది.[237]
తువాలులో పురుష స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం.[238] తువాలులో నేరాలు ఒక ముఖ్యమైన సామాజిక సమస్య కాదు ఎందుకంటే అక్కడ ప్రభావవంతమైన నేర న్యాయ వ్యవస్థ ఉంది. అంతేకాకుండా ఫలేకాపులే (ప్రతి ద్వీపంలోని పెద్దల సాంప్రదాయ సమావేశం) ప్రభావం, తువాలున్ సమాజంలో మతపరమైన సంస్థల కేంద్ర పాత్ర కూడా దీనికి ఉంది.
తువాలులో ఆరు అటాల్స్, మూడు రీఫ్ దీవులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి దేశంలోని ఒక జిల్లాను ఏర్పరుస్తాయి. అతి చిన్నదైన నియులకిటా ద్వీపం నియుటావోలో భాగంగా నిర్వహించబడుతుంది. 2017 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలు, వాటి ద్వీపాల సంఖ్య, జనాభా ఈ క్రింది విధంగా ఉన్నాయి:
ప్రతి ద్వీపానికి దాని స్వంత హై-చీఫ్ ( ఉలు-అలికి ), అనేక ఉప-చీఫ్లు ( అలికిస్ ), ఒక కమ్యూనిటీ కౌన్సిల్ ( ఫలేకౌపులే ) ఉంటాయి. ఫలేకాపులే దీనిని టె సినా ఓ ఫెనువా (భూమి బూడిద వెంట్రుకలు) అని కూడా పిలుస్తారు. ఇది పెద్దల సాంప్రదాయ సమావేశం.
ఉలు-అలికి, అలికి స్థానిక స్థాయిలో అనధికారిక అధికారాన్ని కలిగి ఉంటారు. పూర్వీకులను పూర్వీకుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 1997లో ఫలేకాపులే చట్టం ఆమోదించబడినప్పటి నుండి[239] ఫలేకాపులే అధికారాలు విధులు ప్రతి పగడపు దీవికి ఎన్నికైన గ్రామ అధ్యక్షుడు పులే ఓ కౌపులేతో పంచుకోబడ్డాయి.[240]
తువాలులో ఒక టౌన్ కౌన్సిల్ (ఫునాఫుటి). ఏడు ద్వీప కౌన్సిల్లకు ఐ.ఎస్.ఒ 3166-2 కోడ్లు నిర్వచించబడ్డాయి. ఇప్పుడు దాని స్వంత ద్వీప మండలిని కలిగి ఉన్న నియులాకిటా జాబితాలో లేదు. ఎందుకంటే ఇది నియుటావోలో భాగంగా నిర్వహించబడుతుంది.
2002 జనాభా లెక్కల ప్రకారం జనసంఖ్య 9,561.[241] 2017 జనాభా లెక్కల ప్రకారం జనసంఖ్య 10,645.[242][243] 2020లో ఇటీవలి మూల్యాంకనం జనసంఖ్య 11,342గా పేర్కొంది.[244] తువాలు జనాభా ప్రధానంగా పాలినేషియన్ జాతికి చెందినది. జనాభాలో దాదాపు 5.6% మంది గిల్బర్టీస్ మాట్లాడే మైక్రోనేషియన్లు, ముఖ్యంగా నుయ్లో అధికంగా ఉన్నారు.[242]
తువాలులో మహిళల ఆయుర్దాయం 70.2 సంవత్సరాలు, పురుషులకు 65.6 సంవత్సరాలు (2018 అంచనా).[245] దేశ జనాభా పెరుగుదల రేటు 0.86% (2018 అంచనా).[245] నికర వలస రేటు −6.6 వలస(లు)/సంఖ్యాపరంగా 1000 ఉంటారని అంచనా వేయబడింది (2018 అంచనా).[245] తువాలులో గ్లోబల్ వార్మింగ్ ముప్పు వలసలకు ఇంకా ప్రధాన ప్రేరణ కాదు ఎందుకంటే తువాలువాన్లు జీవనశైలి, సంస్కృతి, గుర్తింపు కారణాల వల్ల దీవులలో నివసించడానికి ఇష్టపడతారు.[246]
1947 నుండి 1983 వరకు వైటుపు నుండి అనేక మంది తువాలువాన్లు ఫిజిలోని ఒక ద్వీపమైన కియోవాకు వలస వచ్చారు.[247] తువాలు నుండి స్థిరపడిన వారికి 2005 లో ఫిజియన్ పౌరసత్వం లభించింది. ఇటీవలి సంవత్సరాలలో, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వలస లేదా కాలానుగుణ పనులకు ప్రాథమిక గమ్యస్థానాలుగా ఉన్నాయి.
2014లో న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అండ్ ప్రొటెక్షన్ ట్రిబ్యునల్కు ఒక తువాలువాన్ కుటుంబాన్ని " వాతావరణ మార్పు శరణార్థులు " అని బహిష్కరించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన అప్పీల్ మీద దృష్టి సారించబడింది. తువాలు పర్యావరణ క్షీణత ఫలితంగా వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు.[248] అయితే ఆ కుటుంబానికి నివాస అనుమతులు మంజూరు చేయడం శరణార్థి దావాకు సంబంధం లేని కారణాల మీద జరిగింది.[249] సంబంధిత వలస చట్టం ప్రకారం నివాస అనుమతుల మంజూరును సమర్థించే "మానవతా స్వభావం అసాధారణ పరిస్థితులు" ఉన్నందున ఆ కుటుంబం వారి విజ్ఞప్తిలో విజయం సాధించింది. ఎందుకంటే ఆ కుటుంబం న్యూజిలాండ్ సమాజంలో విలీనం చేయబడింది. కుటుంబం న్యూజిలాండ్కు సమర్థవంతంగా మకాం మార్చుకున్నారు.[249] నిజానికి, 2013లో శరణార్థుల స్థితికి సంబంధించిన సమావేశం (1951) ప్రకారం కిరిబాటి వ్యక్తి "వాతావరణ మార్పు శరణార్థి" అని చేసిన వాదనను న్యూజిలాండ్ హైకోర్టు సమర్థనీయం కాదని నిర్ధారించింది. ఎందుకంటే ఐదు నిర్దేశించిన శరణార్థి సమావేశ మైదానాలలో దేనికీ సంబంధించి ఎటువంటి హింస లేదా తీవ్రమైన హాని జరగలేదు.[250] కుటుంబ పునరేకీకరణ వంటి కారణాల వల్ల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లకు శాశ్వత వలసలు ఆ దేశాల వలస చట్టాలకు అనుగుణంగా ఉండాలి.[251]
2001లో న్యూజిలాండ్ పసిఫిక్ యాక్సెస్ కేటగిరీని ప్రకటించింది. ఇది తువాలువాన్లకు వార్షికంగా 75 వర్క్ పర్మిట్లను అందించింది.[252] దరఖాస్తుదారులు పసిఫిక్ యాక్సెస్ కేటగిరీ (పి.ఎ.సి) బ్యాలెట్ల కోసం నమోదు చేసుకుంటారు; ప్రధాన ప్రమాణం ఏమిటంటే ప్రధాన దరఖాస్తుదారుడు న్యూజిలాండ్ యజమాని నుండి ఉద్యోగ ఆఫర్ను కలిగి ఉండాలి.[253] 2007లో ప్రవేశపెట్టబడిన గుర్తింపు పొందిన సీజనల్ ఎంప్లాయర్ (ఆర్.ఎస్.ఇ) వర్క్ పాలసీ ప్రకారం, తువాలువాన్లు న్యూజిలాండ్లోని ఉద్యానవన, ద్రాక్షసాగు పరిశ్రమలలో కాలానుగుణ ఉపాధిని కూడా పొందగలుగుతున్నారు. దీని ప్రకారం తువాలు ఇతర పసిఫిక్ దీవుల నుండి 5,000 మంది కార్మికులకు ఉపాధి లభిస్తుంది.[254] తువాలువాన్లు ఆస్ట్రేలియన్ పసిఫిక్ సీజనల్ వర్కర్ ప్రోగ్రామ్లో పాల్గొనవచ్చ. ఇది పసిఫిక్ ద్వీపవాసులు ఆస్ట్రేలియన్ వ్యవసాయ పరిశ్రమలో ముఖ్యంగా పత్తి, చెరకు కార్యకలాపాలలో; ఫిషింగ్ పరిశ్రమలో, ముఖ్యంగా ఆక్వాకల్చర్లో; పర్యాటక పరిశ్రమలో వసతి ప్రదాతలతో కాలానుగుణ ఉపాధిని పొందేందుకు వీలు కల్పిస్తుంది.[255]
2023 నవంబరు 10న తువాలు , ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక దౌత్య సంబంధం అయిన ఫలేపిలి యూనియన్ మీద సంతకం చేసింది. దీని కింద తువాలు పౌరులు ఆస్ట్రేలియాకు వలస వెళ్లడానికి ఆస్ట్రేలియా ఒక మార్గాన్ని అందిస్తుంది. తద్వారా తువాలువాన్లకు వాతావరణ సంబంధిత చలనశీలతను అనుమతిస్తుంది.[103][104]
తువాలు భాష, ఆగ్లం తువాలు జాతీయ భాషలుగా ఉన్నాయి. తువాలువాన్ భాష పాలినేషియన్ భాషల ఎల్లిసియన్ సమూహానికి చెందినది. ఇది హవాయియన్, మావోరి, తాహితీయన్, రాపా నుయ్, సమోవాన్, టోంగాన్ వంటి అన్ని ఇతర పాలినేషియన్ భాషలకు సుదూర సంబంధం కలిగి ఉంటుంది.[256] ఇది మైక్రోనేషియా, ఉత్తర - మధ్య మెలనేషియాలోని పాలినేషియన్ అవుట్లైయర్లలో మాట్లాడే భాషలకు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. 19వ శతాబ్దం చివరిలో - 20వ శతాబ్దం ప్రారంభంలో క్రైస్తవ మిషనరీలు ప్రధానంగా సమోవాన్ భాష మాట్లాడేవారు కాబట్టి తువాలువాన్ భాష సమోవాన్ భాష నుండి జనించింది.[42][256]
నుయ్లో దాదాపు అందరూ తువాలువాన్ భాషను మాట్లాడుతారు. అయితే గిల్బర్టీస్తో సమానమైన మైక్రోనేషియన్ భాష మాట్లాడతారు.[256][257] అధికారిక భాషలలో ఒకటి అయిన ఆంగ్లభాషను రోజువారీ వాడుకలో మాట్లాడరు. పార్లమెంట్ అధికారిక కార్యక్రమాలు తువాలువాన్ భాషలోనే నిర్వహించబడతాయి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13,000 మంది తువాలువాన్ మాట్లాడేవారు ఉన్నారు.[258][259] రేడియో తువాలు తువాలు భాషా కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది.[260][261][262]
ఫెటు అయో లిమా (మార్నింగ్ స్టార్ చర్చి), కాంగ్రిగేషనల్ క్రిస్టియన్ చర్చి ఆఫ్ టువాలు
కాల్వినిస్ట్ సంప్రదాయంలో భాగమైన కాంగ్రిగేషనల్ క్రిస్టియన్ చర్చ్ ఆఫ్ తువాలు, స్టేట్ చర్చి ఆఫ్ తువాలు;[263] ఆచరణలో ఇది "ప్రధాన జాతీయ కార్యక్రమాలలో ప్రత్యేక సేవలను నిర్వహించే అధికారాన్ని" మాత్రమే కలిగి ఉంది.[264] ఈ ద్వీపసమూహంలోని 10,837 (2012 జనాభా లెక్కలు) నివాసితులలో 97% మంది దీని అనుచరులుగా ఉన్నారు.[263][265] తువాలు రాజ్యాంగం మత స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. అందులో ఆచరించే స్వేచ్ఛ, మతం మార్చుకునే స్వేచ్ఛ, పాఠశాలలో మత బోధనను పొందకుండా ఉండే హక్కు లేదా పాఠశాలలో మతపరమైన వేడుకలకు హాజరు కాకపోవడం "తన మతం లేదా నమ్మకానికి విరుద్ధమైన ప్రమాణం చేయకపోవడం లేదా ధృవీకరణ చేయకపోవడం" వంటి హక్కులు ఉన్నాయి.[266]
ఇతర క్రైస్తవ సమూహాలలో మిషన్ సుయి యూరిస్ ఆఫ్ ఫనాఫుటి సేవ చేస్తున్న కాథలిక్ సమాజం జనాభాలో 2.8% సెవెంత్-డే అడ్వెంటిస్ట్ ఉన్నారు.[245] దాని స్వంత అంచనాల ప్రకారం తువాలు బ్రెథ్రెన్ చర్చిలో దాదాపు 500 మంది సభ్యులు ఉన్నారు (అంటే జనాభాలో 4.5%).[267]
బహాయి విశ్వాసం తువాలులో అతిపెద్ద మైనారిటీ మతంగా ఉంది. ఇది అతిపెద్ద క్రైస్తవేతర మతంగా ఇది జనాభాలో 2.0% ఉంది.[245] బహాయిలు ననుమెయా,[268] ఫునాఫుటిలో ఉన్నారు.[269] అహ్మదీయ ముస్లిం సమాజంలో దాదాపు 50 మంది సభ్యులు (జనాభాలో 0.4%) ఉన్నారు.[270]
క్రైస్తవ మతం పరిచయంతో పూర్వీకుల ఆత్మలు, ఇతర దేవతల ( ఆనిమిజం ) ఆరాధన ముగిసింది.[271] అలాగే వాకా-అటువా (పాత మతాల పూజారులు) శక్తి కూడా మరుగునపడింది.[272] 1870లో రెవరెండ్ శామ్యూల్ జేమ్స్ విట్మీ పూర్వీకుల ఆరాధనను సాధారణ ఆచారంగా వర్ణించినప్పటికీ, లౌమువా కోఫ్ పూజా వస్తువులు ద్వీపం నుండి ద్వీపానికి మారుతూ ఉంటాయని వర్ణించారు.[273]
ఫనాఫుటిలోని ప్రిన్సెస్ మార్గరెట్ హాస్పిటల్ తువాలులోని ఏకైక ఆసుపత్రిగా వైద్య సేవలను అందించే ప్రధాన సంస్థగా ఉంది.
20వ శతాబ్దం చివరి నుండి తువాలులో అతిపెద్ద ఆరోగ్య సమస్యలు ఊబకాయానికి సంబంధించినవి. మరణానికి ప్రధాన కారణంగా గుండె జబ్బులు[274] దీని తరువాత మధుమేహం[275] అధిక రక్తపోటు ఉన్నాయి.[274] 2016 లో ఎక్కువ మరణాలు గుండె జబ్బుల వల్ల సంభవించాయి. మరణానికి ఇతర కారణాలలో డయాబెటిస్ మెల్లిటస్, రక్తపోటు, ఊబకాయం, సెరిబ్రల్-వాస్కులర్ వ్యాధి ఉన్నాయి.[276]
తువాలులో 6 నుండి 15 సంవత్సరాల వయస్సు మధ్య నిర్బంధ విద్య ఉచితంగా అందించబడుతుంది . ప్రతి ద్వీపంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంటుంది. వైటుపులోమొతుఫుయా సెకండరీ స్కూల్ ఉంది.[277] పాఠశాల కాలంలో విద్యార్థులకు పాఠశాలా ప్రాంగణంలో నివాస వసతి సౌకర్యం ఉంది. ప్రతి పాఠశాల సెలవుల్లో వారి స్వస్థలాలకు తిరిగి వెళతారు. తువాలు చర్చి నిర్వహించే డే స్కూల్ అయిన ఫెటువాలు సెకండరీ స్కూల్, ఫనాఫుటిలో ఉంది.[278]
ఫెటువాలు కేంబ్రిడ్జ్ సిలబస్ను అందిస్తుంది. మోటుఫౌవా 10వ సంవత్సరంలో ఫిజి జూనియర్ సర్టిఫికేట్ (ఎఫ్.జె.సి), 11వ సంవత్సరంలో తువాలువాన్ సర్టిఫికేట్ మరియు 12వ సంవత్సరంలో పసిఫిక్ సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ (పి.ఎస్.ఎ.సి)లను అందిస్తుంది, దీనిని ఫిజికి చెందిన పరీక్షా బోర్డు ఎస్.పి.బి.ఇ.ఎ సెట్ చేస్తుంది.[279] ఆరవ తరగతి విద్యార్థులు తమ పి.ఎస్.ఎ.సి లో ఉత్తీర్ణులైతే, తువాలు ప్రభుత్వం నిధులు సమకూర్చే ఆగ్మెంటెడ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్లో చేరుతారు. ఈ కార్యక్రమం తువాలు వెలుపల ఉన్న తృతీయ విద్యా కార్యక్రమాలకు అవసరం ఫనాఫుటిలోని యూనివర్శిటీ ఆఫ్ ది సౌత్ పసిఫిక్ (యు.ఎస్.పి) ఎక్స్టెన్షన్ సెంటర్లో అందుబాటులో ఉంది.[280]
పాఠశాలలో పురుషులకు 10 సంవత్సరాలు, మహిళలకు 11 సంవత్సరాలు హాజరు తప్పనిసరి (2001).[281] వయోజన అక్షరాస్యత రేటు 99.0% (2002).[245] 2010లో, 1,918 మంది విద్యార్థులకు 109 మంది ఉపాధ్యాయులు (98 మంది సర్టిఫైడ్, 11 మంది సర్టిఫైడ్ కానివారు) బోధించారు. తువాలులోని ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి అన్ని పాఠశాలలకు దాదాపు 1:18గా ఉంది. నౌటి స్కూల్ మినహా దాని నిష్పత్తి 1:27. ఫనాఫుటిలోని నౌటి స్కూల్ తువాలులో అతిపెద్ద ప్రాథమిక పాఠశా 900 కంటే ఎక్కువ మంది విద్యార్థులు (మొత్తం ప్రాథమిక పాఠశాల నమోదులో 45 శాతం) ఉన్నారు. మొత్తం పసిఫిక్ ప్రాంతంతో పోలిస్తే తువాలులో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి తక్కువగా ఉంది (1:29 నిష్పత్తి).[282]
దీవులన్నింటిలోని ప్రాథమిక పాఠశాలల్లో కమ్యూనిటీ శిక్షణా కేంద్రాలు (సి.టి.సి.లు) స్థాపించబడ్డాయి. మాధ్యమిక విద్యకు ప్రవేశ అర్హతలలో విఫలమైనందున 8వ తరగతి దాటి ముందుకు సాగని విద్యార్థులకు వారు వృత్తి శిక్షణను అందిస్తారు. సి.టి.సిలు ప్రాథమిక వడ్రంగి, తోటపని, వ్యవసాయం, కుట్టుపని, వంటలలో శిక్షణను అందిస్తాయి. వారి చదువు ముగింపులో గ్రాడ్యుయేట్లు మోటుఫౌవా సెకండరీ స్కూల్ లేదా తువాలు మారిటైమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టి.ఎం.టి.ఐ)లో చదువు కొనసాగించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పెద్దలు కూడా సి.టి.సి లలో కోర్సులకు హాజరు కావచ్చు.[283]
నాలుగు తృతీయ సంస్థలు సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులను అందిస్తున్నాయి: టి.ఎం.టి.ఐ తువాలు అటోల్ సైన్స్ టెక్నాలజీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (టి.ఎ.ఎ…టి.ఐ.ఐ), ఆస్ట్రేలియన్ పసిఫిక్ ట్రైనింగ్ కోయలిషన్ (ఎ.పి.టి.సి), యూనివర్శిటీ ఆఫ్ ది సౌత్ పసిఫిక్ (యు.ఎస్.పి) ఎక్స్టెన్షన్ సెంటర్.[284]
1966 నాటి తువాలువాన్ ఉపాధి ఆర్డినెన్స్ వేతనంతో కూడిన ఉపాధికి కనీస వయస్సును 14 సంవత్సరాలుగా నిర్ణయించింది, 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ప్రమాదకరమైన పనులు చేయడాన్ని నిషేధిస్తుంది.[285]
తువాలు సాంప్రదాయ భవనాలు నిర్మించడానికి స్థానిక విశాలమైన అడవి నుండి లబించే మొక్కలు, చెట్లను ఉపయోగిస్తారు.[286] పూకా ( హెర్నాండియా పెల్టాటా ) నుండి కలపతో సహా; న్గియా (ఇంగియా) పొదలు ( ఫెంఫిస్ అసిడ్యులా ); మిరో ( థెస్పెసియా పాపుల్నియా ); టోంగా ( రైజోఫోరా ముక్రోనాట ); ఫౌ లేదా ఫో ఫాఫిని, లేదా స్త్రీ ఫైబర్ చెట్టు ( మందార టిలియాసియస్ ).[286] ఫైబర్ కొబ్బరి నుండి వస్తుంది; ఫెర్రా, స్థానిక అత్తి ( ఫికస్ ఆస్పెమ్ ); ఫలా, స్క్రూ పైన్ లేదా పాండనస్ .[287] భవనాలను మేకులు లేకుండా నిర్మించారు. ఎండిన కొబ్బరి పీచుతో చేతితో తయారు చేసిన త్రాడు సెన్నిట్ తాడుతో కొట్టారు.[287]
టువాలులోని ఫునాఫుటిపై మనేపా లోపలి భాగం
యూరోపియన్లతో పరిచయం తరువాత, మేకులు, ముడతలు పెట్టిన రూఫింగ్ పదార్థంతో సహా ఇనుప ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. తువాలులోని ఆధునిక భవనాలు దిగుమతి చేసుకున్న కలప, కాంక్రీటుతో సహా దిగుమతి చేసుకున్న నిర్మాణ సామగ్రితో నిర్మించబడ్డాయి.[288]
తువాలు మహిళలు సాంప్రదాయ హస్తకళలలో కౌరీ, ఇతర సంప్రదాయ హస్తకళాఖడాలు ఉపయోగిస్తారు.[289] తువాలు కళాత్మక సంప్రదాయాలు సాంప్రదాయకంగా దుస్తుల రూపకల్పనలో, చాపలు, ఫ్యాన్ల అలంకరణ వంటి సాంప్రదాయ హస్తకళలలో వ్యక్తీకరించబడ్డాయి.[289] తువాలుయన్ మహిళలు అభ్యసించే కళారూపాలలో క్రోచెట్ ( కోలోస్ ) ఒకటి.[290] తువాలు సాంప్రదాయ నృత్య పాటల ప్రదర్శనలలో ఇప్పటికీ ఉపయోగించబడుతున్న మహిళల స్కర్టులు ( టిటి ), టాప్స్ ( టెయుగా సాకా ), హెడ్బ్యాండ్లు, ఆర్మ్బ్యాండ్లు, రిస్ట్బ్యాండ్ల డిజైన్ సమకాలీన తువాలుయన్ కళ, రూపకల్పనను సూచిస్తుంది.[291] తువాలు భౌతిక సంస్కృతి రోజువారీ జీవితంలో ఉపయోగించే కళాఖండాలలో సాంప్రదాయ రూపకల్పన అంశాలను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు సాంప్రదాయ పదార్థాలతో తయారు చేసిన పడవలు, చేపల హుక్స్ రూపకల్పనలో కూడా వారి ప్రత్యేకత ప్రతిబింబిస్తుంది.[292][293]
2015 లో తువాలు లోని ఫనాఫుఫుటి గురించిన ఒక కళా ప్రదర్శన జరిగింది, కళాకారుల దృష్టిలో వాతావరణ మార్పులను ప్రస్తావించిన రచనలు, తువాలు సంస్కృతి వివిధ కళాఖండాల ప్రదర్శన అయిన కోప్ ఓటే ఒలగా (జీవిత స్వాధీనాలు) ప్రదర్శనలు ఉన్నాయి.[294]
ఆక్లాండ్ యొక్క పసిఫికా ఫెస్టివల్లో తువాలువాన్ నృత్యకారుడు
తువాలు సాంప్రదాయ సంగీతంలో ఫకాసేసియా, ఫకానౌ , ఫాటేల్ వంటి అనేక నృత్యాలు ఉన్నాయి..[295] కమ్యూనిటీ కార్యక్రమాలలో, నాయకులు మరియు ఇతర ప్రముఖ వ్యక్తుల ఉత్సవాలలో ఫాటెల్ (ఆధునిక రూపంలో) ప్రదర్శించబడుతుంది. 2012 సెప్టెంబరు కేంబ్రిడ్జ్ డ్యూక్, డచెస్ సందర్శనలలో ప్రదర్శించిన ప్రదర్శనలు ఇందుకు ఉదాహరణగా ఉన్నాయి.[296][297] తువాలువాన్ శైలిని "సమకాలీన పాత శైలులు పాలినేషియా సంగీత సూక్ష్మదర్శిని"గా వర్ణించవచ్చు".[295]
తువాలు వంటకాలలో ప్రధానమైన కొబ్బరి, సముద్రం మరియు అటోల్స్ సరస్సులలో కనిపించే అనేక జాతుల చేపల మీద ఆధారపడి ఉంటాయి. ఈ ద్వీపాలలో తయారుచేసే డెజర్ట్లలో జంతువుల పాలకు బదులుగా కొబ్బరి, కొబ్బరి పాలు ఉంటాయి. తువాలులో తినే సాంప్రదాయ ఆహారాలు పులకా, టారో, అరటిపండ్లు, బ్రెడ్ఫ్రూట్[298],కొబ్బరి ఊంటాయి.[299] తువాలువాన్లు కొబ్బరి పీత, సరస్సు, సముద్రం నుండి వచ్చే చేపలతో సముద్ర ఆహారాన్ని కూడా తింటారు.[131] ఎగిరే చేపలను ఆహార వనరుగా పట్టుకుంటారు.[300][301][302] మరో సాంప్రదాయ ఆహార వనరు సముద్ర పక్షులు ( టేక్టేక్ లేదా బ్లాక్ నోడీ, అకియాకి లేదా వైట్ టెర్న్ ) ఉంటాయి. పంది మాంసాన్ని ఎక్కువగా ఫాటెల్స్లో (లేదా విందులు, వినోదాలు, పండుగలు, ఉత్సవాలను జరుపుకోవడానికి నృత్యాలతో కూడిన విందులలో) తింటారు.[240]
పులకా కార్బోహైడ్రేట్లకు ప్రధాన మూలంగా ఉన్నాయి. సముద్ర ఆహారం ప్రోటీన్ను అందిస్తుంది. అరటిపండ్లు, బ్రెడ్ఫ్రూట్ అనుబంధ పంటలుగా ఉన్నాయి. కొబ్బరిని రసం కోసం, ఇతర పానీయాలు ( కల్లు వంటివి) తయారు చేయడానికి, కొన్ని వంటకాల రుచిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు.[240]
తువాలులో జలచరాల పెంపకాన్ని కొనసాగించడానికి 1996లో వైటుపులో 1560 చదరపు మీటర్ల చెరువును నిర్మించారు.[303]
ఎగిరే చేపలను ఆహార వనరుగా కూడా పట్టుకుంటారు;[300][301][302] ఒక ఉత్తేజకరమైన కార్యకలాపంగా ఎగిరే చేపలను ఆకర్షించడానికి పడవ, సీతాకోకచిలుక వల, స్పాట్లైట్ను ఉపయోగించడం వంటివి చేస్తుంటారు.[240]
తువాలులో చాలా వరకు సాంప్రదాయ సమాజ వ్యవస్థ ఇప్పటికీ మనుగడలో ఉంది. ప్రతి కుటుంబానికి సలాంగా (చేపలు పట్టడం, ఇల్లు కట్టడం లేదా సమాజం కోసం రక్షణ బాధ్యత నిర్వహించాల్సిన పని ఉంటుంది. ఒక కుటుంబం నైపుణ్యాలు తల్లిదండ్రుల నుండి పిల్లలకు వారసత్వంగా సంక్రమిస్తాయి.
చాలా ద్వీపాలు తమ సొంత ఫ్యూసీ, కమ్యూనిటీ యాజమాన్యంలోని దుకాణాలను కన్వీనియన్స్ స్టోర్లను కలిగి ఉంటాయి. ఇక్కడ డబ్బాల్లో ఉంచిన ఆహారాలు, బియ్యం సంచులను కొనుగోలు చేయవచ్చు. వస్తువులు చౌకగా ఉంటాయి. ఫ్యూసిస్ వారి స్వంత ఉత్పత్తులకు మంచి ధరలను ఇస్తాయి.[240]
మరో ముఖ్యమైన భవనం ఫలేకాపులే లేదా మనేపా. ఇది సాంప్రదాయ ద్వీప సమావేశ మందిరం.[240] ఇక్కడ ముఖ్యమైన విషయాలు చర్చించబడతాయి. అలాగే ఇది వివాహ వేడుకలు, సంగీతం, గానం, నృత్యంతో కూడిన ఫాటెల్ వంటి సమాజ కార్యకలాపాలకు కూడా ఉపయోగించబడుతుంది.[304] ప్రతి ద్వీపంలో సాంప్రదాయ నిర్ణయం తీసుకునే సంస్థ అయిన పెద్దల మండలి (దీనిని ఫలేకాపులే అంటారు) సమావేశాలకు ఉపయోగించబడుతుంది. ఫాలెకౌపూలే చట్టం ప్రకారం ఫాలెకౌపూలే అంటే "ప్రతి ద్వీపంలోని సాంప్రదాయ సభ ... ద్వీపాలన్నింటిలో అగాను ఆధారంగా కూర్చబడింది". అగాను అంటే సాంప్రదాయ ఆచారాలు, సంస్కృతి.[304]
తువాలులో ఎటువంటి మ్యూజియంలు లేవు. అయినప్పటికీ తువాలు జాతీయ సాంస్కృతిక కేంద్రం మ్యూజియం ఏర్పాటు 2018–24 సంవత్సరానికి ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఉంది.[305][306]
పావోపావో ( సమోవాన్ భాష నుండి వచ్చింది) అంటే ఒకే దుంగతో తయారు చేయబడిన చిన్న చేపలవేట-కానో. ఇది తువాలు సాంప్రదాయ సింగిల్- అవుట్రిగ్గర్ కానో. వీటిలో అతిపెద్దది నాలుగు నుండి ఆరు పెద్ద జంతువులను తీసుకెళ్లగలదు. వైటుపు, ననుమియాలో అభివృద్ధి చేయబడిన సింగిల్-అవుట్రిగ్గర్ పడవల వైవిధ్యాలు రీఫ్-రకం లేదా తెడ్డు పడవలుగా ఉండేవి; అంటే అవి ప్రయాణించడానికి బదులుగా రీఫ్ను మోసుకెళ్లడానికి, తెడ్డు వేయడానికి రూపొందించబడ్డాయి.[292] నుయ్ నుండి వచ్చిన అవుట్రిగ్గర్ పడవలు పరోక్ష రకం అవుట్రిగ్గర్ అటాచ్మెంట్తో నిర్మించబడ్డాయి. వీటిలో పొట్టు డబుల్-ఎండ్గా ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన దృఢమైన విల్లు ఉండదు. ఈ పడవలను నుయ్ సరస్సు మీదుగా ప్రయాణించడానికి రూపొందించారు.[307] ఇతర ద్వీపాల నుండి వచ్చిన పడవల డిజైన్లలో కనిపించే వాటి కంటే ఔట్రిగ్గర్ బూమ్లు పొడవుగా ఉన్న కారణంగా ఇతర డిజైన్ల కంటే తెరచాపతో ఉపయోగించినప్పుడు నుయ్ పడవ మరింత స్థిరంగా ఉంటాయి.[307]
తువాలులో ఆడే సాంప్రదాయ క్రీడ కిలికిటి.[308] ఇది క్రికెట్ను పోలి ఉంటుంది.[309] తువాలుకు ప్రత్యేకమైన ప్రసిద్ధ క్రీడ టె అనో (బంతి), దీనిని 12 cమీ. (5 అం.) కలిగిన రెండు గుండ్రని బంతులతో ఆడతారు.[240] టె అనో అనేది వాలీబాల్ను పోలి ఉండే సాంప్రదాయ ఆట. దీనిలో పాండనస్ ఆకులతో తయారు చేయబడిన రెండు గట్టి బంతులను చాలా వేగంగా వాలీ చేస్తారు. జట్టు సభ్యులు బంతి నేలను తాకకుండా ఆపడానికి ప్రయత్నిస్తారు.[310] 19వ శతాబ్దం చివరలో క్రీడలు ఫుట్ రేసింగ్, లాన్స్ త్రోయింగ్, క్వార్టర్స్టాఫ్ ఫెన్సింగ్, రెజ్లింగ్ వంటి సంప్రదాయ క్రీడలను క్రైస్తవ మిషనరీలు ఆమోదించలేదు.[311]
తువాలులో ప్రసిద్ధ క్రీడలలో కిలికిటి, టె అనో, అసోసియేషన్ ఫుట్బాల్, ఫుట్సల్, వాలీబాల్, హ్యాండ్బాల్, బాస్కెట్బాల్, రగ్బీ సెవెన్స్ ఉన్నాయి. తువాలులో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్, రగ్బీ యూనియన్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ కోసం క్రీడా సంస్థలు ఉన్నాయి. 2013 పసిఫిక్ మినీ గేమ్స్లో టువా లాపువా లాపువా 62 కిలోగ్రాముల పురుషుల స్నాచ్ వెయిట్ లిఫ్టింగ్లో అంతర్జాతీయ పోటీలో తువాలుకు మొదటి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. (ఆయన క్లీన్ అండ్ జెర్క్లో కాంస్యం కూడా గెలుచుకున్నాడు. మొత్తం మీద రజత పతకాన్ని గెలుచుకున్నాడు.)[312] 2015లో పవర్లిఫ్టింగ్ (120 కిలోల . కిలోల పురుష విభాగం) పసిఫిక్ క్రీడలలో మొదటి బంగారు పతకాన్ని (తువాలు మొదటి పతకం) తెలుపే ఐయోసెఫా అందుకున్నాడు.[313][314][315]
తువాలు జాతీయ ఫుట్బాల్ జట్టు (2011)
తువాలులో ఫుట్బాల్ క్లబ్, జాతీయ జట్టు స్థాయిలో ఆడతారు. తువాలు జాతీయ ఫుట్బాల్ జట్టు ఫనాఫుటిలోని తువాలు స్పోర్ట్స్ గ్రౌండ్లో శిక్షణ పొందుతూ పసిఫిక్ క్రీడలలో పోటీపడుతుంది. తువాలు నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్కు ఓషియానియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ (ఒ.ఎఫ్.సి) లో అసోసియేట్ సభ్యత్వం ఉంది. అదనంగా ఇది ఎఫ్.ఐ.ఎ.ఎ. లో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది.[316][317] తువాలు జాతీయ ఫుట్సల్ జట్టు ఓషియానియన్ ఫుట్సల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటుంది.
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న జరిగే "స్వాతంత్ర్య దినోత్సవ క్రీడా ఉత్సవం" ఒక ప్రధాన క్రీడా కార్యక్రమంగా ఉంది. 2008 నుండి తువాలులో వార్షికంగా అతి ముఖ్యమైన క్రీడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. తువాలు మొదటిసారి 1978లో పసిఫిక్ క్రీడలలో, 1998లో కామన్వెల్త్ క్రీడలలో పాల్గొన్నది. ఆ సమయంలో ఒక వెయిట్ లిఫ్టర్ మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన క్రీడలకు హాజరయ్యాడు.[318] ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో జరిగిన 2002 కామన్వెల్త్ క్రీడలకు ఇద్దరు టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళు హాజరయ్యారు;[318] ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన 2006 కామన్వెల్త్ క్రీడలలో తువాలు షూటింగ్, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్లలో పోటీలో ప్రవేశించారు;[318] భారతదేశంలోని ఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ క్రీడలలో ముగ్గురు అథ్లెట్లు డిస్కస్, షాట్ పుట్, వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లలో పాల్గొన్నారు;[318] 2014 లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు 3 వెయిట్ లిఫ్టర్లు, 2 టేబుల్ టెన్నిస్ ఆటగాళ్ళ బృందం హాజరయ్యారు. 2009 నుండి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల, మహిళల 100 మీటర్ల స్ప్రింట్లో తువాలువాన్ అథ్లెట్లు కూడా పాల్గొన్నారు.
తువాలు అసోసియేషన్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ నేషనల్ ఒలింపిక్ కమిటీ (టాస్నాక్) 2007 జూలైలో జాతీయ ఒలింపిక్ కమిటీగా గుర్తింపు పొందింది. 2008లో చైనాలోని బీజింగ్లో జరిగిన వేసవి క్రీడల్లో తువాలు తొలిసారిగా ఒలింపిక్ క్రీడల్లోకి పురుషుల, మహిళల 100 మీటర్ల స్ప్రింట్లో ఒక వెయిట్ లిఫ్టర్, ఇద్దరు అథ్లెట్లతో ప్రవేశించింది. 2012 వేసవి ఒలింపిక్స్లో తువాలు తరపున అదే అథ్లెట్లతో కూడిన జట్టు ప్రాతినిధ్యం వహించింది.[319] 2016 వేసవి ఒలింపిక్స్లో 100 మీటర్ల ఈవెంట్లో తువాలుకు ఎటిమోని టిమువానీ ఏకైక ప్రతినిధిగా పాల్గొన్నది.[320] 2020 వేసవి ఒలింపిక్స్లో 100 మీటర్ల ఈవెంట్లలో కరాలో మైబుకా, మాటీ స్టాన్లీ తువాలు ప్రాతినిధ్యం వహించారు.[321][322] తువాలు 2023 పసిఫిక్ క్రీడలకు ఒక జట్టును పంపింది. 2024 వేసవి ఒలింపిక్స్లో పురుషుల 100 మీటర్ల పరుగులో కరాలో మైబుకా,[323] మహిళల 100 మీటర్ల పరుగులో టెమాలిని మనటోవా తువాలు తరపున ప్రాతినిధ్యం వహించారు.[324]
1996 నుండి 2002 వరక తువాలు అత్యుత్తమ పనితీరు కనబరిచిన పసిఫిక్ ద్వీప ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది. సంవత్సరానికి సగటు వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి) వృద్ధి రేటు 5.6% సాధించింది. 2002 తర్వాత ఆర్థిక వృద్ధి మందగించింది. 2008లో జి.డి.పి వృద్ధి 1.5%గా ఉంది. 2008లో తువాలు ప్రపంచ ఇంధనం, ఆహార పదార్థాల ధరలలో వేగవంతమైన పెరుగుదలకు గురైంది. ద్రవ్యోల్బణం స్థాయి 13.4%కి చేరుకుంది.[282]. ప్రపంచంలోని దేశాన్నింటిలో తువాలు అతి తక్కువ మొత్తం జి.డి.పి కలిగి ఉంది.[325]
తువాలు 2010 జూన్ 24 న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్)లో చేరింది.[326] 2009లో ఆర్థిక వ్యవస్థ దాదాపు 2% కుంచించుకుపోయిన తర్వాత, తువాలు దాని 2010 జి.డి.పి.లో సున్నా వృద్ధిని సాధించిందని ఐ.ఎం.పి 2010 తువాలు నివేదిక అంచనా వేసింది.[327] 2012 ఆగస్టు 5 న ఐ.ఎం.ఎఫ్ కార్యనిర్వాహక బోర్డు తువాలుతో ఆర్టికల్ (నాలుగు) సంప్రదింపులను ముగించి తువాలు ఆర్థిక వ్యవస్థను ఇలా అంచనా వేసింది: "తువాలులో ఆర్ధికరంగం నెమ్మదిగా కోలుకోవడం జరుగుతోంది కానీ ముఖ్యమైన నష్టాలు ఉన్నాయి. 2011లో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రైవేట్ రిటైల్ రంగం, విద్యాభివృద్ధి కొరకు చేస్తున్న వ్యయం కారణంగామొదటిసారిగా పెరిగింది."[328] ఐ.ఎం.ఎఫ్. 2014 దేశ నివేదిక తువాలులో నిజమైన జి.డి.పి. వృద్ధి గత దశాబ్దంలో సగటున 1 శాతం మాత్రమే అస్థిరంగా ఉందని పేర్కొంది. 2014 దేశ నివేదిక, ఫిషింగ్ లైసెన్సుల నుండి పెద్ద ఆదాయాలు, గణనీయమైన విదేశీ సహాయం ఫలితంగా ఆర్థిక వృద్ధి అవకాశాలు సాధారణంగా సానుకూలంగా ఉన్నాయని వర్ణించింది.[329] 2022 చివరి నాటికి విజయవంతమైన టీకా వ్యూహం తువాలు కరోనావైరస్ వ్యాధి (కోవిడ్) నియంత్రణ చర్యలను ఎత్తివేయడానికి అనుమతించిందని 2023లో తువాలుతో జరిగిన ఐ.ఎం.ఎఫ్ ఆర్టికల్ (నాలుగవ) సంప్రదింపులు నివేదిక తెలియజేస్తుంది. అయితే మహమ్మారి ఆర్థిక వ్యయం గణనీయంగా ఉంది. 2019లో 13.8% నుండి 2020లో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి -4.3 శాతానికి పడిపోయింది. అయినప్పటికీ 2021లో 1.8%కి కోలుకుంది. [5] 2022 లో ద్రవ్యోల్బణం 11.5% కి పెరిగింది. కానీ 2028 నాటికి ద్రవ్యోల్బణం 2.8% కి తగ్గుతుందని అంచనా.[329]
2022 లో సంభవించిన కరువు, ఉక్రెయిన్ మీద రష్యా దాడి తర్వాత ప్రపంచ ఆహార ధరలు పెరగడం వల్ల ఆహార ధర వేగంగా పెరగడం (ఆహార దిగుమతులు తువాలు జి.డి.పిలో 19 శాతం ప్రాతినిధ్యం వహిస్తాయి, వ్యవసాయం జి.డి.పిలో 10 శాతం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంది) కారణంగా 2022లో ద్రవ్యోల్బణం పెరిగింది.[329]
ఫనాఫుటిలోని ప్రిన్సెస్ మార్గరెట్ హాస్పిటల్ ద్వారా ప్రభుత్వం ప్రాథమిక వైద్య సేవలను అందిస్తుంది. ఇది ఇతర దీవులలో ఆరోగ్య క్లినిక్లను నిర్వహిస్తుంది. బ్యాంకింగ్ సేవలను నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువాలు అందిస్తోంది. అధికారికంగా ఉద్యోగం చేస్తున్న వారిలో ప్రభుత్వ రంగ కార్మికులు దాదాపు 65% ఉన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో నివసిస్తున్న తువాలువాన్ల నుండి వచ్చే చెల్లింపులు, విదేశీ నౌకల్లో పనిచేసే తువాలువాన్ నావికుల నుండి వచ్చే చెల్లింపులు తువాలువాన్లకు ముఖ్యమైన ఆదాయ వనరులుగా ఉన్నాయి.[330] దాదాపు 15% మంది వయోజన పురుషులు విదేశీ జెండా కలిగిన వ్యాపార నౌకల్లో నావికులుగా పనిచేస్తున్నారు. తువాలులో వ్యవసాయం కొబ్బరి చెట్లు, నీటి మట్టం క్రింద కంపోస్ట్ చేయబడిన నేల పెద్ద గుంటలలో పులకాను పెంచడం మీద దృష్టి పెడుతుంది. తువాలువాన్లు సాంప్రదాయ జీవనాధార వ్యవసాయం, చేపలు పట్టడంలో పాల్గొంటారు.
తువాలువాన్లు వారి సముద్రయాన నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందారు. ఫునాఫుటిలోని అమతుకు మోటు (ద్వీపం)లోని తువాలు మారిటైమ్ శిక్షణా సంస్థ ప్రతి సంవత్సరం సుమారు 120 మంది మెరైన్ క్యాడెట్లకు శిక్షణ ఇస్తుంది తద్వారా వారు వ్యాపార నౌకలమీద నావికులుగా ఉపాధికి సంపాదించడానికి అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. తువాలు ఓవర్సీస్ సీమెన్స్ యూనియన్ (టి.ఒ.ఎస్.యు) అనేది తువాలులో నమోదైన ఏకైక ట్రేడ్ యూనియన్. ఇది విదేశీ నౌకల్లోని కార్మికులను సూచిస్తుంది. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎ.డి.బి) అంచనా ప్రకారం 800 మంది తువాలువాన్ పురుషులు శిక్షణ పొంది, సర్టిఫై చేయబడి, నావికులుగా చురుకుగా పనిచేస్తున్నారు. ఎ.డి.బి అంచనా ప్రకారం, వయోజన పురుష జనాభాలో దాదాపు 15% మంది విదేశాలలో నావికులుగా పనిచేస్తున్నారు.[331] ట్యూనా బోట్లలో పరిశీలకులుగా ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పడవ ట్యూనా ఫిషింగ్ లైసెన్స్కు అనుగుణంగా ఉన్నాయో లేదో పర్యవేక్షించడం వారి బాధ్యత.[332]
ప్రభుత్వ ఆదాయం ఎక్కువగా ఫిషింగ్ లైసెన్సుల అమ్మకాల నుండి, తువాలు ట్రస్ట్ ఫండ్ నుండి వచ్చే ఆదాయం నుండి దాని " .టి.వి " ఇంటర్నెట్ టాప్ లెవల్ డొమైన్ (టి.ఎల్.డి) లీజు నుండి వస్తుంది. తువాలు తన ".టి.వి" ఇంటర్నెట్ డొమైన్ పేరు వాణిజ్యీకరణ నుండి ఆదాయాన్ని పొందడం ప్రారంభించింది.[333] దీనిని 2021 వరకు వెరిసైన్ నిర్వహించింది.[334][335] 2023లో తువాలు ప్రభుత్వం గోడాడీ కంపెనీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, .టి.వి డొమైన్ మార్కెటింగ్, అమ్మకాలు, ప్రమోషన్, బ్రాండింగ్ను తువాలు టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్కు అప్పగించారు. ఇది .టివి. యూనిట్ను స్థాపించింది.[336] తువాలు ఫిలాటెలిక్ బ్యూరో, తువాలు షిప్ రిజిస్ట్రీ ద్వారా పోస్టేజ్ స్టాంపుల నుండి కూడా తువాలు ఆదాయాన్ని పొందుతుంది.
1987లో యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్చే తువాలు ట్రస్ట్ ఫండ్ (టి.టి.ఎఫ్) స్థాపించబడింది.[41] టి.టి.ఎఫ్ అనేది తువాలు యాజమాన్యంలోని సావరిన్ వెల్త్ ఫండ్, కానీ దీనిని అంతర్జాతీయ బోర్డు తువాలు ప్రభుత్వం నిర్వహిస్తాయి. ప్రతి సంవత్సరం టి.టి.ఎఫ్ పనితీరు దాని నిర్వహణ లక్ష్యాన్ని మించిపోయినప్పుడు, అదనపు నిధులు కన్సాలిడేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సి.ఐ.ఎఫ్)కి బదిలీ చేయబడతాయి. బడ్జెట్ వ్యయాలకు ఆర్థిక సహాయం చేయడానికి తువాలువాన్ ప్రభుత్వం వాటిని ఉచితంగా తీసుకోవచ్చు.[337] 2022లో తువాలు ట్రస్ట్ ఫండ్ విలువ సుమారు $190 మిలియన్.[337] 2021లో టి.టి.ఎఫ్ మార్కెట్ విలువ 12 శాతం పెరిగి రికార్డు స్థాయిలో అత్యధిక స్థాయికి (జి.డి.పి.లో 261 శాతం) చేరుకుంది. అయితే, 2022లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని అస్థిరత ఫలితంగా 2021 ముగింపుతో పోలిస్తే టి.టి.ఎఫ్ విలువ 7 శాతం తగ్గింది.[337]
తువాలుకు జపాన్, దక్షిణ కొరియా తువాలు ట్రస్ట్ ఫండ్ (టి.టి.ఎఫ్), యూరోపియన్ యూనియన్ కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టి.టి.ఎఫ్ కు మూలధనాన్ని అందించడం కొనసాగిస్తున్నాయి. ఇతర అభివృద్ధి సహాయాన్ని అందిస్తున్నాయి.[41][330]
తువాలుకు అమెరికా ప్రభుత్వం కూడా ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. 1999లో దక్షిణ పసిఫిక్ ట్యూనా ఒప్పందం (ఎస్.పి.టి.టి) నుండి చెల్లింపు దాదాపు $9 మిలియన్లు, తరువాతి సంవత్సరాల్లో విలువ పెరుగుతుంది..2013 మేలో యునైటెడ్ స్టేట్స్, పసిఫిక్ దీవుల దేశాల ప్రతినిధులు బహుపాక్షిక మత్స్య ఒప్పందాన్ని (దక్షిణ పసిఫిక్ ట్యూనా ఒప్పందాన్ని కలిగి ఉంటుంది) 18 నెలల పాటు పొడిగించడానికి మధ్యంతర ఏర్పాటు పత్రాల మీద సంతకం చేయడానికి అంగీకరించారు.[338]
ఆర్థికాభివృద్ధికి పరిమిత సామర్థ్యం, దోపిడీకి గురయ్యే వనరులు లేకపోవడం, దాని చిన్న పరిమాణం బాహ్య ఆర్థిక, పర్యావరణ ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉన్నందున ఐక్యరాజ్యసమితి తువాలును అతి తక్కువ అభివృద్ధి చెందిన దేశం (ఎల్.డి.సి.)గా పేర్కొంది.[339] తువాలు 1997 అక్టోబరు ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో స్థాపించబడిన ఎన్హాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ట్రేడ్-రిలేటెడ్ టెక్నికల్ అసిస్టెన్స్ టు లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ (ఇ.ఐ.ఎఫ్)లో పాల్గొంటుంది.[340] 2013 నుండి 2015 నాటికి తువాలు తక్కువ అభివృద్ధి చెందిన దేశం (ఎల్.డి.సి.) హోదా నుండి అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతుందని భావించబడింది. 2013లో ప్రధాన మంత్రి ఎనెలే సోపోగా, ఐక్యరాజ్యసమితి జాతీయ అనుసరణ కార్యక్రమం (ఎన్.ఎ.పి.ఎ) అందించే నిధులను తువాలు పొందేలా ఈ వాయిదా అవసరమని అన్నారు. ఎందుకంటే "తువాలు అభివృద్ధి .చెందిన దేశంగా మారిన తరువాత ఎన్.ఎ.పి.ఎ వంటి వాతావరణ మార్పు కార్యక్రమాలకు నిధుల సహాయం కోసం దీనిని పరిగణించరు. ఇది ఎల్.డి.సి. లకు మాత్రమే వెళుతుంది". తువాలు లక్ష్యాలను చేరుకుంది, తద్వారా తువాలు ఎల్.డి.సి. హోదా నుండి అభివృద్ధి చెందుతున్న దేశం అయింది. పర్యావరణ దుర్బలత్వ సూచిక (ఇ.వి.ఐ ) వర్తింపజేయడంలో తువాలు వంటి చిన్న ద్వీప దేశాలు పర్యావరణ దుస్థితికి తగినంత ప్రాధాన్యత ఇవ్వబడనందున, ఎల్.డి.సి. హోదా నుండి కోసం ఐక్యరాజ్యసమితి తన ప్రమాణాలను పునఃపరిశీలించాలని ఎనేల్ సోపోగా కోరారు.[341]
దేశం సుదూరంగా ఉండటం కారణంగా పర్యాటకం గణనీయంగా అభివృద్ధి కాలేదు. 2010 లో మొత్తం సందర్శకులు 1,684 మంది: 65% మంది వ్యాపార, అభివృద్ధి అధికారులు లేదా సాంకేతిక సలహాదారులు, 20% మంది పర్యాటకులు (360 మంది), 11% మంది కుటుంబ సభ్యులను సందర్శించడానికి తిరిగి వచ్చిన ప్రవాసులు.[191] 2016 లో సందర్శకుల సంఖ్య 2,000 కు పెరిగింది.[342]
తువాలులోని ఏకైక విమానాశ్రయం ఫనాఫుటి అంతర్జాతీయ విమానాశ్రయం, హోటల్ సౌకర్యాలు ఉన్న ఏకైక ద్వీపం ఫనాఫుటి కాబట్టి ప్రధాన ద్వీపం ఫనాఫుటి ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తుంది.[343] అయితే ఇక్కడ టూర్ గైడ్లు, టూర్ ఆపరేటర్లు లేదా వ్యవస్థీకృత కార్యకలాపాలు లేవు క్రూయిజ్ షిప్ల సందర్శన లేదు.[344] తువాలుకు వచ్చే ప్రయాణికులకు పర్యావరణ పర్యాటకం ఒక ప్రేరణ. ఫనాఫుటి పరిరక్షణ ప్రాంతంలో 12.74 చదరపు మైళ్లు (33.00 చదరపు kiloమీటర్లు) సముద్రం, దిబ్బ, సరస్సు, కాలువలు, ఆరు జనావాసాలు లేని ద్వీపాలు ఉన్నాయి.
బయటి దీవులను రెండు ప్రయాణీకుల-సరకు రవాణా నౌకలైన నివాగా III , మను ఫోలావులలో సందర్శించవచ్చు. ప్రతి మూడు లేదా నాలుగు వారాలకు బయటి దీవులకు రౌండ్-ట్రిప్ సందర్శనలను అందిస్తాయి. బయటి దీవులలో చాలా వరకు గెస్ట్హౌస్ వసతి ఉంది.
తువాలు ప్రభుత్వ తువాలు మీడియా విభాగం ఫునాఫుటి నుండి ప్రసారమయ్యే రేడియో తువాలును నిర్వహిస్తుంది.[262] 2011లో జపాన్ ప్రభుత్వం కొత్త ఎ.ఎమ్ ప్రసార స్టూడియోను నిర్మించడానికి ఆర్థిక సహాయం అందించింది. అప్గ్రేడ్ చేసిన ట్రాన్స్మిషన్ పరికరాల సంస్థాపన వల్ల తువాలులోని తొమ్మిది దీవులలో రేడియో తువాలు వినబడుతుంది. ఫనాఫుటిలోని కొత్త ఎ.ఎం. రేడియో ట్రాన్స్మిటర్ బాహ్య దీవులకు ఎఫ్.ఎం. రేడియో సేవను భర్తీ చేసింది. ఉపగ్రహ బ్యాండ్విడ్త్ మొబైల్ సేవలు అందిస్తుంది.[191] ఫెనుయ్ - తువాలు నుండి వార్తలు అనేది తువాలు మీడియా విభాగం ఉచిత డిజిటల్ ప్రచురణ అందిస్తుంది. ఇది చందాదారులకు ఇమెయిల్ చేయబడుతుంది. ప్రభుత్వ కార్యకలాపాల గురించి వార్తలను, తువాలువాన్ సంఘటనల గురించి వార్తలను ప్రచురిస్తున్న ఫేస్బుక్ పేజీని నిర్వహిస్తుంది.
తువాలులో కమ్యూనికేషన్లు టెలిఫోన్, టెలివిజన్, ఇంటర్నెట్ యాక్సెస్ కోసం ఉపగ్రహ డిష్ల మీద ఆధారపడి ఉంటాయి. తువాలు టెలికమ్యూనికేషన్స్ కార్పొరేషన్ (టి.టి.సి) అనేది ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ ఇది ప్రతి ద్వీపంలోని చందాదారులకు స్థిర లైన్ టెలిఫోన్ కమ్యూనికేషన్లను, ఫనాఫుటి, వైటుపు, నుకులైలేలలో మొబైల్ ఫోన్ సేవలను అందిస్తుంది. ఫిజి టెలివిజన్ సేవ ( స్కై పసిఫిక్ ఉపగ్రహ టెలివిజన్ సేవ) పంపిణీదారు.[345]
2020 జూలైలో తువాలు ప్రభుత్వం అరవై 1.2 మీటర్ల వి.ఎస్.ఎటి ఉపగ్రహ రిసీవర్లు ద్వారా తువాలుకు ఇంటర్నెట్ సరఫరా చేయడానికి కాసిఫిక్ బ్రాడ్బ్యాండ్ శాటిలైట్స్తో ఐదు సంవత్సరాల ఒప్పందం మీద సంతకం చేసింది.[262] ఈ ఒప్పందం 400 నుండి 600 వరకు మొత్తం డేటా బదిలీ సామర్థ్యాన్ని అందించింది. పాఠశాలలు, వైద్య క్లినిక్లు, ప్రభుత్వ సంస్థలు, చిన్న వ్యాపారాలు, 40 బహిరంగ Wi-Fi హాట్స్పాట్లకు, అలాగే మూడు సముద్ర యాంటెన్నాల ద్వారా తువాలువాన్ ఇంటర్ ఐలాండ్ ఫెర్రీలకు Mbit/s.[345] ద్వీప మొబైల్ ఫోన్ నెట్వర్క్కు ట్రంకింగ్, బ్యాక్హాల్ సేవలను అందించడానికి ఒక కె.ఎ. బ్యాండ్ యాంటెన్నాను ఏర్పాటు చేశారు.[345] 2022 ఫిబ్రవరి నాటికి కాసిఫిక్, ఎజిలిటీ బియాండ్ స్పేస్ (ఎ.బి.ఎస్) ఉపగ్రహాలు ద్వీపానికి కలిపి 510 సామర్థ్యాన్ని అందించాయి Mbit/s.[346]
ఒక్కో పరికరానికి సగటున 9 సార్లు డేటా డౌన్లోడ్ అవుతుంది. జి.బి/యూజర్/నెల, వినియోగంలో ఉన్న 95% పరికరాలు 4జి ఎల్.టి.ఇ. సేవకు మద్దతు ఇస్తున్నాయి.[347] అలాగే తువాలులో 5,915 మంది యాక్టివ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ఉన్నారు. (అతిపెద్ద వినియోగదారుల స్థావరం ఫనాఫుటిలో ఉంది), బాహ్య దీవులలో అంకితమైన ఉపగ్రహ, హాట్స్పాట్ వినియోగదారులు ఉన్నారు. వీటిలో ప్రతి ఒక్కటి మూడు నుండి ఐదు హాట్స్పాట్లను కలిగి ఉన్నాయి.[347]
తువాలులో పరిమిత రవాణా సేవలు ఉన్నాయి. దాదాపు eight kiloమీటర్లు (5 మైళ్లు) రోడ్లు ఉన్నాయి.[245] ఫునాఫుటి వీధులు 2002 మధ్యలో తారు వేయబడ్డాయి, కానీ ఇతర రోడ్లు తారు వేయబడలేదు. తువాలులో రైల్వేలు లేవు.
ఫునాఫుటి ఏకైక ఓడరేవు, కానీ నుకుఫెటౌ వద్ద సరస్సులో లోతైన నీటి బెర్త్ ఉంది. కొన్ని దీవులలో ప్రయాణీకులను, సరుకును దింపడం కష్టం ఎందుకంటే రీఫ్ దీవులలో షిప్పింగ్ ప్రవేశించగల సరస్సు లేదు లేదా పగడపు దీవి సరస్సులో నౌకాయాన మార్గాలు లేవు. ఈ దీవులలో ల్యాండింగ్ అంటే ప్రయాణీకులను, సరుకును ఓడల నుండి వర్క్బోట్లకు బదిలీ చేసి దీవులలోని ల్యాండింగ్ పాయింట్లకు డెలివరీ చేయడం. 2023 మే లో ఆస్ట్రేలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ ఫర్ ది పసిఫిక్ (ఎ.ఐ.ఎఫ్ఎఫ్.పి) పసిఫిక్ దీవులలో ప్రయాణీకుల, కార్గో సౌకర్యాల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయడానికి AUD$120.6m (US$84.4m) ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎ.డి.బి) నేతృత్వంలోని నిధికి AUD$21.4m (US$15m) చెల్లింపును ఆమోదించింది. ఎ.ఐ.ఎఫ్ఎఫ్.పి నిధులు, తువాలు ప్రభుత్వం నుండి వచ్చిన AUD$11m (US$7.2m) ఇన్-కంటెస్ట్ సహకారంతో కలిపి, నియుటావోలో ఒక ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి, నుయ్లో ఒక ప్రాజెక్ట్ను అమలు చేయడానికి, నావిగేషన్ ఛానల్, బోట్ రాంప్, ప్యాసింజర్ టెర్మినల్, కార్గో షెడ్, అలాగే తీరప్రాంత పునరుద్ధరణతో సహా వర్క్బోట్ హార్బర్లను నిర్మించడానికి కేటాయించబడ్డాయి.[348][349]
మర్చంట్ మెరైన్ ఫ్లీట్లో రెండు ప్రయాణీకుల/సరకు రవాణా నౌకలు ఉన్నాయి. నివాగా III మను ఫోలావ్, ఈ రెండింటినీ జపాన్ విరాళంగా ఇచ్చింది. వారు ప్రతి మూడు లేదా నాలుగు వారాలకు బయటి దీవులకు తిరుగు ప్రయాణ సందర్శనలను అందిస్తారు. సువా, ఫిజి, ఫనాఫుటి మధ్య సంవత్సరానికి మూడు లేదా నాలుగు సార్లు ప్రయాణిస్తారు. మను ఫోలౌ అనేది 50 మీటర్ల నౌక. 2015లో నివాగా III నివాగా II స్థానంలోకి వచ్చింది. ఇది 1989 నుండి తువాలులో సేవలో ఉంది.[350][351]
2020లో తువాలు ప్రభుత్వం ల్యాండింగ్ బార్జ్ను కొనుగోలు చేసింది. ఇది రాజధాని నుండి బయటి దీవులకు ప్రమాదకరమైన వస్తువులు, నిర్మాణ సామగ్రిని రవాణా చేయడానికి ఉద్దేశించబడింది. ఆ బార్జ్ కు మోయితేవా అని పేరు పెట్టారు. తైవాన్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది.[352]
తువాలు మత్స్య శాఖ దేశం ప్రత్యేక ఆర్థిక మండలం (ఇ.ఇ.జెడ్) బాహ్య దీవులలో తన కార్యకలాపాలను నిర్వహించడానికి రెండు నౌకలను నిర్వహిస్తుంది; అవి 18 మీటర్ల మనౌయ 32 మీటర్ల తాలా మోనా . ఈ నౌకలను మత్స్య పరిశోధన, చేపల సేకరణ పరికరాలను (ఎఫ్లు.ఎడి.లు) మోహరించడం, పర్యవేక్షణ, సంప్రదింపుల కోసం బయటి దీవులను సందర్శించడం, వాతావరణ మార్పులను పరిష్కరించడానికి తువాలు నేషనల్ అడాప్టేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ (ఎన్.ఎ.పి.ఎ)ను అమలు చేయడం వంటి వాటి కోసం ఉపయోగిస్తారు.[353] మనౌయ్ను 1989లో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జె.ఐ.సి.ఎ) ద్వారా సేకరించారు దాని జీవితకాలం ముగింపు దశకు చేరుకుంది.[354] 2015లోఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యు.ఎన్.డి.పి) తాలా మోనాను స్వాధీనం చేసుకోవడానికి సహాయం అందించింది;[355] ఇది మానిటరింగ్ కంట్రోల్ అండ్ సర్వైలెన్స్ (ఎం.సి.ఎస్) గస్తీలకు కూడా ఉపయోగించబడుతుంది.[356] తాలా మోనా అనేది ఒక స్టీల్ మోనోహల్ ఆయిల్ రిగ్ సరఫరా నౌక ఇది దాదాపు 15 మంది వ్యక్తుల బృందానికి సౌకర్యాలతో అమర్చబడి ఉంటుంది.[357]
తువాలులో ఉన్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం ఫనాఫుటి అంతర్జాతీయ విమానాశ్రయం . ఫిజి ఎయిర్వేస్ ఫనాఫుటి అంతర్జాతీయ విమానాశ్రయానికి సేవలను నిర్వహిస్తుంది.[358] ఫిజి ఎయిర్వేస్ 72 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఎ.టి.ఆర్ 72-600 విమానాలతో సువా, ఫనాఫుటి మధ్య వారానికి మూడు సార్లు (మంగళవారం, గురువారం, శనివారం) సర్వీసులను నిర్వహిస్తుంది. 2024 మార్చి 18 నుండి, నాడి, ఫనాఫుటి మధ్య సోమవారం విమానాలు కూడా నడుస్తాయి.[359]
↑A Directory for the Navigation of the Pacific Ocean: With Description of Its Coasts, Islands, Etc. from the Strait of Magalhaens to the Arctic Sea (1851)
↑Munro, Doug; Chambers, Keith S. (1989). "Duperrey and the Discovery of Nanumaga in 1824: an episode in Pacific exploration".Great Circle.11:37–43.
↑Faanin, Simati (1983). "Chapter 16 – Travellers and Workers". In Laracy, Hugh (ed.).Tuvalu: A History. Institute of Pacific Studies, University of the South Pacific and Government of Tuvalu. p. 122.
↑Goldsmith, Michael & Munro, Doug (2002).The accidental missionary: tales of Elekana. Macmillan Brown Centre for Pacific Studies, University of Canterbury.ISBN1877175331.
↑42.042.1Munro, D. (1996). "Samoan Pastors in Tuvalu, 1865–1899". In D. Munro & A. Thornley (ed.).The Covenant Makers: Islander Missionaries in the Pacific. Suva, Fiji, Pacific Theological College and the University of the South Pacific. pp. 124–157.ISBN9820201268.
↑Maude, H.E. (1981)Slavers in Paradise, Stanford University Press,ISBN0804711062.
↑44.044.144.244.344.4Doug Munro,The Lives and Times of Resident Traders in Tuvalu: An Exercise in History from Below, (1987) 10(2) Pacific Studies 73
↑Newton, W.F. (1967). "The Early Population of the Ellice Islands".Journal of the Polynesian Society.76 (2):197–204.
↑Bedford, Richard; Macdonald, Barrie & Munro, Doug (1980). "Population Estimates for Kiribati and Tuvalu".Journal of the Polynesian Society.89 (1): 199.
↑Teo, Noatia P. (1983). "Chapter 17, Colonial Rule". In Laracy, Hugh (ed.).Tuvalu: A History. University of the South Pacific/Government of Tuvalu. pp. 127–139.
↑A. Grove Day (1967).Louis Becke. Melbourne: Hill of Content. pp. 30–34.
↑A. Grove Day (1967).Louis Becke. Melbourne: Hill of Content. p. 35.
↑O'Neill, Sally (1980). "George Lewis (Louis) Becke (1855–1913)".Becke, George Lewis (Louis) (1855–1913). Australian Dictionary of Biography, National Centre of Biography, Australian National University.Archived from the original on 11 మే 2013. Retrieved 23 మార్చి 2013.
↑Mitchener, James A. (1957). "Louis Beck, Adventurer and Writer".Rascals in Paradise. Secker & Warburg.
↑The proceedings of H.M.S. "Royalist", Captain E.H.M. Davis, R.N., May–August, 1892, in the Gilbert, Ellice and Marshall Islands.
↑54.054.154.2Mahaffy, Arthur (1910)."(CO 225/86/26804)".Report by Mr. Arthur Mahaffy on a visit to the Gilbert and Ellice Islands. Great Britain, Colonial Office, High Commission for Western Pacific Islands (London: His Majesty's Stationery Office).Archived from the original on 21 మార్చి 2019. Retrieved 10 జూన్ 2013.
↑55.055.1Restieaux, Alfred.Recollections of a South Seas Trader – Reminiscences of Alfred Restieaux. National Library of New Zealand, MS 7022-2.
↑56.056.1Restieaux, Alfred.Reminiscences - Alfred Restieaux Part 2 (Pacific Islands). National Library of New Zealand, MS-Papers-0061-079A.
↑"Christian Martin Kleis"(PDF). TPB 02/2012 Tuvalu Philatelic Bureau. 2012.Archived(PDF) from the original on 2 జనవరి 2020. Retrieved 19 నవంబరు 2018.
↑Tyler, David B. – 1968The Wilkes Expedition. The First United States Exploring Expedition (1838–42). Philadelphia: American Philosophical Society
↑Wilkes, Charles."2".Ellice's and Kingsmill's Group. Vol. 5. The First United States Exploring Expedition (1838–42)Smithsonian Institution. pp. 35–75.Archived from the original on 20 సెప్టెంబరు 2003. Retrieved 13 ఏప్రిల్ 2011.
↑Janet Nicoll is the correct spelling of the trading steamer owned by Henderson and Macfarlane of Auckland, New Zealand, which operated between Sydney, Auckland and into the central Pacific.Fanny Vandegrift Stevenson misnames the ship as theJanet Nicol in her account of the 1890 voyage
↑Festetics De Tolna, Comte Rodolphe (1903)Chez les cannibales: huit ans de croisière dans l'océan Pacifique à bord du, Paris: Plon-Nourrit
↑"The Aristocrat and His Cannibals" Count Festetics von Tolna's travels in Oceania, 1893–1896. musée du quai Branly. 2007.
↑"Néprajzi Múzeum Könyvtára". The library of the Ethnographic Museum of Hungary.Archived from the original on 21 జూలై 2011. Retrieved 20 సెప్టెంబరు 2011.
↑Lifuka, Neli (1978)."War Years in Funafuti"(PDF). In Koch, Klaus-Friedrich (ed.).Logs in the current of the sea: Neli Lifuka's story of Kioa and the Vaitupu colonists. Australian National University Press/Press of the Langdon Associates.ISBN0708103626. Archived fromthe original(PDF) on 7 ఆగస్టు 2020. Retrieved 27 ఏప్రిల్ 2015.
↑Telavi, Melei (1983). "Chapter 18, War". In Laracy, Hugh (ed.).Tuvalu: A History. University of the South Pacific/Government of Tuvalu. pp. 140–144.
↑Barbin, Harold L. (2010).Beachheads Secured Volume II, The History of Patrol Torpedo (PT) Boats, Their Bases, and Tenders of World War II, June 1939 – 31 August 1945. pp. 549–550.
↑"Battle of Tarawa".World War 2 Facts.Archived from the original on 10 జూన్ 2019. Retrieved 3 ఫిబ్రవరి 2014.
↑90.090.1Sapoaga, Enele (1983). "Chapter 19, Post-War Development". In Laracy, Hugh (ed.).Tuvalu: A History. University of the South Pacific/Government of Tuvalu. pp. 146–152.
↑95.095.1Isala, Tito (1983). "Chapter 20, Secession and Independence". In Laracy, Hugh (ed.).Tuvalu: A History. University of the South Pacific/Government of Tuvalu.
↑Sandrine Job; Daniela Ceccarelli (డిసెంబరు 2011)."Tuvalu Marine Life Synthesis Report"(PDF).an Alofa Tuvalu project with the Tuvalu Fisheries Department.Archived(PDF) from the original on 31 అక్టోబరు 2013. Retrieved 3 డిసెంబరు 2013.
↑Sandrine Job; Daniela Ceccarelli (డిసెంబరు 2012)."Tuvalu Marine Life Scientific Report"(PDF).an Alofa Tuvalu project with the Tuvalu Fisheries Department.Archived(PDF) from the original on 31 అక్టోబరు 2013. Retrieved 3 డిసెంబరు 2013.
↑Dr A J Tilling & Ms E Fihaki (17 నవంబరు 2009).Tuvalu National Biodiversity Strategy and Action Plan(PDF). Fourth National Report to the Convention on Biological Diversity. p. 7.Archived(PDF) from the original on 30 జూలై 2022. Retrieved 29 సెప్టెంబరు 2013.
↑Thaman, Randy; Penivao, Feagaiga; Teakau, Faoliu; Alefaio, Semese; Saamu, Lamese; Saitala, Moe; Tekinene, Mataio; Fonua, Mile (2017)."Report on the 2016 Funafuti Community-Based Ridge-To-Reef (R2R)"(PDF).Rapid Biodiversity Assessment of the Conservation Status of Biodiversity and Ecosystem Services (BES) In Tuvalu.Archived(PDF) from the original on 25 మే 2019. Retrieved 25 మే 2019.
↑Carter, Ralf (4 జూలై 1986)."Wind and Sea Analysis – Funafuti Lagoon, Tuvalu"(PDF). South Pacific Regional Environmental Programme and UNDP Project RAS/81/102 (Technical. Report No. 58 of PE/TU.3). Archived fromthe original(PDF) on 18 జనవరి 2012. Retrieved 4 నవంబరు 2011.
↑Jeremy Goldberg and Clive Wilkinson (2004). "1". Global Threats to Coral Reefs: Coral Bleaching, Global Climate Change, Disease, Predator Plagues, And Invasive Species (Report). Vol. 1. Status of coral reefs of the world (Global Coral Reef Monitoring Network, and the International Coral Reef Initiative). p. 75.ISSN1447-6185.
↑"Klimatafel von Funafuti / Tuvalu (Ellice-Inseln)"(PDF).Baseline climate means (1961–1990) from stations all over the world (in జర్మన్). Deutscher Wetterdienst.Archived(PDF) from the original on 20 అక్టోబరు 2019. Retrieved 22 నవంబరు 2016.
↑Farbotko, Carol."Saving Tuvaluan Culture from Imminent Danger"(PDF).Climate Change: Risks and Solutions, 'Sang Saeng', pages 11–13, No 21 Spring 2008. Asia-Pacific Centre of Education for International Understanding (APCEIU) under the auspices of UNESCO.Archived(PDF) from the original on 20 జూన్ 2013. Retrieved 20 నవంబరు 2012.
↑"Ch.15 Tuvalu".Climate Change in the Pacific: Volume 2: Country Reports. Australia Government: Pacific Climate Change Science Program. 2011.Archived from the original on 29 జూన్ 2023. Retrieved 14 మార్చి 2015.
↑Anne Fauvre Chambers; Keith Stanley Chambers (2007). "Five Takes on Climate and Cultural Change in Tuvalu".The Contemporary Pacific.19 (1):294–306.doi:10.1353/cp.2007.0004.S2CID161220261.
↑Taafaki, Pasoni (1983). "Chapter 2 – The Old Order". In Laracy, Hugh (ed.).Tuvalu: A History. Institute of Pacific Studies, University of the South Pacific and Government of Tuvalu. p. 27.
↑Koop, Neville L (Winter 1991). DeAngellis, Richard M (ed.). Samoa Depression (Mariners Weather Log). Vol. 35. Fiji Meteorological Service. United States National Oceanic and Atmospheric Administration's National Oceanographic Data Service. p. 53.ISSN0025-3367.OCLC648466886.
↑Lifuka, Neli (1978). Koch, Klaus-Friedrich (ed.).Logs in the current of the sea: Neli Lifuka's story of Kioa and the Vaitupu colonists. Australian National University Press/Press of the Langdon Associates.ISBN0708103626.
↑"The Seasonal Worker Program". Department of Education, Employment and Workplace Relations (Australia). 1 జూలై 2012. Archived fromthe original on 15 ఆగస్టు 2012. Retrieved 9 సెప్టెంబరు 2012.
↑287.0287.1Goldsmith, Michael. (1985).Transformations of the Meeting-House in Tuvalu. Antony Hooper and Judith Huntsman, eds., ‘Transformations of Polynesian Culture’ Polynesian Society.
↑Panapa, Tufoua (2012)."Ethnographic Research on Meanings and Practices of Health in Tuvalu: A Community Report"(PDF). Report to the Tuvaluan Ministries of Health and Education: Ph D Candidate Centre for Development Studies – "Transnational Pacific Health through the Lens of Tuberculosis" Research Group. Department of Anthropology, The University of Auckland, N.Z. pp. 39–41.Archived(PDF) from the original on 4 ఫిబ్రవరి 2018. Retrieved 6 జనవరి 2018.
↑Mallon, Sean (2 అక్టోబరు 2013)."Wearable art: Tuvalu style". Museum of New Zealand (Te Papa) blog.Archived from the original on 14 నవంబరు 2014. Retrieved 10 ఏప్రిల్ 2014.
↑292.0292.1Kennedy, Donald (1931).The Ellice Islands Canoe. Journal of the Polynesian Society, Memoir no. 9. pp. 71–100. Archived fromthe original on 6 అక్టోబరు 2022. Retrieved 19 ఏప్రిల్ 2019.
↑Gerd Koch (translated by Guy Slater) (1981).The Material Culture of Tuvalu. Suva: University of the South Pacific. ASIN B0000EE805.
↑295.0295.1Linkels, Ad (2000).The Real Music of Paradise. Rough Guides, Broughton, Simon and Ellingham, Mark with McConnachie, James and Duane, Orla (Ed.). p. 221.ISBN1-85828-636-0.
↑Panapa, Tufoua (2012)."Ethnographic Research on Meanings and Practices of Health in Tuvalu: A Community Report"(PDF). Report to the Tuvaluan Ministries of Health and Education: Ph D Candidate Centre for Development Studies – "Transnational Pacific Health through the Lens of Tuberculosis" Research Group. Department of Anthropology, The University of Auckland, N.Z. p. 19, footnote 4. Retrieved 6 జనవరి 2018.