2014 estimate. A new estimate has been added in order to give a more correct GDP per capita.
Preliminary results of 2011 census, which excluded four northern Serb-majority municipalities where it could not be carried out.
Adopted unilaterally; Kosovo is not a formal member of theeurozone.
Assigned 15 December 2016 to Kosovo by ITU.[7]+381 was previously used for fixed lines. Kosovo-licensed mobile-phone providers used+377 (Monaco) or+386 (Slovenia) instead.
కొసావో (/ˈkɒsəvoʊ,ˈkoʊ-/;[8] లేక కొసోవ్ ఒక వివాదాస్పదమైన భూభాగంగా ఉంది.[9][10] ఇది పాక్షికంగా గుర్తించబడిన రాజ్యం.[11][12] ఆగ్నేయ ఐరోపాలో ఉన్న కొసావో 2008 లోసెర్బియా నుండి " కొసావో రిపబ్లిక్ "గా స్వాతంత్ర్యం ప్రకటించింది.
కొసావో కేంద్ర బాల్కన్ ద్వీపకల్పంలోని భూబంధిత దేశంగా ఉంది. భౌగోళికంగా బాల్కన్లో దాని వ్యూహాత్మక స్థానంతో మధ్య, దక్షిణ ఐరోపా, అడ్రి,యాటిక్ సముద్రం,నల్ల సముద్రం మధ్య ముఖ్యమైన అనుసంధానంగా పనిచేస్తుంది. దేశ రాజధానుగా అతిపెద్ద నగరంగా ప్రిస్టినా ఉంది. ఇతర పట్టణ ప్రాంతాలలో ప్రిరెన్న్, పెక్, ఫెర్జి,జ్ ప్రధానమైనవి. ఇది నైరుతిసరిహద్దులోఅల్బేనియా, దక్షిణసరిహద్దులోఉత్తర మేసిడోనియా రిపబ్లిక్, పశ్చిమసరిహద్దులోమాంటెనెగ్రో, ఉత్తర - తూర్పు సరిహద్దులోసెర్బియా భూభాగాలు సరిహద్దులుగా ఉన్నాయి.దీనిని సెర్బియా ప్రభుత్వం సెర్బియా భూభాగంగా గుర్తిస్తుంది.[13] కొసావో మాత్రం స్వంత స్వయంప్రతిపత్త " కొసావో, మెటోహైజాగా " చెప్పుకుంటుంది.
కొసావో చరిత్ర పాలియోలితిక్ కాలం నాటిది. ఇది విన్కా, స్టార్కీవో సంస్కృతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈప్రాంతంలో సాంప్రదాయ కాలములో ఇల్లియన్-డార్డానియన్, సెల్టిక్ ప్రజలు నివసించేవారు.క్రీ.పూ. 168 లో ఈ ప్రాంతాన్ని రోమన్లు స్వాధీనం చేసుకున్నారు.[14] ఈభూభాగాన్ని గతంలో మధ్య యుగ ఈప్రాతం బైజాంటైన్, బల్గేరియన్, సెర్బియన్ సామ్రాజ్యాలు స్వాధీనం చేసుకుంది. 1389 నాటి కొసావో యుద్ధం సెర్బియా మధ్యయుగ చరిత్రలో కాలంలో ఒకటిగా పరిగణించబడుతుంది. సెర్బియా మధ్యయుగ రాజ్యానికి ఈ దేశం ప్రధాన కేంద్రంగా ఉంది. 14 వ శతాబ్దం నుంచి సెర్బియా ఆర్థోడాక్స్ చర్చి స్థానంగా ఉంది. దీని హోదా ఒక పితృస్వామ్యానికి మార్చబడింది.[15][16]
కొసావో 15 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దం వరకు ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. 19 వ శతాబ్దం చివరిలో అల్బేనియన్ జాతీయ మేల్కొలుపుకు కొసావో కేంద్రంగా మారింది. బాల్కన్ యుద్ధాలలో వారి ఓటమి తరువాత ఒట్టోమన్లు కొసావోను సెర్బియా, మాంటెనెగ్రోకు అప్పజెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాతయుగోస్లేవియాలో ఉంది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుగోస్లేవ్ యురేటరనిజం కాలం తరువాత యుగోస్లావ్ రాజ్యాంగం యుగోస్లావ్ రాజ్యాంగ రిపబ్లిక్లో సెర్బియా, మెటోహిజా స్వయంప్రతిపత్త ప్రాంతం ఏర్పాటు చేసింది. 20 వ శతాబ్దంలో కొసావో అల్బేనియన్, సెర్బ్ కమ్యూనిటీల మధ్య స్వల్పంగా మొదలైన ఉద్రిక్తతలు అప్పుడప్పుడు ప్రధాన హింసాకాండతో విస్పోటం చెందాయి.ఇది 1998 - 1999 లో జరిగిన కొసావో యుద్ధంతో ఇది ముగిసింది. ఫలితంగా సెర్బియా సైనిక దళాల ఉపసంహరణ, కొసావోలో ఐక్యరాజ్యసమితి మధ్యంతర పాలనా యంత్రాంగం ఏర్పాటు చేయబడింది. 2008 ఫిబ్రవరి 17 న కొసావో ఏకపక్షంగా సెర్బియా నుండి స్వాతంత్ర్యం ప్రకటించింది. అప్పటి నుండి అది సార్వభౌమ రాజ్యంగా దౌత్యపరంగా గుర్తింపు పొందింది. సెర్బియా కొసావోను ఒక రాజ్యంగా గుర్తించటానికి తిరస్కరించింది.[17] అయితే 2013 బ్రస్సెల్స్ ఒప్పందంతో దాని సంస్థాగత చట్టబద్ధత ఆమోదించబడింది. కొసావో ఒక తక్కువ-మధ్య-ఆదాయం కలిగిన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలచే గత దశాబ్దంలో గట్టి ఆర్థిక వృద్ధిని సాధించింది. 2008 లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి ప్రతి సంవత్సరం వృద్ధిని సాధించింది.[18]
మొత్తం ప్రాంతం సాధారణంగా ఇంగ్లీష్లో కొసావో, అల్బేనియన్ కోస్సోవా లేదా కోసోవేగా సూచించబడుతుంది. సెర్బియాలో తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య ఒక అధికారిక వ్యత్యాసం ఉంది; కొసావో (కోసోవో) అనే పదం చారిత్రాత్మక కొసావో మైదానంలో కేంద్రీకృతమై తూర్పు భాగంలో ఉపయోగించబడుతుంది. పశ్చిమ ప్రాంతాన్ని మెట్రోహిజా (మెటోహై) అని పిలుస్తారు (అల్బేనియన్లో డుకాగ్జిని అని పిలుస్తారు).[19]
కోసొవొ అనేది కాస్కో (కోస్) "బ్లాక్బర్డ్" అనే పేరుతో అనుబంధం కలిగి ఉంది. కొసొవో పోజే ఒక ఎలిప్సిస్ 'బ్లాక్బర్డ్ ఫీల్డ్'. నేటి కొసావో 1389 " కొసావో యుద్ధం " జరిగిన ప్రాంతం.[20] పేరు 1864 లో సృష్టించబడిన కొసావో ప్రొవిన్సుకు వర్తింపజేయబడింది.
అల్బేనియన్లు కొర్డోవోని డార్డినియాగా పేర్కొంటారు.ఆధునిక కొసావో భూభాగం క్రీ.పూ. 165 లో ఏర్పడిన రోమన్ రాజ్యంలో భాగంగా ఉంది. దాదాని ప్రాచీన తెగ నుండి ఈ పేరు వచ్చింది. చివరికి ప్రోటో-అల్బేనియన్ పదం దాదా లేక దదాదా అంటే "పియర్" అని అర్ధం.[21] మాజీ కొసావో అధ్యక్షుడు ఇబ్రహీం రుగోవా దేశానికి ఒక "డార్డానియన్" గుర్తింపు, కోసోవాన్ జెండా, ప్రెసిడెన్షియల్ సీల్, జాతీయ గుర్తింపును సూచించారు. అయినప్పటికీ "కోసోవా" అనే పేరు అల్బేనియన్ జనాభాలో విస్తృతంగా ఉపయోగించబడింది.
1945 లో ఎస్.ఎఫ్.ఆర్. యుగోస్లేవియాలో భాగంగా కొసావో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం, మెటోహిజా (1945-1963) కొత్త పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ సెర్బియా పరిపాలక విభాగంగా సృష్టించబడినప్పుడు కొసావో ప్రస్తుత సరిహద్దులు నిర్ణయించ చేయబడ్డాయి. 1963 లో స్వయంప్రతిపత్త ప్రాంతం స్వయంప్రత్తి ప్రాంత స్థాయి నుండి కొసావో - మెటోహిజా స్వయంప్రపత్తి కలిగిన ప్రావిన్స్ (1963-1968) స్థాయికి అభివృద్ధి చెందింది. 1968 లో "కొసావో - మెటోహిజా" ద్వంద్వ పేరు కొసావో సోషలిస్ట్ స్వయంప్రతిపత్తి కలిగిన ప్రావిన్స్ పేరు నుండి ఒక సాధారణ "కొసావో"కు తగ్గించబడింది. 1990 లో ఈ రాజ్యాన్ని కొసావో - మెటోహిజా అటానమస్ ప్రావిన్స్ గా మార్చారు.[22]
కొసావో రాజ్యాంగం ప్రకారం అధికారిక సాంప్రదాయిక దీర్ఘకాల పేరు కొసావో రిపబ్లిక్గా చెప్పవచ్చు. అంతర్జాతీయంగా కొసావోను సూచించడానికి ఉపయోగించబడుతుంది.[23]
అదనంగా యూరోపియన్ యూనియన్ మధ్యవర్తిత్వంలో చర్చలలో ప్రిస్టినా, బెల్గ్రేడ్ మధ్య అంగీకరించిన ఒప్పందం ఫలితంగా కొసావో "కొసావో" శీర్షికతో కొన్ని అంతర్జాతీయ ఫోరమ్, సంస్థలలో పాల్గొంది. యు.ఎన్.ఎస్.సి. 1244, ఐ.సి.ఒ. అభిప్రాయం ప్రకారం కొసావో స్వాతంత్ర్య ప్రకటన ". "ఆస్ట్రిస్క్ ఒప్పందం"గా పిలవబడిన ఈ ఏర్పాటు 2012 ఫిబ్రవరి 24 న అంగీకరించబడింది.[24]
TheGoddess of Varos sun-baked ceramic figure dating back to the 6th millennium BC.Goddess on the Throne is one of the most precious archaeological artifacts of Kosovo and has been adopted as the symbol ofPristina
పూర్వచరిత్రలో స్టార్సెవో సంస్కృతి, విన్కా సంస్కృతి తరువాత ఈ ప్రాంతంలో చైతన్యవంతంగా ఉండేవి.[25] కొసావో, చుట్టుప్రక్కల ప్రాంతం సుమారు 10,000 సంవత్సరాల నుండి మానవనివాస ప్రాంతంగా ఉంది. నియోలిథిక్ యుగంలో కొసావో వెస్ట్ ప్రాంతం లోపల బాల్కన్ వెస్కా-తుర్డాస్ సంస్కృతికి చెందిన ప్రజలలో నల్ల, బూడిదరంగు మట్టి పాత్రలు వాడకంలో ఉన్నాయి. మెటోహియాలో కంచు, ఇనుప యుగ సమాధులు కనుగొనబడ్డాయి.[26]
భౌగోళికంగా వ్యూహాత్మకంగా అనుకూలమైన స్థానం, విస్తారమైన సహజ వనరులు జీవితం అభివృద్ధికి అనువైనవి కావున కొసొవో అంతటా కనుగొని గుర్తించిన వందల పురావస్తు ప్రాంతాలలో లభించిన ఆధారాలు పూర్వ చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి.అవి కొసావోకు తన గొప్ప పురావస్తు వారసత్వాన్ని అందించాయి.[27] కొసొవో అంతటా జరిగే అన్వేషణలు, పరిశోధనల ఫలితంగా పురావస్తు లభ్యత కలిగిన ప్రాంతాలు అధికరిస్తూ ఉన్నాయి. కొసావో పురాతన కాలం గురించిన కొత్త ఆధారాలు అందించే అనేక జాడలు కూడా ఉన్నాయి.[27]
కొసొవా భూభాగంలో నమోదు చేయబడిన తొలి జాడలు రాతి యుగం కాలానికి చెందినవి. ఉదాహరణకి మానవ నివాసిత గుహలు ఉనికిలో ఉండేవి. వాటిలో డ్రిన్ నదిప్రవాహాల తీరంలోని రాడివ్స్కో గుహ నివాసప్రాంతంగా చేయబడింది. గ్రన్సర్ కావేలో (వీటినా మునిసిపాలిటీ), పీక్, డెమా,కరమకాజ్ గుహలు ప్రధానమైనవి. అయినప్పటికీ పాలోయోలితిక్ లేదా పురాతన రాతి యుగం సమయంలో మానవ స్థిరనిర్మాణం ఇంకా నిర్ధారించబడి శాస్త్రీయంగా నిరూపించబడలేదు. అందువలన పాలియోలితిక్, మేసోలిథిక్ మనవవాదనలు ధ్రువీకరించబడటంతో నియోలిథిక్ మనవుడు, నియోలిథిక్ ప్రాంతాలు కొసావోలో మానవ ఆవాస కాలక్రమానుసార అభివృద్ధిగా పరిగణించబడుతున్నాయి.[28]
ప్రిస్టీన ఆగ్నేయ ప్రాంతంలో ప్రాచీన ఉల్పియానా శిథిలాలు ఉన్నాయి. రోమన్ ప్రాదేశికమైన దర్దానియాలో అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా అభివృద్ధిలో ఈ నగరం కీలక పాత్ర పోషించింది.ఈ కాలం నుండి నేటి వరకు కొసొవో నివాసిత ప్రాంతంగా ఉంది. చరిత్రపూర్వ పురాతన కాలం నుండి, మధ్యయుగ సమయము వరకు సమాజాల కార్యకలాపాల జాడలు దాని భూభాగం అంతటా కనిపిస్తాయి. అయితే కొన్ని పురావస్తు ప్రదేశాల్లో అనేక శతాబ్దాలుగా నిరంతరాయంగా మానవులు నివసించిన జాడలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి.
పురాతన కాలంలో, కొసొవో ప్రాంతంలో గిరిజన జాతి సమూహాలు నివసించారు. వీరు పొరుగు సమూహాలతో తరలివెళ్ళడం, విస్తరించడం, ఫ్యూజ్, పొరుగు సమూహాలతో కలిసి జీవించడం సంభవించాయి. అందువల్ల అటువంటి సమూహాన్ని కచ్చితత్వంతో గుర్తించడం కష్టం. హెలెనిస్టిక్, ప్రారంభ రోమన్ యుగాల సమయంలో ఈ ప్రాంతంలోని ఒక ప్రముఖ సమూహంగా గుర్తించబడే కచ్చితమైన జాతి-భాషా అనుబంధం నిరూపించడం కష్టం.[29][30][31]
ఈ ప్రాంతం ఆ తరువాత ఇది రోమ్ క్రీ.పూ. 160 లో స్వాధీనం చేసుకుంది. క్రీ.పూ. 59 లో ఇల్రిరియం రోమన్ ప్రావింస్లోకి ప్రవేశించింది. ఆ తరువాత ఇది సా.శ. 87 లో మొయిస్సియా సుపీరియర్లో భాగంగా మారింది. ఈ ప్రాంతం సా.శ. 4 వ శతాబ్దం నుంచి అత్యధిక సంఖ్యలో 'బార్బేరియన్' దాడులకు గురైంది. 6 వ - 7 వ శతాబ్దాల మద్య స్లావిక్ వలసలు సంభవించాయి. పురావస్తుశాస్త్రపరంగా ప్రారంభ మధ్యయుగాలు భౌతిక రికార్డులో విరామ చిహ్నాన్ని సూచిస్తాయి.[32] స్థానిక ప్రాంతీయ జనాభా స్లావ్స్ నివసించిన చిహ్నాలు మిగిలి ఉన్నాయి.[33]
13 వ శతాబ్దం వరకు కొసావో తదుపరి రాజకీయ, జనాభా చరిత్రలకు కచ్చితమైన ఆధారాలు లభించలేదు. బాల్కన్ అంతటా మిగిలిన ప్రాంతాల్లో కనిపించే స్లావిక్ ప్రజల సంస్కృతి పునరుద్ధరణ, పురోగతిలో ఉందని పురావస్తు పరిశోధనలు సూచిస్తున్నాయి.ఈ ప్రాంతం 850 లో బల్గేరియన్ సామ్రాజ్యంలో విలీనం చేయబడింది. ఈ ప్రాంతంలో బిజాన్టిన్ సంస్కృతి స్థిరపడింది. ఇది 1018 తరువాత బైజాంటైన్స్ చేత తిరిగి తీసుకోబడింది.తరువాత క్రొత్తగా ఏర్పడినబల్గేరియా థీమ్లో భాగంగా మారింది. ఈ ప్రాంతంలోని కాంస్స్టాంటినోపుల్ స్లావిక్ నిరోధక కేంద్రంగా మారింది. 12 వ శతాబ్దంలో సెర్బియా గ్రాండ్ ప్రిన్స్ స్టీఫన్ నెమాంజా భద్రతలోకి మారే వరకు కొసావో సెర్బియా, బల్గేరియా పాలన మధ్య, బైజాంటైన్ మధ్య మారుతూ ఉంది.[34] ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక బైజాంటైన్ చరిత్రకారిణి - యువరాణి అన్నా కామ్నేనా, "సెర్బులు"ను ఈ ప్రాంతం "ప్రధాన" నివాసులుగా పేర్కొన్నది.[35] కొసావా ప్రస్తావన మొట్టమొదటిగా మైఖేల్ అటాలేయేట్స్ (అల్బేనియన్ల) నుండి వచ్చింది. ఆయన అర్బనిటాయ్ మాట్లాడే ప్రజలలో ఒకడు. వీరు అడ్రియాటిక్ సముద్రం మీద ఉన్న డర్రచియం (ఆధునిక దుర్రెస్) జిల్లాల చుట్టూ నివసించారు.[36][ఆధారం యివ్వలేదు]
1346 లో సెర్బియా సామ్రాజ్యం ఏర్పడటంతో సెర్బియా అధికారం అత్యున్నత స్థాయికి చేరింది. 13 వ - 14 వ శతాబ్దాలలో కొసావో సెర్బియన్ రాజ్యంలో రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కేంద్రంగా మారింది. 13 వ శతాబ్దం చివరలో సెర్బియా ఆర్చిబిషోప్రిక్ స్థావరం పెచ్కు మార్చబడింది. ప్రజ్జెన్, స్కోప్జేల మధ్య పాలకులు తమను తాము కేంద్రీకరించారు.[37] ఈ సమయంలో వేలమంది క్రిస్టియన్ ఆరామాలు, ఫ్యూడల్-శైలి కోటలు,సాధారణ కోటలు నిర్మించబడ్డాయి.[38]
ప్రిరిన్ కోటను స్టీఫన్ డుసాన్ సామ్రాజ్యం రాజధానిగా ఉపయోగించాడు. 1371 లో సెర్బియా సామ్రాజ్యం ప్రిన్సిపాలిటీల సమ్మేళనంగా చీలిపోయినప్పుడు కొసొవో బ్రాంకోవిక్ హౌస్ వారసత్వ భూమిగా మారింది. 14 వ - 15 వ శతాబ్దాల్లో కొసొవోలో భాగమైన తూర్పు ప్రాంతం ప్రిస్టినా సమీపంలో ఉంది. ఇది డుకాజ్జిని ప్రిన్సిపాలిటీలో భాగంగా ఉండేది. తర్వాత ఇది ఒట్టోమన్ వ్యతిరేక " అల్బేనియన్ రాజ్యాల లీజా లీగ్ " సమాఖ్యలో భాగం అయింది.[39] ప్రస్తుతం కొసావోలోని మధ్యయుగ స్మారక చిహ్నాలుగా ఉన్న నాలుగు సెర్బియా ఆర్థోడాక్స్ చర్చిలు, ఆరామాలు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలుగా ఉన్నాయి. మధ్య యుగంలో సెర్బియాలో అతి ముఖ్యమైన రాజవంశమైన నెమ్యాన్జిక్ రాజవంశం సభ్యులు ఈ నిర్మాణాలను స్థాపించారు.[40]
1389 కొసావోలో యుద్ధంలో ఒట్టోమన్ దళాలు లాజర్ హెర్బెల్జనొవిక్ నేతృత్వంలోని సంకీర్ణాన్ని ఓడించాయి.[41][42] కొందరు చరిత్రకారులు ముఖ్యంగా నోయెల్ మాల్కం 1389 లో కొసావో యుద్ధం ఒట్టోమన్ విజయంతో ముగియలేదు "సెర్బియా రాజ్యం మరో డెబ్బై సంవత్సరాలు జీవించలేదు" అని వాదించింది.[43] కొద్దికాలం తర్వాత లాజర్ కుమారుడు టర్కిష్ నామమాత్ర విసాల్గేజ్ను అంగీకరించాడు. తరువాత లాజర్ శాతి స్థాపన కొరకు సుల్తాన్ కుమార్తెను వివాహం చేసుకున్నారు. 1459 నాటికి ఒట్టోమన్లు న్యూ సెర్బియా రాజధాని సామ్డెరెవోను స్వాధీనం చేసుకున్నారు.[44] 16 వ శతాబ్దం రెండవ భాగం వరకుహంగేరి, వోజువోడినాను హంగేరియన్ పాలనలో వదిలివేశారు
1455 నుండి 1912 వరకు కొసావో ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. కొసావో మొదట ఓట్టమన్ ఉపవిభాగం అయిన రుమేలియాలో భాగంగా ఉంది. 1864 నుండి ఒక ప్రత్యేక కొసావో ప్రావిన్స్ (విలయెట్)గా ఉంది. ఈ సమయంలో ఇస్లాం మతం ప్రజలకు పరిచయం చేయబడింది. కొసావో విలియట్ నేటి కొసావో కంటే పెద్దదిగా ఉంది; ఇందులో ప్రస్తుత కొసావో భూభాగంలోని సాండ్జాక్ ప్రాంతం సుమడిజా, పశ్చిమ సెర్బియా,మాంటెనెగ్రో కలుపుకొని కుకెస్ మున్సిపాలిటీ, ప్రస్తుత ఉత్తర అల్బేనియా పరిసర ప్రాంతం, ఉత్తర-పశ్చిమఉత్తర మేసిడోనియా భాగాలు స్కోప్జే (అప్పుడు ఉస్కప్ దాని రాజధానిగా)ఉన్నాయి . 1881 - 1912 మధ్యకాలంలో (దాని ఆఖరి దశ) అంతర్గతంగా విస్తరించింది. నేటి రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియాలోని ఇతర ప్రాంతాలు, స్టిప్ (ఇస్తిప్ప్), కుమనోవో (కుమనోవా), క్రిటోవో (క్రిటోవా) వంటి పెద్ద పట్టణ స్థావరాలు ఉన్నాయి. సెర్బులు బహుశా 8 వ శతాబ్దం నుండి 19 వ శతాబ్దం వరకు కొసావోలో సంఖ్యాపరంగా ఆధిక్యత కలిగి ఉన్నారు.[45][46] చరిత్రకారులు ఫ్రెడరిక్ ఎఫ్. అన్స్ కాంబ్ వంటి కొంతమంది విద్వాంసులు మధ్యయుగ, ఒట్టోమన్ కొసావో జాతిపరంగా వైవిధ్యభరితంగా ఉండేది అని భావించారు. సెర్బులు, అల్బేనియన్లు వేర్వేరు సమయాల్లో ఆధిపత్యం చేసారు.[47]
ప్రిజీరెన్ నగరం సెర్బియన్ సామ్రాజ్యం రాజధాని. తరువాత మధ్యయుగంలో ఒట్టోమన్ కాలంలో కస్కోవా సాంస్కృతిక, మేధో కేంద్రంగా ఉంది
1683-99 నాటి గ్రేట్ వార్లోఆస్ట్రియా దళాలు ఆక్రమించిన విశాలమైన ఒట్టోమన్ ప్రాంతంలో కొసావో భాగంగా ఉంది.[48] కానీ తరువాత ఒట్టోమన్లు వారి పాలనను తిరిగి స్థాపించారు.ఆస్ట్రియా సామ్రాజ్యంలో (అప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యం ఆర్చ్-ప్రత్యర్థులు)రష్యా వంటి సాయంతో ఇటువంటి చర్యలు ఎల్లప్పుడూ తాత్కాలికమైనవి నిలిచాయి.[49][50] 1690 లోసెర్బియా నాయకుడు మూడవ ఆర్సెనిజే నాయకత్వంలో వేలమంది ప్రజలు కొసావో నుండి క్రిస్టియన్ ఉత్తరానికి వలస వెళ్ళారు. ఇది " గ్రేట్ సెర్బ్ మైగ్రేషన్ "గా పిలువబడింది.[51][52] 1766 లో ఒట్టోమన్లు పెచ్ పితృస్వామ్య దేశాన్ని రద్దు చేసి పూర్తిగా తమ ముస్లిం జనాభాపై జిజియాను విధించారు.
మొదట్లో టర్కులను అభివృద్ధి చేసి ప్రత్యర్థులుగా ఉన్న అల్బేనియన్ నాయకులు తరువాత ఓట్టోమనులను సార్వభౌమాధికారంగా ఆమోదించడానికి అంగీకరించారు. ఇది అల్బేనియన్లను ఇస్లాం మతంలోకి మార్చడానికి దోహదపడింది. ఒట్టోమన్ సామ్రాజ్యం విషయాలను మతపరమైన (జాతికి కాకుండా) విభజించినట్లుగా ఇస్లామిజం అల్బేనియన్ నాయకుల హోదాను బాగా పెంచింది. దీనికి ముందు ఆధునికఅల్బేనియా (క్రుజే నుండి సార్ శ్రేణి) పర్వత ప్రాంతాలలో నివసించే గిరిజన పూర్వీకులుగా నిర్వహించబడ్డారు.[53] కొద్దికాలం తర్వాత వారు వివాదాస్పదమైన కొసొవో వరకు విస్తరించారు.[54] తరువాత వాయవ్యమేసిడోనియాకు విస్తరించారు. అయితే కొంతమంది ఈ ప్రాంతానికి స్థానికులుగా ఉండేవారు.[55] ఏదేమైనా ప్రధాన స్థిరనివాసులు వ్లచస్కు బానాక్ అనుకూలంగా స్పందించాడు.[49]
చాలామంది అల్బేనియన్లు ఒట్టోమన్ ప్రభుత్వంలో ప్రముఖ స్థానాలను పొందారు. రచయిత "డెన్నిస్ హుప్చిక్" ప్రకారం "అల్బేనియన్లు అశాంతికి స్వల్ప కారణంగా ఉన్నారు. ". "ఏదైనా వారు ఒట్టోమన్ అంతర్గత వ్యవహారాలలో ముఖ్యమైనవారుగా అభివృద్ధి చెందారు."[56] 19 వ శతాబ్దంలో బాల్కన్ అంతటా జాతి చైతన్యవంతం అయింది. ముస్లిం అల్బేనియాలపై క్రిస్టియన్ సెర్బులు విస్తృతమైన పోరాటంలో అంతర్లీనంగా జాతి ఉద్రిక్తతలు భాగంగా ఉన్నాయి.[42] అల్బేనియన్ జాతీయవాద ఉద్యమం కొసావోలో కేంద్రీకృతమైంది. 1878 లో లీగ్ అఫ్ ప్రెరిన్ (లిడ్జా ఇ ప్రిరిరెన్ట్) స్థాపించబడింది. ఒట్టోమన్ సామ్రాజ్యం లోని అల్బేనియన్లందరినీ స్వయంప్రతిపత్తి, అధిక సాంస్కృతిక హక్కుల కోసం ఒక సాధారణ పోరాటం సాగించారు.[57] ఒట్టోమన్ సామ్రాజ్యంలో కొనసాగాలని కోరుకున్నప్పటికీ ఇది రాజకీయ సంస్థగా ఉంది.[58] 1881 లో లీగ్ తిరస్కరించబడింది. అయినప్పటికీ అల్బేనియన్ల మధ్య ఒక జాతీయ గుర్తింపును మేల్కొల్పింది.[59] అల్బేనియన్ లక్ష్యాలు సెర్బులతో పోటీ పడ్డాయి. సెర్బియా రాజ్యం పూర్వం తన సామ్రాజ్యంలో ఉన్న ఈ భూభాగాన్ని పొందుపరచాలని కోరుకుంది.
1876-78లోని సెర్బియా-ఒట్టోమన్ యుద్ధం సమయంలో, 30,000 - 70,000 మంది ముస్లింలలో ఎక్కువగా అల్బేనియన్లు ఉన్నారు. నిస్ సంజక్ నుండి సెర్బ్ సైన్యం బహిష్కరించబడి కొసావో విలాట్కు పారిపోయారు.[60][61][62][63][64][65]
1912 లో తిరుగుబాటు తరువాత సుల్తాన్ రెండవ అబ్దుల్ హమీదు తొలగించబడ్డాడు. యంగ్ టర్క్ ఉద్యమం ఒట్టోమన్ సామ్రాజ్యంపై నియంత్రణ పొందింది. ఈ ఉద్యమం ప్రభుత్వ కేంద్రీకృత రూపాన్ని బలపరిచింది. ఒట్టోమన్ సామ్రాజ్యంలోని వివిధ రాజ్యాలకు చెందిన ప్రజలు కోరిన స్వయంప్రతిపత్తిని వ్యతిరేకించింది. బదులుగా ఒట్టోమనిజానికి అనుకూలంగా ఉండడం ప్రోత్సహించబడింది.[66] 1912 లో సామ్రాజ్యం ఉత్తర భూభాగాలలోని కొసొవో, నోవి పజార్లో ప్రాంతాలలో అల్బేనియన్ తిరుగుబాటు బహిర్గతం అయింది. ఇదిమాంటెనెగ్రో సామ్రాజ్యం దండయాత్రకు దారితీసింది. 1912 లో ఒట్టోమన్లు అల్బేనియన్ల చేతిలో తీవ్రమైన ఓటమిని ఎదుర్కొన్నారు. అల్బేనియన్లు నివసించే భూభాగాల్లో చాలా వరకు ఒట్టోమన్ నష్టాన్ని ఎదుర్కొన్నారు. అల్బేనియన్లు సలోనికాకు మార్గాన్ని మార్చి అబ్దుల్ హమీదును తిరిగి నియమించాలని బెదిరించారు.[67]
బాల్కన్ వార్స్ 1913 తరువాత సెర్బియా రాజ్యం (పచ్చని) మోంటెనెగ్రో రాజ్యం (పర్పుల్) మధ్య కొసావో విలాట్ విభజన. బాల్కన్ యుద్ధాలలో అల్బేనియా కూడా చూడండి
ఒట్టోమన్ సైనికదళాల్లోని అల్బేనియన్ల అలలు కూడా ఈ కాలంలో తమ సొంత బంధంతో పోరాడడానికి నిరాకరించాయి. 1912 సెప్టెంబరులో సెర్బియా, మాంటెనెగ్రిన్, బల్గేరియన్, గ్రీకు శక్తులు కలిగిన ఒక ఉమ్మడి బాల్కన్ బలగం ఒట్టోమన్లను వారిఐరోపా ఆస్తుల నుండి చాలా వరకు బయటకు నడిపింది. జాతీయవాదం పెరగడం దురదృష్టవశాత్తూ రష్యన్లు, ఆస్ట్రియన్లు, ఒట్టోమన్ల ప్రభావం కారణంగా కొస్సోవోలోని అల్బేనియన్లు, సెర్బుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.[68] మొదటి బాల్కన్ యుద్ధంలో ఒట్టోమన్ల ఓటమి తరువాత పాశ్చాత్య కొసొవో (మెటోహిజా) 1913 నాటి లండన్ ఒడంబడిక మీద సంతకం చేసింది. మాంటెనెగ్రో, తూర్పు కొసొవా సెర్బియా సామ్రాజ్యానికి స్వాధీనం చేయబడ్డాయి.[69] 1912 లో సెర్బియా స్వాధీనం చేసుకున్న కొసావో ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం వరకు సెర్బియా వలసరాజ్యాలు స్థాపించడానికి ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి కొసావోలో సెర్బుల జనాభా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పడిపోయింది. కానీ అది అంతకు ముందు గణనీయంగా పెరిగింది.[70]
స్థానిక అల్బేనియన్ జనాభా నిష్క్రమణ జరిగింది. సెర్బియా అధికారులు కొసావోలో కొత్త సెర్బు స్థావరాలను సృష్టించడంతోపాటు సెర్బియన్ సమాజం అల్బేనియన్లకు ప్రోత్సాహం అందించింది.[71] అనేక మంది వలసరాజ్య సెర్బు కుటుంబాలు కొసావోలోకి తరలివెళ్ళడం ద్వారా అల్బేనియన్లు, సెర్బుల జనాభా సమతుల్యతను సమం చేసింది.[మూలం అవసరం]
జర్మన్ సైనికులు 1931 సిర్కాలోని మిత్రోవికా సమీపంలో ఒక సెర్బియన్ గ్రామంలో కాల్పులు జరిపారు
1915-16 శీతాకాలంలో మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా కొసావో బల్గేరియా, ఆస్ట్రియా-హంగరీలు కొస్సోవోను ఆక్రమించినప్పుడు సెర్బియా సైన్యం తిరోగమనం చూసింది. 1918 లో అలైడ్ పవర్స్ సెంట్రల్ పవర్సూను కొసావోలో ఓడించింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత సెర్బియా సామ్రాజ్యం 1918 డిసెంబరు 1 న సెర్బులు, క్రోయేషియన్లు, స్లోవేనియన్ల రాజ్యంగా రూపాంతరం చెందింది.
కొసావో నాలుగు కౌంటీలుగా విభజించబడింది. మూడు సెర్బియా (జ్వెకాన్, కొసావో, దక్షిణ మెటోహిజా),మాంటెనెగ్రో (ఉత్తర మెటోహిజా) లలో భాగంగా ఉంది. ఏదేమైనప్పటికీ 1922 ఏప్రిల్ 26 నుండి నూతన పరిపాలనా వ్యవస్థ రాజ్యంలోని మూడు జిల్లాలు (ఓబ్లాస్ట్): కొసావో, రాస్కా, జీటా మధ్య కొసావో విభజించబడింది. 1929 లో ఈ దేశం యుగోస్లేవియా రాజ్యంగా మారింది. కొసావో భూభాగాలు జీటా బానేట్ మొరావా బానేట్, వార్దార్ బనాట్ మధ్య పునర్వ్యవస్థీకరించబడ్డాయి. కొసావో జాతి కూర్పును మార్చడానికి 1912-1941 మధ్య బెల్గ్రేడ్ ప్రభుత్వం కొసావో ప్రాంతంలో భారీ-స్థాయి సెర్బియన్ పునః వలసీకరణ చేపట్టింది. రాజ్యాంగ దేశాలుగా గుర్తించబడిన కోసోవా,అల్బేనియన్లు 'స్లావిక్ క్రోయాట్, సెర్బు, స్లొవేన్ దేశాలు యుగోస్లేవియాతో పాటు ఇతర స్లావిక్, గుర్తించబడని స్లావిక్ దేశాలకు వారి స్వంత భాషలో విద్యను స్వీకరించాలన్న కోరిక తిరస్కరించబడింది. ఇతర స్లావులు మూడు అధికారిక స్లావిక్ దేశాలలో ఒకదానిని గుర్తించవలసి వచ్చింది. కాని స్లావ్-కాని దేశాలు అల్పసంఖ్యాక దేశాలుగా భావించబడ్డాయి.[71]
1919 లో అల్బేనియన్లు, ఇతర ముస్లింలు భూ సంస్కరణతో బాధించబడిన అల్బేనియన్ భూస్వాములు ప్రత్యక్ష హింసాత్మక చర్యల కారణంగా వలసవెళ్లారు.[72][73] 1938 లో 2,40,000 అల్బేనియన్ల బహిష్కరణ తరువాత టర్కీకి తరలించడానికియుగోస్లేవియా -టర్కీ రాజ్యాల మధ్య రెండు ఒప్పందాలు మీద సంతకాలు చేయబడ్డాయి. రెండవ ప్రపంచ యుద్ధం సంభవించిన కారణంగా ఒప్పందాలు అమలు చేయబడ లేదు.[74]
1941 లో యాక్సిస్ యుగోస్లేవియా దండయాత్ర తరువాత కొసావోలు అధికంగాఇటలీ నియంత్రిత అల్బేనియాకు కేటాయించబడ్డారు. మిగిలిన వారుజర్మనీ,బల్గేరియా నియంత్రణలో ఉన్నారు. త్రిమితీయ వివాదం అంతర్-జాతి, సైద్ధాంతిక, అంతర్జాతీయ అనుబంధాలను కలిగి ఉంది. మొదటిది చాలా ముఖ్యమైనది. ఏదేమైనప్పటికీ ఈ యుద్ధాలు యుగోస్లేవియాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా తక్కువస్థాయిలో ఉన్నాయి.కలహాలలో 3,000 అల్బేనియన్లు, 4,000 సెర్బులను,, మాంటెనెగ్రిన్లను చంపినట్లు ఒక సెర్బు చరిత్రకారుడు తెలియజేసాడు. మరో ఇద్దరు 12,000 మంది అల్బేనియన్లు, 10,000 సెర్బులు, మోంటెనెగ్రిన్లు మరణించినట్లు పేర్కొన్నారు.[75] 1964 లో యుగోస్లావ్ ప్రభుత్వం నిర్వహించిన ఒక అధికారిక పరిశోధన 1941 - 1945 మధ్య కొసావోలో దాదాపు 8,000 యుద్ధ-సంబంధిత మరణాలను నమోదు చేసింది. దీనిలో 5,489 మంది సెర్బులు, మాంటెనెగ్రిన్, 2,177 మంది అల్బేనియన్లు ఉన్నారు.[76] ఇది 1941 - 1945 ల మధ్య వేలాది మంది సెర్బులు ఎక్కువగా ఇటీవలి వలసవాదులు కొసావో నుండి పారిపోయారు. అంచనాలు 30,000 నుండి 1,00,000 వరకు వలసపోయారని భావించారు.[77] అల్బేనియా నుండి కొసావో వరకు పెద్ద సంఖ్యలో అల్బేనియన్ వలసలు జరిగాయి. ఇది కొందరు అధ్యయన కారులు 72,000[78][79] నుండి 2,60,000 మంది ప్రజలు (1985 పిటిషన్లో చివరి వ్యక్తిగా ఉద్భవించే ధోరణిని)అని అంచనా వేశారు. కొందరు చరిత్రకారులు, సమకాలీన సూచనలుఅల్బేనియా నుండి కొసావో వరకు అల్బేనియన్ల భారీ స్థాయి వలసలను యాక్సిస్ పత్రాల్లో నమోదు చేయలేదని నొక్కిచెప్తున్నాయి.[80]
1945 లో ఈ రాజ్యం స్వతంత్రంలో భాగంగా మొదటిసారిగా " అటానమస్ కొసావో-మెటోహ్యాన్ " ప్రాంతం రూపొందించబడింది. రెండవ ప్రపంచ యుధ్ధం వరకు విలియట్ నుండి రూపొందించబడిన ఈప్రాంతం కొసొవో పేరుతో పిలువబడింది. దాని అంతర్గత జనాభాకు ప్రత్యేక ప్రాముఖ్యత లేనప్పటికీ ఇది ఒక ప్రత్యేక రాజకీయ విభాగంగా ఉంది. ఒట్టోమన్ సామ్రాజ్యంలో (ఇంతకు ముందు భూభాగం నియంత్రించబడింది) ఇది అనేక సందర్భాలలో దాని సరిహద్దులను సవరించిన ఒక విలాయెట్గా ఉంది. ఒట్టోమన్ ప్రావిన్సుగా చివరిసారిగా ఉన్నసమయంలో అది ప్రస్తుతం అల్బేనియాకు ఇవ్వబడిన ప్రాంతాలను కలిగి ఉంది. కొత్తగా సృష్టించబడిన యుగోస్లేవ్ రిపబ్లిక్ ఆఫ్ మాంటెనెగ్రో లేదా మాసిడోనియాగా (దాని మునుపటి రాజధాని అయిన స్కోప్జేతో సహా) రూపొందింది.
పొరుగున ఉన్న అల్బేనియాతో కలిగివున్న సంబంధాల కారణంగా అల్బెనియన్లు, యుగోస్లావ్ ప్రభుత్వానికి మధ్య (జాతి ఉద్రిక్తతలు కాకుండా) రాజకీయ సిద్ధాంతపరమైన సమస్యల కారణంగా ఉద్రిక్తతలు తలెత్తాయి.[81] స్టాలినిస్ట్ పాలన సానుభూతిగల వారుగా " అల్బేనియా ఎన్వర్ హోక్స్హా " కొసావో అల్బేనియాలపై కఠినమైన అణచివేత చర్యలు విధించాడు.[81] 1956 లో ప్రిస్టినాలో జరిగిన కార్యక్రమ విచారణలో కొసావోలోని పలు అల్బేనియన్ కమ్యూనిస్టులను అల్బేనియా చొరబాటుదారులుగా నిర్ధారించి వారికి దీర్ఘకాల శిక్షలు ఇవ్వబడ్డారు.[81] సెర్బియాలో ఉన్న సెర్బుల స్థానాన్ని కాపాడటానికి, కొసావో నామినెక్చుటరాలో ఆధిపత్యం ఇచ్చేందుకు ఉన్నత-స్థాయి సెర్బియా కమ్యూనిస్టు అధికారి అయిన అలెక్సాండర్ రాంకోవిక్ ప్రయత్నించాడు.[82]
ఈ సమయంలో కొసావోలో ఇస్లాం మతం అణచివేయబడింది. అల్బేనియన్లు, ముస్లిం స్లావ్లు తమను తాము టర్కీలుగా ప్రకటించాలని కోరుకుని టర్కీకి వలసవెళ్లారు.[81] అదే సమయంలో సెర్బులు, మాంటెనెగ్రిన్ల ప్రభుత్వం, భద్రతా దళాలు, కొసావోలో పారిశ్రామికరంగం ఉపాధికల్పన రంగంలో ఆధిపత్యం చేశాయి.[81] అల్బేనియా ఈ పరిస్థితులకు ఆగ్రహించి 1960 ల చివరలో కొసావోలో అధికారులు తీసుకున్న చర్యలను నిరసిస్తూ కొసావొను రిపబ్లిక్ చేయాలని లేదా అల్బేనియాకు మద్దతు ప్రకటించాలని కోరారు.[81]
1966 లో రాంకోవికును తొలగించిన తరువాత ప్రత్యేకించిస్లోవేనియా,క్రొయేషియా యుగోస్లేవియాలో అధికార-వికేంద్రీకరణ సంస్కర్తల అజెండా అధికారాల గణనీయమైన వికేంద్రీకరణను సాధించడంలో విజయవంతమైంది. 1960లో కొసావో, వోజువోడినాలో గణనీయమైన స్వయంప్రతిపత్తి సృష్టించడం, ముస్లిం యుగోస్లేవ్ జాతీయతను గుర్తించడం జరిగింది.[83] ఈ సంస్కరణల ఫలితంగా కొసావో నామెంక్లచురా, పోలీసుల భారీ పరిణామం సంభవించింది. ఇది సెర్బియాల మీద పెద్దసంఖ్యలో కాల్పులు చేయడం ద్వారా అల్బేనియన్-ఆధిపత్య ప్రాంతంగా మార్చింది.[83] ప్రిస్కినా విశ్వవిద్యాలయాన్ని అల్బేనియన్ భాషా సంస్థగా సృష్టించబడింది. అశాంతికి ప్రతిస్పందనగా కొసావో అల్బేనియన్లకు మరింత రాయితీలు ఇవ్వబడ్డాయి.[83] యుగోస్లేవియాలో వారు రెండో-తరగతి పౌరులుగా తయారవుతున్నారని సెర్బులు ఈ మార్పులకు విస్తృతంగా భయపడ్డారు.[84] 1974 నాటి యుగోస్లేవియా రాజ్యాంగం ప్రకారం కొసావో దాని స్వంత పరిపాలన, శాసనసభ, న్యాయవ్యవస్థను కలిగి ఉండటానికి ప్రధాన స్వయంప్రతిపత్తి ఇవ్వబడింది; సామూహిక ప్రెసిడెన్సీ, యుగోస్లావ్ పార్లమెంటులో సభ్యత్వాన్ని కలిగి ఉండటంతో ఇది వీటో అధికారాన్ని కలిగి ఉంది.[85]
1974 రాజ్యాంగం తరువాత కొసావొలో అల్బేనియన్ జాతీయవాదం పెరుగుదలపై మొదలైన ఆందోళనలు 1978 లో " లీగ్ ఆఫ్ ప్రిరిన్న్ " స్థాపన 100 వ వార్షికోత్సవంలో విస్తృతమైన ఉత్సవాలతో అధికరించాయి.[81] యుగోస్లేవియాలోని "మైనారిటీ"గా వారి హోదా కాపాడుకున్నారు. రెండవ-తరగతి పౌరులుగా ఉంటూ యుగోస్లేవియాలోని ఇతర రిపబ్లిక్లతో పాటు కొసావో ఒక రాజ్యాంగ రిపబ్లిక్గా ఉండాలని డిమాండ్ చేశారు.[86] 1981 లో కొసావో స్థితిగతులపై అల్బేనియన్లు చేసిన నిరసనలు యూగోస్లావ్ ప్రాదేశిక రక్షణ విభాగాలను కొసావోలోకి తీసుకురాబడ్డాయి.తరువాత అత్యవసర పరిస్థితిని ప్రకటించబడింది.తరువాత హింసాత్మక చర్యలతో నిరసనలు అణిచివేయబడ్డాయి.[86] 1981 నిరసనలు తరువాత కమ్యూనిస్టు పార్టీలో ప్రక్షాళనలు జరిగాయి. ఇటీవల అల్బేనియన్లకు మంజూరు చేసిన హక్కులు రద్దు చేయబడ్డాయి. విద్యావ్యవస్థలో అల్బేనియన్ ప్రొఫెసర్లు అల్బేనియన్ భాష పాఠ్యపుస్తకాల కేటాయింపు ముగింపు చేయబడింది.[86]
చాలా ఎక్కువ జనన రేట్ల కారణంగా అల్బేనియన్ల నిష్పత్తి 75% నుండి 90%కు పెరిగింది. దీనికి విరుద్ధంగా సెర్బుల సంఖ్య మొత్తం జనాభాలో 15% నుంచి 8% వరకు తగ్గింది. ఎందుకంటే అనేక సెర్బులు కొసావో నుండి గట్టి ఆర్థిక వాతావరణం, వారి అల్బేనియా పొరుగువారి సంఘటనలకు ప్రతిస్పందనగా వెలుపలికి వెళ్లారు. ఉద్రిక్తత ఉన్నప్పటికీ "జాతి" ప్రణాళికా వేధింపు ఆరోపణలు కొసావో స్వయంప్రతిపత్తిని రద్దు చేయటానికి ఒక సాకుగా నిలిచాయి. ఉదాహరణకు 1986 లో సెర్బియా ఆర్థోడాక్స్ చర్చి కొసావో సెర్బుల "అల్బొనివ్ ప్రోగ్రాం ఆఫ్ 'జెనోసైడ్' "కు లోబడి ఉన్నాయని అధికారిక వాదన ప్రచురించింది.[87]
పోలీస్ స్టాటిస్టిక్స్ వారు నిరాకరించినప్పటికీ[87][page needed] వారు సెర్బియన్ ప్రెస్లో విస్తృతమైన అవగాహన పొందారు. మరింత అధికరించిన జాతి సమస్యలు చివరికి కొసావో స్థితిని తొలగించటానికి దారితీసింది. 1981 మార్చిలో ప్రిస్టినా విశ్వవిద్యాలయం కోసోవా అల్బేనియా విద్యార్థులు యుగోస్లేవియాలో కొసావో ఒక రిపబ్లిక్గా మారడం, మానవ హక్కులు రక్షణ కోరుతూ నిరసనలు నిర్వహించారు.[88] పోలీసులు, సైన్యం అనేకమంది నిరసనకారులను అరెస్టుతో నిరసనను అణచి వేశారు.[89] 1980 లలో యుగోస్లేవ్ ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా జాతి ఉద్రిక్తతలు తరచూ హింసాత్మక చర్యలు వ్యాప్తి చెందాయి. దీని ఫలితంగా కొసావో సెర్బుల ఇతర జాతుల సమూహాలు మరింతగా అధికరించారు.[90][91] యూగోస్లావ్ నాయకత్వం జాతి వివక్ష, హింస నుండి రక్షణ కొరకు కోసోవో సెర్బులు చేసిన నిరసనలు అణిచివేసేందుకు ప్రయత్నించింది.[92]
TheU.S. Marines set up a road block near the village of Koretin in June 16, 1999.
1980 లలో కొసొవోలో అంతర్-జాతి ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. 1989 లో సెర్బియా అధ్యక్షుడు స్లోబోడాన్ మిలోసోవిక్ బెదిరింపులు, రాజకీయ యుక్తి కలిపి సెర్బియాలో కొసావో ప్రత్యేక స్వతంత్ర హోదాను తీవ్రంగా తగ్గించారు. సంప్రదాయ అల్బేనియన్ జనాభా సాంస్కృతికత అణిచివేతలను ప్రారంభించారు.[93] కొసావో అల్బేనియాలు అహింసాత్మక వేర్పాటువాద ఉద్యమాలతో స్పందిస్తూ విస్తృతమైన శాసనోల్లంఘనను అమలు చేయడం ప్రారంభించారు. విద్య, వైద్య సంరక్షణ, పన్నుల రూపంలో సమాంతర నిర్మాణాలను సృష్టించారు. కొసావో స్వాతంత్ర్యం సాధించే అంతిమ లక్ష్యంతో ఉద్యమం కొనసాగించారు.[94]
1990 జూలైలో కొసావో అల్బేనియాలు రిపబ్లిక్ ఆఫ్ కోస్సో ఉనికిని ప్రకటించాయి. 1992 సెప్టెంబరులో ఒక సార్వభౌమ స్వతంత్ర రాజ్యంగా ప్రకటించింది.[95] 1992 మే ఎన్నికలో ఇబ్రహీం రుగోవ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఇందులో కొసావో అల్బేనియా మాత్రమే పాల్గొన్నారు.[96] దాని జీవితకాలంలో రిపబ్లిక్ ఆఫ్ కొసావా అల్బేనియాచే మాత్రమే అధికారికంగా గుర్తించబడింది. 1990 ల మధ్య నాటికి కొసావోలో అల్బేనియా జనాభా విరామం లేకుండా అభివృద్ధి చెందింది. ఎందుకంటే కొసావో స్థితి 1995 నవంబరు డేటన్ ఒప్పందంలో పరిష్కరించబడలేదు. ఇది బోస్నియా యుద్ధంతో ముగిసింది. 1996 నాటికి కొసావో విభజనను కోరుకునే జాతికి అల్బేనియన్ గెరిల్లా పారామిలిటరీ సమూహమైన " కొసావో లిబరేషన్ ఆర్మీ " (కె.ఎల్.ఎ), గ్రేటర్ ఆల్బానియా[a] రుగోవ అహింసా వ్యతిరేక ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ కొసావోలో యుగోస్లేవ్ ఆర్మీ, సెర్బియన్ పోలీస్ దాడులు ఫలితంగా కొసావో యుద్ధం జరిగింది.[93][102]
1998 నాటికి అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా యుగోస్లేవియా బలవంతంగా కాల్పుల విరమణకు సంతకం చేసి దాని భద్రతా దళాలను ఉపసంహరించుకుంది. రిచర్డ్ హోల్బ్రూక్ సంప్రదింపుల ఒప్పందం ప్రకారం యూరోప్ పరిశీలకుల సంస్థ భద్రత, సహకారం ద్వారా పర్యవేక్షించబడాలని నిబంధన విధించబడింది. 1998 డిసెంబరులో కాల్పుల విరమణ కొనసాగలేదు. పోరాటం రాకాక్ ఊచకోతతో ముగుసింది.ఈ సంఘర్షణ మరింత అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.[93] కొన్ని వారాలలోనే ఒక బహుపాక్షిక అంతర్జాతీయ సమావేశం సమావేశమైంది. మార్చి నాటికి రాంబురేట్ ఒప్పందం అని పిలువబడే ఒక డ్రాఫ్ట్ ఒప్పందం సిద్ధం చేసింది. కొసావో స్వయంప్రతిపత్తి పునరుద్ధరణ కొరకు నాటో శాంతి భద్రతా దళాల నియోగించడం కోసం పిలుపునిచ్చింది. యుగోస్లేవ్ ప్రతినిధి బృందం డ్రాఫ్ట్ మీద సంతకం చేయడానికి నిరాకరించింది. 1999 మార్చి 24 - 10 జూన్ మధ్య యుగొస్లొవేకియా బాంబు దాడి చేయటం ద్వారా నాటో జోక్యం చేసుకుంది. మిలోస్వివిచ్ తన బలగాలను కొసావో నుండి తొలగించాలని ప్రతిపాదించింది.[103] నాటో భద్రతా మండలి ఏ విధమైన నిర్ణయం తీసుకోనప్పటికీ దాని జోక్యాన్ని చట్టబద్ధం చేయటానికి సహాయం చేసింది.
అల్బేనియన్ గెరిల్లాలు, యుగోస్లావ్ దళాల మధ్య నిరంతర పోరాటాలతో కలిపిన ఈ సంఘర్షణ కారణంగా కొసావో ప్రజలు మరింత భారీగా స్థానభ్రంశం అయ్యారు.[104] ఈ సంఘర్షణ సమయంలో దాదాపు ఒక మిలియన్ అల్బేనియన్లు పారిపోవడం, బలవంతంగా కొసావో నుండి వెలుపలకు తరలించబడడం జరిగింది. 1999 లో మాజీ యుగోస్లేవియా ప్రాసిక్యూటర్ " కార్లా డెల్ పొంటె " ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ కార్యాలయానికి అందించిన నివేదిక 11,000 కన్నా ఎక్కువ మంది మరణించారని తెలియజేసింది.[105] As of 2010[update] 2010 నాటికి దాదాపు 3,000 మంది ప్రజలజాడ ఇప్పటికీ తెలియరాలేదు.వీరిలో 2,500 అల్బేనియన్లు, 400 సెర్బులు,100 రోమన్లు ఉన్నారు.[106]
జూన్ నాటికి మిలోస్వివిచ్ కొసావోలో విదేశీ సైనిక దళం ఉపసంహరణకు అంగీకరించారు. యుగోస్లావ్ సైన్యం ఉపసంహరించుకున్న తరువాత కొసావో సెర్బులు, ఇతర అల్బేనియన్లు పారిపోవడం లేదా బహిష్కరించబడడం జరిగింది. మిగిలిన పౌరుల్లో చాలామంది నిందకు గురైయ్యారు.[107][107][108][109][110][111] కొసావో యుద్ధం సందర్భంగా 90,000 మందికి పైగా సెర్బియన్, ఇతర అల్బేనియన్ కాని శరణార్థులు యుద్ధంతో విధ్వంసానికి గురైన యుద్ధభూమి నుండి పారిపోయారు. యూగోస్లావ్ సైన్యం ఉపసంహరించిన కొన్ని రోజుల తరువాత 2,00,000 పైగా (దాదాపు సగం సెర్బులు) నాన్ - అల్బేనియన్ పౌరులు కొసావో నుండి బహిష్కరించబడ్డారు. మిగిలిన పౌరులు చాలా మంది దుర్వినియోగం బాధితులుగా ఉన్నారు.[111][112][113][114][115] కొసావో, ఇతర యుగోస్లావ్ యుద్ధాల తరువాత సెర్బియా ఐరోపాలో అత్యధిక సంఖ్యలో శరణార్థులు, ఐ.డి.పిలు (కొసావో సెర్బులతో సహా) స్థావరంగా మారింది.[116][117][118]
1998 లో అల్బేనియన్ నియంత్రణలో ఉన్న కొన్ని గ్రామాలలో తీవ్రవాదులు వారి ఇళ్ల నుండి సెర్భుజాతి ప్రజలను వెలుపలకు పంపారు. మిగిలిపోయిన వారిలో కె.ఎల్.ఎ.చేత అపహరించబడి చంపబడ్డారని భావిస్తున్నారు. 1998 జూలై 19 న ఒరహొవాక్పై జరిగిన దాడిలో 85 సెర్బులను నిర్భందించింది. వీరిలో 35 మంది తరువాత విడుదలైనప్పటికీ మిగిలినవారి గురించిన వివరం మర్మంగా ఉంది. 1998 జూలై 22 న కె.ఎల్.ఎ. క్లుప్తంగా ఓబిలిక్ పట్టణానికి సమీపంలోని బెలాచివాక్ గనిని నియంత్రించి అదే రోజున తొమ్మిది మంది సెర్బ్ గని పనివారిని స్వాధీనం చేసుకున్నారు. రెడ్ క్రాస్ జాబితాలోని అంతర్జాతీయ కమిటీలో కనిపించనివారుగా ఉన్నారు కనుక వారు చంపబడ్డారని భావించారు.[107] 1998 ఆగస్టు 22 న సెర్బియన్ పౌరులు క్లెచ్కా గ్రామంలో హత్య చేయబడ్డారు. అక్కడ పోలీసులు మృతదేహాలను దహనం చేసేందుకు ఉపయోగించే ఒక బట్టీ, మానవ అవశేషాలను కనుగొన్నారు.[107][119] 1998 సెప్టెంబరులో సెర్బియా పోలీసులు కె.ఎల్.ఎ. ద్వారా స్వాధీనం చేసుకుని చంపబడ్డారని భావిస్తున్న 34 మృతదేహాలను సేకరించారు. వారిలో కొందరు అల్బేనియన్లు ఉన్నారు. గ్లోడోన్ (గ్లోగ్జోన్) సమీపంలోని లేక్ రాడాన్జిచ్ ప్రాంతాన్ని లేక్ రాడాన్జిక్ ఊచకోతగా పిలిచేవారు.[107]
Serbian children refugees, Cërnica, Gjilan
1999 యుద్ధ సమయంలోనూ, తర్వాత అల్బేనియాకు సరిహద్దులో ముగ్గురు సెర్బ్ పౌరులు బారెల్ పట్టణంలో "ఎల్లో హౌస్"లో చనిపోయారు. నల్లజాతీ మార్కెట్లో అమ్మకం కోసం అనేక మంది అవయవాలు తొలగించబడ్డాయి. ఈ వాదనలు మొదట ఐ.సి.టి.వై. వారి ఇంటిలోనూ, చుట్టూ ఉన్న వైద్య పరికరాలు, రక్తం జాడలు ఆధారంగా కనుగొన్నారు.[120] తర్వాత వారు ఐక్యరాజ్య సమితిచే దర్యాప్తు చేయబడ్డారు. అనేకమంది మాజీ యు.కె. యోధుల నుండి సాక్షుల నివేదికలను పొందిన వారు అనేకమంది ఖైదీల అవయవాలు తొలగించారని ప్రకటించారు.[121]ఐ.సి.టి.వై. కోసం ముఖ్య న్యాయవాది; కార్లా డెల్ పొంటె తన పుస్తకంలో ప్రజలకు ఈ నేరాలను వెల్లడించాడు; 2008 లో మాడమ్ ప్రాసిక్యూటర్ పెద్ద ప్రతిస్పందనను సృష్టించింది. 2011 లో; ఫ్రెంచ్ మీడియా అవుట్లెట్; 2003 లో వ్రాయబడిన ఒక వర్గీకరణ యు.ఎన్. డాక్యుమెంటును ఫ్రాన్స్ 24 విడుదల చేసింది. ఇది నేరాలను నమోదు చేసింది.
మాజీ యుగోస్లేవియా కోసం ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ఐ.సి.టి.వై) కొసావో యుద్ధంలో నేరాలకు పాల్పడింది. మిలెసేవిచ్తో సహా తొమ్మిది సీనియర్ యుగోస్లేవ్ అధికారులు 1999 జనవరి, జూన్ మధ్యలో మానవ హక్కుల ఉల్లంఘన, యుద్ధ నేరాలకు పాల్పడిన నేరాలకు సంబంధించి నేరారోపణలు ఎదుర్కొన్నారు. ముద్దాయిల్లో ఆరు మంది నిర్దోషులుగా నిర్ధారించబడ్డారు. ఒకరు విచారణ ప్రారంభించబడటానికి ముందు మరణించాడు. ఒక (మిలోసోవిక్) ముందు మరణించాడంతో అతని విచారణ ముగిసింది.[122] యుద్ధాన్ని అనుసరించి ఐ.సి.టివై. చే మానవహక్కుల ఉల్లఘన, యుద్ధ నేరాలకు వ్యతిరేకంగా నేరారోపణలతో ఆరుగురు కె.ఎల్.ఎ. సభ్యులు అభియోగాలు మోపబడ్డారు. కాని ఒక్కరు మాత్రమే దోషిగా నిర్ధారించారు.[123][124][125][126]
1999 జూన్ 10 న " యు.ఎన్. భద్రతా మండలి తీర్మానం 1244 " ఆమోదించబడింది. ఇది కొసొవోను యు.ఎన్. పరిపాలన (యు.ఎన్.ఎం.ఐ.కె.) నాటో నేతృత్వంలోని శాంతి పరిరక్షక దళానికి చెందిన కొసావో ఫోర్స్ (కె.ఎఫ్.ఒ.ఆర్) అధీనంలో ఉంచింది. తీర్మానం 1244 "యుగోస్లేవియా ఫెడరల్ రిపబ్లిక్ "లో కొసావో స్వయంప్రతిపత్తి కలిగి ఉందని తెలియజేస్తూ యుగోస్లేవియా ప్రాదేశిక సమగ్రతను ధ్రువీకరించింది. ఇది చట్టబద్ధంగా సెర్బియా రిపబ్లిక్ చేత అంగీకరించబడింది.[127]
1999 జూన్ లో కొసావోలో పర్యటన సందర్భంగా అల్బేనియన్ బాలల మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్
సెర్బియన్ సైనికులు కొసొవోను విడిచిపెట్టినప్పుడు సెర్బుల సంఖ్య 65,000[128] నుండి 250,000 విభిన్నమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు.[129] (194,000 సెర్బ్స్ 1991 లో జనాభా గణనలో కొసావోలో నివసిస్తున్నట్లు నమోదు చేయబడిన సెర్బుల సంఖ్య అంచనా వేయబడింది. కానీ మిగిలిపోయిన రోమాల సంఖ్య కూడా జతచేయబడి సెర్బుల సంఖ్య అధికరించి ఉండవచ్చు అని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో మిగిలి ఉన్న సెర్బులు అధికంగా ఉన్నారు. కానీ పట్టణ లేదా గ్రామీణ ప్రాంతాలలో నివసించిన సెర్బులు 2001 ప్రారంభంలో, 2004 మార్చిలో జరిగిన అల్లర్లలో ఎక్కువగా (కానీ పూర్తిగా లేవు) హింసకు గురయ్యారు.వేధింపుల నిరంతర భయాలు వారిని తిరిగి తీసుకురావడంలో వ్యాత్యాసాలు ఉండడానికి కారణంగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 1244 లో ప్రతిపాదించిన విధంగా కొస్సోవో తుది హోదాను నిర్ణయించేందుకు 2006 లో అంతర్జాతీయ చర్చలు ప్రారంభమయ్యాయి.యు.ఎన్. ప్రత్యేక మద్దతుదారు మార్టీ అహ్తసారి నేతృత్వంలోని ఐక్యరాజ్య సమితి చర్చలు 2006 ఫిబ్రవరిలో మొదలైంది. రెండూ సాంకేతిక అంశాలపై పార్టీల స్థితి ప్రశ్నార్థకంగా ఉందని వ్యతిరేకించాయి.[130]
2007 ఫిబ్రవరిలో అహిస్తారి బెల్జియాడ్లో, ప్రిస్టినాలో నాయకులకు ముసాయిదా స్థాయి పరిష్కార ప్రతిపాదనను పంపిణీ చేసింది. ఇది యు.ఎన్.భద్రతా మండలి ముసాయిదాకు ప్రాతిపదికగా 'పర్యవేక్షణా స్వాతంత్ర్యం'ను ప్రతిపాదించింది.యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, సెక్యూరిటీ కౌన్సిల్ ఇతర ఐరోపా సభ్యులు మద్దతు ఇచ్చిన ఒక ముసాయిదా తీర్మానం ఆందోళనలకు అనుగుణంగా నాలుగుసార్లు సమర్పించబడి తిరిగి రాసారు. ఆతీర్మానం దేశ సార్వభౌమత్వాన్ని సూత్రీకరించింది.[131] భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యుల్లో ఒకరైన వీటోను కలిగి ఉన్న రష్యా, బెల్గ్రేడ్, కొసావో అల్బేనియాలకు ఆమోదయోగ్యం కాని ఏ తీర్మానానికి మద్దతు ఇవ్వదని పేర్కొంది.[132] చాలామంది పరిశీలకులు చర్చల ఆరంభంలో ఊహించినంత స్వాతంత్ర్యంగా జరిగిందని సూచించగా మరికొందరు వేగవంతమైన స్పష్టత మంచిది కాదని సూచించారు.[133]
ఐక్యరాజ్యసమితిలో అనేక వారాల చర్చలు తరువాత యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం, సెక్యూరిటీ కౌన్సిల్ ఇతర యూరోపియన్ సభ్యులు 2007 జూలై 20 న అహ్తిసారి ప్రతిపాదనకు మద్దతు ఇచ్చిన ముసాయిదా తీర్మానాన్ని అధికారికంగా రష్యన్ మద్దతును పొందలేక విస్మరించారు. ఆగస్టులో ప్రారంభంలో (యూరోపియన్ యూనియన్ (వోల్ఫ్గాంగ్ ఇషింగర్), సంయుక్త రాష్ట్రాలు (ఫ్రాంక్ జి. విస్నెర్),రష్యా (అలెగ్జాండర్ బొత్సన్-ఖర్చేన్కో) బెల్గ్రేడ్, ప్రిస్టినా రెండింటికీ ఆమోదయోగ్యమైన స్థితి ఫలితాన్ని చేరుకోవడానికి సంధి ప్రయత్నం చేసారు. రష్యన్ తిరస్కారం ఉన్నప్పటికీ యు.ఎస్., యునైటెడ్ కింగ్డం, ఫ్రాన్స్లు కొసావొ స్వాతంత్ర్యాన్ని గుర్తించటానికి అవకాశం ఏర్పడింది.[134] కొసావర్ అల్బేనియన్ నాయకులచే స్వతంత్ర ప్రకటనను అధ్యక్ష ఎన్నికలు ( 2008 ఫిబ్రవరి 4) ముగింపు వరకు వాయిదా వేశారు. చాలామంది యు.ఎన్. సభ్యులు, అమెరికా అనాలోచితంగా చేసే ప్రకటన సెర్బియాలో అల్ట్రా - నేషనలిస్టు అభ్యర్థి " టొమిస్లావ్ నికోలిక్ " మద్దతును పెంచుతుందని భయపడింది.[135]
2001 నవంబరులో ఐరోపాలో భద్రత, సహకారం కోసం నిర్వహించిన సంస్థ. మొదటిసారి కొసావో శాసనసభ ఎన్నికలను పర్యవేక్షిస్తుంది.[136] ఆ ఎన్నికల తరువాత కొసావో రాజకీయ పార్టీలు అన్ని-పార్టీ ఐక్యత సంకీర్ణాన్ని ఏర్పరచుకొని ఇబ్రహీం రుగోవను అధ్యక్షుడిగానూ అలాగే బజ్రం రెక్స్హెపి (పిడికె) ప్రధానమంత్రిగా ఎన్నికచేసారు.[137] 2004 అక్టోబరులో కొసావో-విస్తృత ఎన్నికల తరువాత ఎల్.డి.కె, ఎ.ఎ.కె. నూతన పాలనా సంకీర్ణాన్ని ఏర్పరచాయి. అది పి.డి.కె, ఓరాలను చేర్చలేదు. ఈ సంకీర్ణ ఒప్పందం ఫలితంగా రాంష్ హరాదినాజ్ (ఎ.ఎ.కె.) ప్రధాన మంత్రి అయ్యాడు. ఇబ్రహీం రుగోవా అధ్యక్షుడిగా పదవి నిలబెట్టుకున్నాడు. పిడికె, ఓరా సంకీర్ణ ఒప్పందం విమర్శకు గురయ్యాయి. ప్రభుత్వానికి తరచూ అవినీతి ఆరోపణలు వచ్చాయి.[138]
పార్లమెంటరీ ఎన్నికలు 2007 నవంబరు 17 న జరిగాయి. ప్రారంభ ఫలితాల తరువాత 35 శాతం ఓట్లను సాధించిన హాషిం తసీ ఓడిపోయాడు. పి.డి.ఒ, కొసావో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది.తరువాత స్వాతంత్ర్యం ప్రకటించాలనే తన ఉద్దేశాన్ని పేర్కొన్నాడు. ప్రస్తుత అధ్యక్షుడు ఫరీర్ సెజిడి డెమొక్రటిక్ లీగ్లో తసీ ఒక సంకీర్ణాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది 22 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది.[139] ఎన్నికలో పాల్గొన్న వారి శాతం చాలా తక్కువగా ఉంది. మైనారిటీ సెర్బులలో చాలామంది ఓటు వేయడానికి నిరాకరించారు.[140]
TheNewborn monument unveiled at the celebration of the 2008 Kosovo declaration of independence proclaimed earlier that day, 17 February 2008,Pristina.
కొసావో 2008 ఫిబ్రవరి 17 న సెర్బియా నుండి స్వాతంత్ర్యం ప్రకటించింది.[141] దాని స్వతంత్రతను సెర్బియా మినహా దాని పొరుగుదేశాలు గుర్తించాయి.[142] స్వాతంత్ర్యాన్ని ప్రకటించినప్పటి నుండి ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు[143][144] వంటి అంతర్జాతీయ సంస్థలలో సభ్యదేశంగా మారింది.
కొసావో సెర్బ్ మైనారిటీ స్వాతంత్ర్య ప్రకటనను ఎక్కువగా వ్యతిరేకిస్తూ కొసావో సమాజం, మెటోహిజా సమాజం ఏర్పాటు చేసింది. ఈ శాసనసభ ఏర్పాటును కొసావో అధ్యక్షుడు ఫెమిర్ సెజిడి ఖండించారు. అయితే ఉన్మిక్ శాసనసభ తీవ్రమైన సమస్య కాదు ఎందుకంటే ఇది ఒక కీలక పాత్ర పోషించదు అన్నాడు.[145]
2008 అక్టోబరు 8 న సెర్బియా ప్రతిపాదనపై యు.ఎన్. జనరల్ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. కొసావో స్వతంత్ర ప్రకటన చట్టబద్ధతపై ఒక సలహా అభిప్రాయాన్ని అందించడానికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ను కోరింది. కొసావోను గుర్తించడానికి లేదా గుర్తించని రాజ్యాల నిర్ణయాలపై కట్టుబడి ఉండదని సలహా సంఘం అభిప్రాయపడింది 2010 జూలై 20 న కొసావో స్వతంత్ర ప్రకటన అంతర్జాతీయ చట్టాల సాధారణ సూత్రాల ఉల్లంఘన కాదని ఏకపక్ష ప్రకటనలను నిషేధించని ప్రత్యేకమైన యు.ఎన్.ఎస్.సి.ఆర్.పేర్కొన్నది. 1244 - స్వాతంత్ర్యం లేదా నిర్దిష్ట అంతర్జాతీయ చట్టం - ఇది చివరి స్థితి ప్రక్రియను నిర్వచించలేదు. సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ణయానికి ఫలితం వదిలివేసింది.[146]
ఈ రెండు ప్రభుత్వాల అంగీకారంతో 2013 ఏప్రిల్ 19 న బ్రస్సెల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. కొసావోలో సెర్బ్ మైనార్టీని తన స్వంత పోలీస్ ఫోర్స్కు, అప్పీల్స్ కోర్టుకు అనుమతించే ఇ.యు. మధ్యవర్తిత్వంతో ఒక ఒప్పందం కుదిరింది.[147] ఈ ఒప్పందం ఇంకా పార్లమెంటు ఆమోదించబడలేదు.[148]
ఒక భూపరివేష్టిత దేశం కొసావో దక్షిణ ఐరోపాలోని బాల్కన్ ద్వీపకల్పంలో కేంద్రీకృతమై ఉంది. దేశం మొత్తం వైశాల్యం 10,908 చదరపు కిలోమీటర్లు (4,212 చదరపు మైళ్ళు), ఐరోపాలో 10 వ అతి చిన్న దేశం. ఇది 42 °, 43 ° ఉ అక్షాంశం, 20 °, 22 ° రేఖాంశం మద్య ఉంటుంది. దేశం దక్షిణ, నైరుతి దిశగాఅల్బేనియా, ఆగ్నేయ దిశలోఉత్తర మేసిడోనియా రిపబ్లిక్, పశ్చిమానమాంటెనెగ్రో, ఉత్తరాన ఈశాన్య, తూర్పుసెర్బియాఉన్నాయి.[149]
దేశం ఉత్తర దిశలో 43 ° 14 '06 "ఉత్తర అక్షాంశం వద్ద బెలోబెరడా ఉంది. దక్షిణాన 41 ° 56' 40" ఉత్తర అక్షాంశం వద్ద రెస్టెలికా ఉంది; పశ్చిమ దిశగా 20 ° 3 '23 "తూర్పు రేఖాంశం వద్ద బోగె, తూర్పు రేఖాంశం 21 ° 44' 21" తూర్పు రేఖాంశం వద్ద డెసివోజ్కా ఉంది. సముద్ర మట్టానికి 2,656 మీటర్ల (8,714 అడుగులు) ఎత్తులో ఉన్న జిజెరావికా, అత్యల్పంగా 297 మీటర్లు (974 అడుగులు) ఉన్న వైట్ డ్రిన్ ఉంది.
షార్ మౌంటైన్స్ కొసావో భూభాగంలో పదోవంతుని కలిగి ఉంటుంది[150]
దేశం సరిహద్దులలో అధికభాగం పర్వత లేదా ఎత్తైన భూభాగం ఉంటుంది. అత్యంత గమనించదగిన భగోళిక భూభాగాలుగా బిజెస్కెట్ ఇ నెమన, షార్ మౌంటైన్స్ ఉన్నాయి. అల్బేనియన్ ఆల్ప్స్ లేదా ప్రోకలేజి అని కూడా పిలువబడే ది జెస్కెట్ ఎ నెమనా, దినారిక్ ఆల్ప్స్ భౌగోళిక కొనసాగింపుగా చెప్పవచ్చు. అల్బేనియా, మోంటెనెగ్రో సరిహద్దు పశ్చిమాన పక్కనే పర్వతశ్రేణి కొనసాగుతుంది. ఆగ్నేయ ప్రాంతంలో ప్రధానంగా షార్ మౌంటైన్స్ ఆధిపత్యం కలిగి ఉంది. ఇది మాసిడోనియా రిపబ్లిక్ సరిహద్దుగా ఏర్పడుతుంది. కొసావోస్ భూభాగంలో ప్రధానంగా తూర్పున కొసావో మైదానం, పశ్చిమాన ఉన్న మెటోహిజా మైదానంతో సహా రెండు ప్రధాన మైదానాలు ఉన్నాయి.
దేశం జలసంబంధ వనరులు చాలా చిన్నవి. దేశంలోని అతి పొడవైన నదులు వైట్ డ్రిన్, దక్షిణ మొరావా, ఐబార్ ఉన్నాయి. ఐబెర్ ఉపనది అయిన సిట్నికా, దేశం భూభాగంలో పూర్తిగా ప్రవహిస్తున్న అతి పెద్ద నదిగా ఉంది.
ఆగ్నేయ ఐరోపాలో వ్యూహాత్మకంగా ఉన్న కొసావో ఐరోపా, యురేషియా నుండి వృక్షజాతులు అందుకుంటుంది. దేశంలో అడవులు గణనీయంగా ఉన్నాయి.అరణ్యప్రాంతం కొసావో మొత్తం ఉపరితల వైశాల్యంలో కనీసం 39% ప్రాతినిధ్యం వహిస్తుంది. ఫైటోగ్యోగ్రాఫికల్గా దేశం బొరియల్ కింగ్డంలోని సిర్కోంగోరియల్ రీజియన్ లోని ఇల్ల్రియన్ ప్రావీంస్ను విస్తరింపజేసింది. అంతేకాకుండా బాల్క్రాటిక్ మిశ్రమ అడవులలో పాలెరిక్టిక్ టంపేర్ బ్రాడ్లీఫ్, మిశ్రమ అటవీ భూ ఉపరితలం లోపలకు ఇది వస్తుంది.[151] దేశం జీవవైవిధ్యంలో రెండు జాతీయ పార్కులు, 11 నేచురల్ రిజర్వులు, 103 రక్షిత ప్రాంతాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి.[152] దేశంలోని బీజెస్కెట్ ఇ నెమన నేషనల్ పార్క్, షర్ మౌంటైన్స్ నేషనల్ పార్క్ రెండింటిలో చాలా ముఖ్యమైన ప్రాంతాలుగా ఉన్నాయి.[153] ఈ వృక్షజాలం 1,800 కంటే ఎక్కువ జాతుల మొక్కలను కలిగి ఉంది. కాని వాస్తవ సంఖ్య 2,500 కంటే ఎక్కువ జాతుల మొక్కలు ఉంటుందని అంచనా.[154][155]
జీవవైవిధ్యం, హైడ్రోలజీ సంక్లిష్ట పరస్పర చర్యల ఫలితంగా వైవిధ్యభరితంగా వృక్షజాల పెరుగుదలకు అనేక రకాల నివాస పరిస్థితులు సహకరిస్తున్నాయి. అయినప్పటికీ కొసావో బాల్కన్ మొత్తం ఉపరితల వైశాల్యంలో కేవలం 2.3% మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కన్ ప్రాంతంలో వృక్షాల పరంగా బాల్కన్ వృక్ష జాతులలో 25%, యూరోపియన్ వృక్ష జాతుల్లో 18% ఉంటుంది.[154] కొసావోలో విస్తారమైన జంతువులు ఉన్నాయి.[153] పశ్చిమ, ఆగ్నేయ ప్రాంతాల్లో అనేక అరుదైన లేదా అంతరించిపోతున్న జాతులలో గోధుమ ఎలుగుబంట్లు, లింక్స్, అడవి పిల్లులు, తోడేళ్ళు, నక్కలు, అడవి మేకలు, రోబెక్స్, డీర్స్ వంటి గొప్ప జంతువులకు నివాసంగా ఉంది.[156] మొత్తం 255 జాతుల పక్షులు నమోదు చేయబడ్డాయి. వీటిలో బంగారు ఈగల్, తూర్పు సామ్రాజ్య ఈగల్, కొస్సోవో పర్వతాలలో ప్రధానంగా జీవిస్తున్న తక్కువ కెస్ట్రెల్ వంటి రప్టర్స్ ఉన్నాయి.
మధ్యధరా, ఆల్పైన్ ప్రభావాలతో కొసొవోలో అత్యధిక భాగం ఖండాంతర వాతావరణాన్ని అనుభవిస్తుంది.[157][158] ఆల్పైన్ వాతావరణం కనిపించే పశ్చిమ, ఆగ్నేయ ప్రాంతాల్లో దేశంలోని అత్యంత శీతల ప్రాంతాలు ఉన్నాయి. దేశంలోని వెచ్చని ప్రాంతాలు ప్రత్యేకించి అల్బేనియా సరిహద్దుకు సమీపంలో ఉన్న దక్షిణ ప్రాంతాలలో మధ్యధరా వాతావరణం కలిగి ఉంటాయి. నెలసరి ఉష్ణోగ్రత సగటు 0 °C (32 °F) (జనవరిలో) నుంచి, 40 °C (104 °F) (జూలైలో) మధ్య ఉంటుంది. వార్షిక వర్షపాతం సంవత్సరానికి 600 నుండి 1,300 మి.మీ (24 నుండి 51 అంగుళాలు) వరకు ఉంటుంది. సంవత్సరం పొడవునా పంపిణీ చేయబడుతుంది.పశ్చిమాన అడ్రియాటిక్ సముద్రం, దక్షిణప్రాంతంలో ఏజియన్ సముద్రం, ఉత్తరప్రాంతంలో ఐరోపా ఖండాంతర లాండ్మాస్ వంటివి దీనికి దగ్గరగా ఉంటాయి.
ఈశాన్య భాగంలో కొసావో ప్లెయిన్, ఇబర్ లోయలు సంవత్సరానికి సుమారు 600 మిల్లీమీటర్ల (24 అంగుళాలు) ఖండాంతర వాయువులు, చల్లని చలికాలాలు, చాలా వేడి వేసవికాలంతో ప్రభావితమవుతాయి. నైరుతి మెతోహిజా వాతావరణ ప్రాంతంలో మధ్యధరా ప్రభావితమైన వెచ్చని వేసవులు, కొంతవరకు ఎక్కువ వర్షపాతం (700 మి.మీ (28 అంగుళాలు)), శీతాకాలంలో భారీ హిమపాతాలు ఉన్నాయి. పశ్చిమాన బ్జేష్కెత్ ఇ నెమౌనా పర్వత ప్రాంతాలు దక్షిణాన షార్ పర్వతాలు, ఉత్తరాన కోపావోనిక్ వాతావరణంలోని ఆల్పైన్ వాతావరణం, అధిక వర్షపాతం (సంవత్సరానికి 900 నుండి 1,300 మిల్లీమీటర్లు (35 నుండి 51), తక్కువ, తాజా వేసవికాలాల, చల్లటి శీతాకాలాలు ఉంటాయి.[159] కొసావో సగటు వార్షిక ఉష్ణోగ్రత 9.5 ° సెం (49.1 ° ఫా), జూలైలో సగటు ఉష్ణోగ్రత 19.2 ° సెం (66.6 ° ఫా),, జనవరిలో -1.3 ° సెం (29.7) ° ఫా) ప్రిజరెన్, ఇష్టోక్ తప్ప, అన్ని ఇతర వాతావరణ స్టేషన్లు జనవరిలో సగటు ఉష్ణోగ్రతలు 0 ° సెం (32 ° ఫా) కింద నమోదయ్యాయి.[160]
Kosovo has the 5th largestlignite reserves in the world.
కొసావో ఆర్థిక వ్యవస్థ పరివర్తన ఆర్థిక వ్యవస్థగా గుర్తించబడుతుంది. ఇది రాజకీయ తిరుగుబాటు, యుగోస్లావ్ యుద్ధాలు, కొసావో ఉద్యోగులసెర్బియా రద్దు, సెర్బియాపై అంతర్జాతీయ ఆంక్షలు ఫలితంగా సంభవించింది. 2008 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఆర్థిక వ్యవస్థ ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందింది. విదేశీ సహాయం తగ్గిపోయినప్పటికీ జి.డి.పి పెరుగుదల ఏడాదికి 5% పైగా ఉంది. ఇది 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, తదుపరి యూరోజోన్ సంక్షోభం ఉన్నప్పటికీ సాధ్యం అయింది. అదనంగా ద్రవ్యోల్బణ రేటు తక్కువగా ఉంది. వాణిజ్య, రిటైల్, నిర్మాణ రంగాల్లో అత్యంత ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఉపాధివలస, ఎఫ్డిఐ, ఇతర మూలధన ప్రవాహాల నుండి వచ్చే సొమ్ముపై కొసావో ఎక్కువగా ఆధారపడింది.[161]అల్బేనియా,ఇటలీ,స్విట్జర్లాండ్,చైనా,జర్మనీ,టర్కీ కొసావో అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. దేశం అధికారిక ద్రవ్యంగా యూరో చలామణిలో ఉంది.[162]క్రొయేషియా, [[బోస్నియా| బోస్నియా, హెర్జెగోవినా,అల్బేనియా,ఉత్తర మేసిడోనియా రిపబ్లిక్లతో కొసావో ప్రభుత్వం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల సంతకం చేసింది.[163][164][165][166] కొసావో ఒక " సెంట్రల్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ " (సి.ఇ.ఎఫ్.టి.ఎ.) సభ్యదేశంగా ఉంది, UNMIK తో ఏకీభవించి ఐరోపా సమాఖ్య దేశాలలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని పొందింది.[167]
2009 లో పారిశ్రామిక రంగం జిడిపిలో 22.60% భాగస్వామ్యం వహిస్తూ 8,00.000 ఉద్యోగులకు సాధారణ ఉపాధి కల్పన కలిగిస్తూ ఉంది.స్తబ్దతకు వరుస వృత్తుల, రాజకీయ సంక్షోభం, 1999 లో కొసావోలో జరిగిన యుద్ధాలు కొన్ని కారణాలుగా ఉన్నాయి.[168] విద్యుత్తు రంగం అభివృద్ధికి అవకాశాలు అధికంగా ఉన్నాయని భావిస్తున్నారు.[169] కొసావో ప్రధానంగా జింక్, వెండి, నికెల్, కోబాల్ట్, రాగి, ఇనుము, బాక్సైట్ భారీనిల్వలను కలిగి ఉంది.[170] ఈ దేశం ప్రపంచంలో 5 వ అతిపెద్ద లిగ్నైట్ రిజర్వులతో ఐరోపాలో 3 వ స్థానంలో ఉంది.[171] మైన్స్, ఖనిజాల డైరెక్టరేట్, ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం కొసావోలో 13.5 బిలియన్ల విలువైన ఖనిజాలు ఉన్నాయి.[172]
పారిశ్రామిక రంగం చిన్న, మధ్యతరహా కుటుంబాలకు చెందిన యూనిట్ల మీద ఆధారపడి ఉంటుంది.[173] దేశంలో 53% వ్యవసాయ భూములు, 41% అటవీ, ఇతరులు 6% ఉన్నాయి.[174] సాగునీటి భూమి ఎక్కువగా మొక్కజొన్న, గోధుమ, పచ్చిక, పచ్చికభూములు, ద్రాక్ష తోటలకు ఉపయోగిస్తారు.అటవీ రంగంతో సహా వ్యవసాయ ఉత్పత్తులు దాదాపుగా జిడిపిలో 35% దోహదపడుతుంది.కొసావాలో చారిత్రాత్మకంగా వైన్ ఉత్పత్తి చేయబడింది.ప్రస్తుతం వైన్ పరిశ్రమ విజయవంతమైంది. కొసావో యుద్ధం తర్వాత అది మరింత పెరుగుతోంది. కొసావో వైన్ పరిశ్రమ ప్రధానంగా ఒరావోవాక్లో కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ మిలియన్ల కొద్దీ వైన్ల ఉత్పత్తి జరుగుతుంది. పినోట్ నోయిర్, మేర్లోట్, చార్డొన్నే ప్రధాన పంటలుగా ఉన్నాయి.జర్మనీ యునైటెడ్ స్టేట్స్కు కొసావో వైన్ ఎగుమతి చేయబడుతుంది.[175] వైన్యార్డ్ ప్రాంతం 9,000 హయా నుండి పెరిగింది. ఇది ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యంగా విభజించబడింది. ప్రధానంగా కొసావోలో వైన్ పరిశ్రమ "గ్లోరీ డేస్" సమయంలో ద్రాక్ష పంట దక్షిణ, పశ్చిమ ప్రాంతాలలో విస్తరించింది. "వైన్ కర్మాగారాలు"గా ఉండటం వలన నాలుగు ప్రభుత్వ-యాజమాన్యంలోని వైన్ ఉత్పత్తి భారీ "వైన్ తయారీ కేంద్రాలు"గా పరిగణించబడడం లేదు. మొత్తం భూభాగంలో వైన్ యార్డ్ సుమారు 36% భాగస్వామ్యం వహిస్తున్న రహొవెక్ మాత్రమే 50 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగివుంది. వైన్ ఉత్పత్తి ప్రధాన భాగం ఎగుమతుల కోసం ఉద్దేశించబడింది. 1989 లో దాని శిఖరాగ్రస్థాయిలో రాహొవేక్ నుండి ఎగుమతులు 40 మిలియన్ లీటర్లు ప్రధానంగా జర్మన్ మార్కెట్కు పంపిణీ చేయబడ్డాయి.[176]
Brezovica is one of the most visited winter tourist destinations in Kosovo.
కొసావో సహజ నాణ్యమైన పర్యాటక వనరులను సూచిస్తాయి. కొసావో నాణ్యమైన పర్యాటకం సామర్ధ్యం కలిగి ఉంది. బాల్కన్ ద్వీపకల్పం కొసావోలో భౌగోళికంగా పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా ఉన్న కారణంగా పర్యాటకం శక్తివంతంగా ఆర్థికాభివృద్ధికి సహకరిస్తుంది. ఇది ఆగ్నేయ ఐరోపాలోని బాల్కన్ పెనిన్సుల మధ్యలో ఉంది. ఇది చారిత్రాత్మకంగా సాంప్రదాయిక కాలానికి చెందిన ఒక కూడలిని సూచిస్తుంది. దేశం మధ్య,దక్షిణ ఐరోపా, అడ్రియాటిక్ సముద్రం, నల్ల సముద్రం మధ్య అనుసంధాన కూడలిగా ఉంది. ఆగ్నేయ కొసావో పర్వత పశ్చిమ ప్రాంతాలు శీతాకాలపర్యాటకానికి గొప్ప సామర్ధ్యం కలిగి ఉన్నాయి. షార్గ్ పర్వతాలలోని బ్రెజోవికా శీతాకాలపు రిసార్టులలో స్కీయింగ్ జరుగుతుంది.[177] కొసావో సాధారణంగా భౌగోళిక లక్షణాలలో పర్వతాలు, సరస్సులు, కెన్యాన్లు, నిటారుగా ఉండే రాక్ నిర్మాణాలు, నదులు ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి.[177] ప్రిస్టినా ఎయిర్పోర్ట్ (60 కి.మీ.), స్కోప్జే ఎయిర్పోర్ట్ (70 కి.మీ.) కి దగ్గరగా ఉన్న బ్రెజోవికా రిసార్ట్ అంతర్జాతీయ పర్యాటకులకు సాధ్యమైన గమ్యస్థానంగా ఉంది. బాల్కన్లో అత్యంత చలికాలం పర్యాటక గమ్యస్థానంగా మారడానికి అవకాశం ఉంది. ఇతర ప్రధాన ఆకర్షణలలో ప్రిస్టినా ఆధునిక రాజధాని ప్రిజ్రెన్ చారిత్రక నగరాలు, పెజా, గజకోవ ప్రాధాన్యత వహిస్తున్నాయి. అదనంగా కూడా ఫెరిజజ్, జిజ్లాన్ ఉన్నాయి.
2011 లో కొసావో 41 స్థలాల సందర్శించడం జరిగిందని న్యూయార్క్ టైంస్లో ప్రచురితం అయింది.[178][179]
ప్రస్తుతం కొసావోలో రెండు ప్రధాన మోటర్వేలు ఉన్నాయి. వీటిలో ఆర్ 7, కొసావోను అల్బేనియాతో అనుసంధానిస్తుంది. ప్రిన్సినాను హనీ ఐ ఎలిజిట్లో మాసిడో సరిహద్దుతో అనుసంధానిస్తుంది. కొత్త ఆర్ 7.1 మోటార్వే నిర్మాణం 2017 లో ప్రారంభమైంది.
ఆర్ 7 మోటార్వే (అల్బేనియా-కొసావో హైవే భాగం) కొరోవోను అల్బేనియా అడ్రియాటిక్ తీరానికి డర్సోతో కలుపుతుంది. ప్రెసిడ నుండి మెర్దార్ సెక్షన్ ప్రాజెక్ట్ నుండి మిగిలిన యూరోపియన్ రూట్ (ఇ 80) పూర్తయిన తర్వాత మోటార్వే ప్రస్తుత యూరోపియన్ రూట్ (ఇ 80) రహదారి ద్వారా పాస-యూరోపియన్ కారిడార్ ఎక్స్ (ఇ 75) తో సెర్బియాలో ఉన్న ఎన్.ఐ.ఎస్. సమీపంలో కొసావోను కలుపుతుంది. ఆర్ 6 మోటార్వే నిర్మాణంలో ఉంది. ఇ 65 లోని భాగంగా ఉంది. ఇది ఈ ప్రాంతంలో నిర్మించబడిన రెండవ రహదారి. ఇది స్కోప్జే నుండి 20 కి.మీ (12 మై) దూరంలో ఎలిజ్ హాన్ వద్ద ఉన్నఉత్తర మేసిడోనియా సరిహద్దుతో రాజధాని ప్రిస్టినాను కలుపుతుంది. మోటార్వే నిర్మాణం 2014 లో మొదలై 2018 లో పూర్తి అవుతుంది.
ఈ దేశం రెండు విమానాశ్రయాలలో జిజాకోవా విమానాశ్రయము ప్రిస్టినా ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉంది. కోజోవా యుద్ధం తరువాత కోజోవా ఫోర్స్ (కె.ఎఫ్.ఒ.ఆర్) కొరియావో యుద్ధం తరువాత జిజకోవా విమానాశ్రయము నిర్మించబడింది. ఇది వ్యవసాయ ప్రయోజనాల కొరకు వాడే ప్రస్తుత ఎయిర్ఫీల్డ్ ప్రక్కన ప్రాధానంగా సైనిక, మానవీయ విమానాలకు ఉపయోగించబడింది. స్థానిక, జాతీయ ప్రభుత్వ పౌర వాణిజ్య విమానాశ్రయంగా మారడానికి ఉద్దేశించిన ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో పనిచేయడానికి గజకోవా విమానాశ్రయాన్ని అందించాలని యోచిస్తోంది.[180] ప్రిస్టినా నైరుతిలో ప్రిస్టినా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇది కొసావో ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయంగా కొసావోకు విమాన ప్రయాణీకులకు మాత్రమే ప్రవేశం అనుమతించబడుతుంది.
ఒక ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పరిమితంగా అభివృద్ధి చెందింది.[181] 1990 లో జి.డి.పి. పరిస్థితి ఇంకా మరింత దిగజారింది. అయితే ప్రిస్టినా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ ఫ్యాకల్టీ స్థాపన ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన అభివృద్ధిని గుర్తించింది. వృత్తిపరమైన అభివృద్ధికి మెరుగైన పరిస్థితులను కల్పించే వివిధ ఆరోగ్య క్లినిక్లను ప్రారంభించడం ద్వారా కూడా ఇది జరిగింది.[181]
ఈ రోజుల్లో పరిస్థితి మారిపోయింది, కొసావోలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మూడు విభాగాలుగా విభజించబడింది: ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ఆరోగ్య సంరక్షణ.[182] ప్రిస్టినాలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో పదమూడు కుటుంబ వైద్య కేంద్రాలు ఉన్నాయి.[183] పదిహేను అంబులంటరీ కేర్ యూనిట్లుగా నిర్వహించబడుతున్నాయి.[183] సెకండరీ ఆరోగ్య సంరక్షణ ఏడు ప్రాంతీయ ఆసుపత్రులలో వికేంద్రీకరించబడింది. ప్రిస్టినా ఏ ప్రాంతీయ ఆస్పత్రిని కలిగి లేదు. బదులుగా వైద్య సంరక్షణ సేవల కొరకు యూనివర్సిటీ క్లినికల్ సెంటర్ ఆఫ్ కొసావోను ఉపయోగిస్తుంది. యూనివర్శిటీ క్లినికల్ సెంటర్ ఆఫ్ కొసావో పన్నెండు క్లినిక్లలో ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది.[184] ఇందులో 642 మంది వైద్యులు ఉన్నారు.[185] తక్కువ స్థాయి, గృహ సేవలు ఆరోగ్య రక్షణ ప్రాంగణంలో చేరలేని అనేక సమూహాలకు ఆరోగ్యసేవలు అందించబడతాయి.[186] కొసావో ఆరోగ్య సంరక్షణ సేవలు ఇప్పుడు రోగి భద్రత, నాణ్యత నియంత్రణ, ఆరోగ్యం సహాయం మీద దృష్టి కేంద్రీకరించాయి.[187]
ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిల విద్య ప్రధానంగా ప్రభుత్వవిద్యా మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. విద్య రెండు ప్రధాన దశలలో జరుగుతుంది: ప్రాథమిక, ఉన్నత విద్య.
ప్రాథమిక, ఉన్నత విద్య నాలుగు దశలుగా ఉపవిభజన చేయబడింది: ప్రీస్కూల్ విద్య, ప్రాథమిక, దిగువ ఉన్నత విద్య, ఉన్నత మాధ్యమిక విద్య, ప్రత్యేక విద్య. ప్రీస్కూల్ విద్య ఒకటి నుండి ఐదు సంవత్సరాల పిల్లలకు ఉంటుంది. ప్రాథమిక, మాధ్యమిక విద్య అందరికీ తప్పనిసరిగా ఉంటుంది. ఇది జిమ్నాసియం, వృత్తి పాఠశాలలు దేశంలో గుర్తించబడిన మైనారిటీల భాషలలో అందుబాటులో ఉంది. ఇక్కడ తరగతులు అల్బేనియన్, సెర్బియా, బోస్నియన్, టర్కిష్, క్రొయేషియన్లలో నిర్వహించబడతాయి. మొదటి దశ (ప్రాథమిక విద్య) తరగతులు ఒకటి నుండి ఐదు వరకు ఉంటుంది, రెండవ దశ (తక్కువ సెకండరీ విద్య) ఆరు నుంచి తొమ్మిది తరగతులు. మూడవ దశ (ఉన్నత సెకండరీ విద్య) సాధారణ విద్యను కలిగి ఉంటుంది. కానీ వృత్తిపరమైన విద్యను కలిగి ఉంది. ఇది విభిన్న రంగాల్లో దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇది నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అయినప్పటికీ ఉన్నత లేదా విశ్వవిద్యాలయ అధ్యయనాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలను విద్యార్థులకు అందిస్తారు. విద్య మంత్రిత్వశాఖ ప్రకారం, సాధారణ విద్య పొందలేని పిల్లలు ప్రత్యేక విద్య (ఐదవ దశ) పొందగలుగుతున్నారు.[188]
విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత-విద్యా సంస్థలలో ఉన్నత విద్యను పొందవచ్చు. ఈ విద్యా సంస్థలు బ్యాచిలర్, మాస్టర్ పి.హెచ్.డి. డిగ్రీలకు సంబంధించిన అధ్యయనాలను అందిస్తున్నాయి. విద్యార్థులు పూర్తి సమయం లేదా పార్ట్ టైమ్ అధ్యయనాలను ఎంచుకోవచ్చు.
కొసావో గణాంక కార్యాలయం ఆధారంగా దేశం జనాభా 1.9 - 2.2 మిలియన్ మధ్య ఉంటుందని అంచనా వేయబడింది. వీరిలో 92% అల్బేనియన్ ప్రజలు, 4% సెర్బు ప్రజలు, 2% బోస్లియక్ ప్రజలు, గోరని ప్రజలు, 1% టర్కిష్ ప్రజలు, రోమానీ ప్రజలు ఉన్నారు.[189][190][191] సి.ఐ.ఎ. అంచనాల ఆధారంగా 88% అల్బేనియన్లు, 8% కొసావో సెర్బులు, 4% ఇతర జాతి సమూహాలు ఉన్నారు.[149] సి.ఐ.ఎ. ఆధారంగా ప్రపంచ ఫాక్ట్ బుక్ 2009 జూలై డేటా అంచనా ఆధారంగా కొసావో జనాభా 18,04,838 మంది. బోస్కిక్స్, గోరనీ, రోమా, తుర్క్లు, అష్కాలిస్, ఈజిప్షియన్లు, జానేజీవి క్రోయేషియన్లతో సహా 88% అల్బేనియన్లు, 7% సెర్బులు, 5% ఇతర జాతి సమూహాలు ఉన్నాయని పేర్కొంది.[149]
19 వ శతాబ్దం నుంచి కొసావోలో అల్బేనియన్లు క్రమంగా సంఖ్యాపరంగా అధికరిస్తూ మెజారిటీని కలిగి ఉన్నారు. మునుపటి జాతి గణాంకాలు వివాదాస్పదంగా ఉన్నాయి. కొసావో రాజకీయ సరిహద్దులు జాతి సరిహద్దుతో సమానంగా ఉండవు.కొసావోలో అల్బేనియన్లు ఒక సంపూర్ణ మెజారిటీని రూపొందించారు; ఉదాహరణకుసెర్బియా ఉత్తర కొసావో, ఇతర మునిసిపాలిటీ ఒక స్థానిక మెజారిటీని కలిగిఉండగా కొసావోకు వెలుపల అల్బేనియన్ మెజారిటీ ఉన్న పెద్ద ప్రాంతాలు ఉన్నాయి. వారు మాజీ యుగోస్లేవియా పొరుగు ప్రాంతాలలో:ఉత్తర మేసిడోనియా వాయవ్య, ప్రేస్సే వ్యాలీ దక్షిణ సెర్బియాలో ఉన్నారు.
2008 గణాంకాల ఆధారంగా సంవత్సరానికి 1.3% వద్ద కొసావోలోని జాతిపరమైన అల్బేనియన్లు ఐరోపా జనాభాలో వేగంగా వృద్ధి రేటును కలిగి ఉన్నారు.[192] 82 సంవత్సరాల కాలంలో (1921-2003) కొసావో జనాభా అసలు పరిమాణం 460%కు పెరిగింది. 1931 నాటికి 5,00,000 మంది ఉన్న కొసావో జనాభాలో 60% అల్బేనియన్లు ఉన్నారు. 1991 నాటికి వారు కొసావో 2 మిలియన్ల జనాభాలో 81% చేరుకున్నారు.[193] 20 వ శతాబ్దం రెండో అర్ధ భాగంలో కొసావో అల్బేనియన్లు సెర్బుల కంటే మూడు రెట్లు ఎక్కువ జనన రేటును కలిగి ఉన్నారు.[194] అంతేకాకుండా 1999 లో పూర్వం కొసావోలో అత్యధిక సంఖ్యలో ఉన్న సెర్బు జనాభా 1999 లో జాతి ప్రక్షాళన ప్రచారం తరువాత సెర్బియాకు చేరుకుంది.[111]
రాజ్యాంగం ఆధారంగా అల్బేనియన్, సెర్బియన్ భాషలు కొసావో అధికారిక భాషలుగా ఉన్నాయి. దాదాపు 95% ప్రజలకు వాడుకగా ఉన్న అల్బేనియన్ వారి స్థానిక భాషగా ఉంది. తర్వాత స్థానంలో దక్షిణ స్లావిక్ భాషలు, టర్కిష్లు ఉన్నాయి. ఉత్తర కొసావో జనాభా గణనను బహిష్కరించడంతో అల్బేనియన్ తరువాత బోస్నియన్ రెండవ అతిపెద్ద భాషగా మారింది. అయితే సెర్బియా వాస్తవానికి కొసావోలో రెండవ వాడుకభాషగా ఉంది. 1999 నుండి అల్బేనియన్ భాష దేశంలో ప్రధాన భాషగా మారింది. అయినప్పటికీ సైబీరియాకు సమాన హోదాను ఇవ్వబడింది. ఇతర మైనారిటీ భాషలకు ప్రత్యేక హోదా ఇవ్వబడుతుంది.[195] 2006 లో అల్పసంఖ్యాక, సెర్బియన్ల అధికారిక భాషలలా సమాన వినియోగం చేయాలని కొసావో పార్లమెంటు చట్టం నెరవేర్చింది.[196] అంతేకాకుండా మున్సిపాలిటీలో 5% ప్రజలకు వాడుకలో ఉన్న భాషలు మునిసిపల్ స్థాయిలో అధికారిక భాషల గుర్తింపు పొందవచ్చు.[196] టర్కిష్ భాషలో నివసిస్తున్న పరిమాణాలను పరిగణలోకి తీసుకొని "లా ఆన్ ది యూజ్ ఆఫ్ లాంగ్వేజెస్ " అధికారహోదాను ఇస్తుంది.[196] అల్బేనియన్, సెర్బియన్ రెండూ అధికార భాషలుగా ఉన్నప్పటికీ పురపాలక సేవకులలో ఒకరు ప్రొఫెషనల్ నేపథ్యంలో మాట్లాడవలసిన అవసరం ఉంది. 2015 నాటికి భాషా కమిషనర్ ఆఫ్ కొసావో స్లావిస్సా మ్లెడొనోవిక్ ప్రకటన ప్రకారం రెండు సంస్థలు తమ పత్రాలను కలిగి ఉండవు.[197]
కొసావో అధికారిక మతం లేని ఒక లౌకిక రాజ్యం. రాజ్యాంగం మత స్వేచ్ఛ అందిస్తుంది.[198][199] 2011 జనాభా లెక్కల ప్రకారం కొసావో జనాభాలో 95.6% ముస్లింలు ఉన్నారు.వీరిలో సుఫీసం లేదా బీక్తషిజం వంటి విభాగాలు ఉన్నాయి. ఇవి కొన్నిసార్లు సాధారణంగా ఇస్లాం వర్గాలుగా వర్గీకరించబడ్డాయి.[200] జనాభాలో 3.69% కాథలిక్, సమాన సంఖ్య లేదా 5% వరకు ఆర్థోడాక్స్ (ఎక్కువగా ఆర్థోడాక్స్ సెర్బియా మైనారిటీ జనాభా గణనను బహిష్కరించారు) ఉన్నారు. కాథలిక్ అల్బేనియా కమ్యూనిటీలు ఎక్కువగా జిజకోవా, ప్రిరిన్, క్లిన, పెచ్, వితినా సమీపంలోని కొన్ని గ్రామాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. సెర్బు మైనారిటీ ఎక్కువగా సెర్బియా ఆర్థోడాక్స్గా ఉన్నారు.
దేశంలో క్రైస్తవ మతానికి సుదీర్ఘ సంప్రదాయంగా ఉంది.ఇది తూర్పు రోమన్ కాలం నుండి కొనసాగుతుంది. మధ్య యుగాలలో రోమన్లు బైజాంటైన్లు రెండింటి ద్వారా మొత్తం బాల్కన్ ద్వీపకల్పం క్రైస్తవమతీకరణ చేయబడింది. 1389 - 1912 వరకు కొసావో అధికారికంగా ఒట్టోమన్ సామ్రాజ్యంచే నిర్వహించబడి అధిక స్థాయి ఇస్లామీకరణ జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్యవాద ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగోస్లేవియాలో లౌకిక సామ్యవాద అధికారులు ఈ దేశాన్ని పాలించారు. ఆ కాలంలో కొసావో జనాభాలో మతాతీతం అధికరించింది. ప్రస్తుతం జనాభాలో 90% పైగా ముస్లిం నేపథ్యాల నుండి వచ్చినవారు ఉన్నారు. వీరిలో చాలామంది జాతి అల్బేనియాలు[201] స్లావులు (వీరిని ఎక్కువగా గోరనీ లేదా బోస్నియాక్స్గా గుర్తించే వారు), టర్కిష్ ప్రజలు కూడా ఉన్నారు.
ఐ.హెచ్.ఇ.యు. స్వేచ్ఛా నివేదికల (2014) ఆధారంగా దేశం దక్షిణాది ఐరోపాలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని తొమ్మిదవ స్థానంలో ఉంది. మతం, నాస్తికత్వంపై సహనం సమానంగా ఉంది.[202]
The cultural traditions of Kosovo has been influenced primarily by theAlbanian andSerbian origins of its majority population. Located geographically at the crossroads ofRomance,Albanian,Slavic andOttoman cultures, it has enriched its own culture adopting and maintaining some of the traditions of its neighbours and of other influence sources.
పురాణ పాటలు (అల్టిమేట్ సాంగ్స్ ఆఫ్ ది ఫ్రాంటియర్ వారియర్స్) పాడటం కోసం లాహూటా ఘెగ్ అల్బేనియన్లను ఉపయోగించారు
కొసావోలో సంగీతం భిన్నంగా ఉన్నప్పటికీ ప్రామాణికమైన అల్బేనియన్, సెర్బియన్ సంగీతం ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. అల్బేనియన్ సంగీతం సిఫ్టెలి ఉపయోగిస్తుంది. సాంప్రదాయిక సంగీతం కొసావోలో ప్రసిద్ధి చెందింది, పలు సంగీత పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో బోధించబడుతోంది. 2014 లో కొసావో ఇసా క్లోజా దర్శకత్వం వహించిన హాంగింగ్ చలనచిత్రం " అకాడెమి అవార్డు ఫర్ బెస్టు ఫారిన్ లాంగ్వేజ్ " కొరకు సమర్పించబడింది.[203]
గతంలో కొసావో ఉత్తర అల్బేనియాలోని ఇతిహాస కవిత్వం లాహూట వాద్యసంగీతంతో. చేచి పాడబడింది. తరువాత మరింత మన్నికైన సిఫ్టెలియా వాయిద్యం ఉపయోగించబడింది. ఇది రెండు తీగలను కలిగి ఉంది-శ్రావ్యత కోసం ఒకటి, డ్రోన్ ఒకటి. కోసోవన్ సంగీతం టర్కిష్ సంగీతాన్ని ప్రభావితం చేస్తుంది. 500 సంవత్సారాల కాలం ఓట్టమన్ సామ్రాజ్య ఆధిపత్యం కొనసాగినప్పటికీ కొసొవో జానపద సాహిత్యం వాస్తవికతను, శ్రేష్ఠతను సంరక్షింది.[204] పురావస్తు పరిశోధనలు ఈ సాంప్రదాయం పురాతనత్వం బాల్కన్లోని సాంప్రదాయ సంగీతానికి సమాంతరంగా ఇది ఎలా అభివృద్ధి చెందిందో తెలియజేస్తుంది. క్రీ.పూ. 5 వ శతాబ్దం నుండి రాళ్ళమీద చెక్కబడిన వాయిద్యాలతో ఉన్న గాయకుల చిత్రాలు చాలా ఉన్నాయి. ("పానీ" చిత్రపటం, ఇందులో వేణువుకు సమానంగా ఒక పరికరం ఉంది)[205]
అంతర్జాతీయ గుర్తింపును సాధించిన సమకాలీన సంగీత కళాకారులు రిటా ఓరా, దువా లిపా, ఎరా ఇష్ట్రేఫి అల్బేనియన్ పూర్వీకత కలిగి ఉన్నారు.[206] ప్రెజెనుకు చెందిన గిటారు వాద్యకారుడు పెట్రైట్ కియు అనేక అంతర్జాతీయ బహుమతుల విజేతగా సంగీత విద్వాంసుడుగా విస్తృతంగా గుర్తింపుపొందాడు.[207]
కొసావో అందించిన సెర్బియన్ సంగీతం దాని వైవిధ్య ధ్వనితో పలు పాశ్చాత్య, టర్కిష్ ప్రభావాలతో బాల్కన్ సంప్రదాయంలో భాగంగా ఉంది.[208] కొసొవో అందించిన సెర్బ్ పాటల స్వరకర్త స్టీవన్ మొక్రాంజాక్ 12 వ పాట ప్రేరణగా ఉందని విశ్వసిస్తున్నారు. కొసొవో అందించిన సెర్బియన్ సంగీతాన్ని చర్చి సంగీతం ఇతిహాస కవిత్వంతో ఆధిపత్యం చేసింది.[208] సెర్బియా జాతీయ వాయిద్యం గుస్లేను కొసావోలో కూడా ఉపయోగిస్తారు.[209]
1982 లో అస్కాలో యూరోవిజన్ పాటలపోటీలో కళాకారుడు విక్టోరియా యుగోస్లేవియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2012 యూరోవిజన్ పాటలపోటీలో సింగర్ రోనా నిశ్లీయు 5 వ స్థానంలో నిలిచాడు. లిన్డిటా 2017 లో అల్బేనియాకు ప్రాతినిధ్యం వహించాడు. కొసావో నుండి అనేక సెర్బియన్ గాయకులు యూరోవిజన్ పాటలపోటీలో చేయడానికి సెర్బియా ఎంపిక చేసింది. జూనియర్ యూరోవిజన్ పాటలపోటీలో నెవెవా బోజోవిక్ సెర్బియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన యూరోవిజన్ పాటలపోటీలో " మొజే 3 " సభ్యుడిగా ఉన్నారు.
కొసావో నిర్మాణకళ నియోలితిక్, కాంస్య, మధ్య యుగాల నాటిది. వివిధ నాగరికతలు, మతాల ఉనికితో ప్రభావితమైన నిర్మాణాలు ఈనాటికీ మనుగడలో ఉన్నాయి.
13 వ, 14 వ శతాబ్దాల్లోని సెర్బియన్ సాంప్రదాయ వారసత్వం కలిగిన అనేక మొనాస్టీలు, చర్చిలకి కొసావో స్థావరంగా ఉంది. 15, 16, 17 వ శతాబ్దాల నుండి ఒట్టోమన్ కాలం నాటి నిర్మాణకళా వారసత్వం కలిగిన మసీదులు, హమాంములు ఉన్నాయి. 18 వ, 19 వ శతాబ్దాల కాలానికి చెందిన అనేక వంతెనలు, పట్టణ కేంద్రాలు, కోటలతో కట్టడాలు ఆసక్తిని రేకెత్తించే ఇతర చారిత్రాత్మక నిర్మాణాలు ఉన్నాయి. ప్రాంతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ప్రైవేటు యాజమాన్యానికి చెందిన భవనాలు ముఖ్యమైనవిగా పరిగణించబడకపోయినా అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. 1999 యుద్ధంలో కొసావోలో ఈ వారసత్వాన్ని సూచించే అనేక భవనాలు నాశనమయ్యాయి లేదా దెబ్బతిన్నాయి.[210][211] డుకాగ్జిని ప్రాంతంలో కనీసం 500 కుల్లాలు మీద దాడి చేయబడి వాటిలో అనేకం ధ్వంసం కావడం లేదా దెబ్బతిన్నాయి.[17]
2004 లో యునెస్కో విశోకి దేకాని మఠాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. రెండు సంవత్సరాల తరువాత యునెస్కో వారసత్వ జాబితా కొరకు మూడు వేర్వేరు స్మారక కట్టడాలు ప్రతిపాదించబడ్డాయి: పెచ్ యొక్క ప్యాట్రిచ్చాట్, లేజెవిస్ అవర్ లేడీ, గ్రాకానికా మొనాస్టరీ కొసావోలో మధ్యయుగ స్మారక చిహ్నాల జాబితాలో ఉన్నాయి.[212] కొసావోలో తూర్పు సంప్రదాయ బైజాంటైన్, పశ్చిమ రోమనెస్క్ ఎక్లెసియాస్టికల్ ఆర్కిటెక్చర్ కలయికకు ప్రాతినిధ్యం వహించే నాలుగు సెర్బియా ఆర్థోడాక్స్ చర్చిలు, మఠాలు ఉన్నాయి. ఈ నిర్మాణాన్ని మధ్య యుగంలో సెర్బియాకు చెందిన ప్రధాన రాజవంశమైన నెమ్యాంజిక్ రాజవంశం సభ్యులు స్థాపించారు.
2004 జాతి హింస సమయంలో ఈ స్మారకాలు దాడికి గురయ్యాయి. ముఖ్యంగా . 2006 లో ఆ ప్రాంతం రాజకీయ అస్థిరత్వం కారణంగా ఉత్పన్నమైన నిర్వహణ, పరిరక్షణలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా ఈ ఆస్తులు వరల్డ్ హెరిటేజ్ జాబితాలో పొందుపరచబడింది.[213]
కొసొవన్ కళలు చాలాకాలంగా అంతర్జాతీయ ప్రజలకు తెలియలేదు ఎందుకంటే ఇక్కడ కొనసాగిన పాలనలో అనేక మంది కళాకారులు తమ కళలను కళా ప్రదర్శనశాలలో ప్రదర్శించలేకపోయారు. అంతేకాకుండా కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలను వారే స్వయంగా చేపట్టారు. కొసావో యుద్ధం సమయంలో అనేక మంది స్టూడియోలను కాల్చివేశారు. అనేక కళాఖండాలు నాశనం చేయబడ్డాయి లేదా కోల్పోయాయి. 1990 వరకు కొసొవో కళాకారులు తమ కళను ప్రతిష్ఠాత్మక కళాఖండాలను ప్రపంచ ప్రఖ్యాత కేంద్రాలకు అందించారు. వారు సృష్టించిన పరిస్థితులలో కళలు వారి ప్రత్యేకమైన పద్ధతుల కారణంగా వారు విశ్లేషించబడ్డారు. ఆ కళాఖండాలు ప్రత్యేకమైనవిగానూ అసలైనవిగా భావించబడ్డాయి.[214][215]
1979 ఫిబ్రవరిన కొసావా నేషనల్ ఆర్ట్ గ్యాలరీ స్థాపించబడింది. ఇది కొసావోలో విజువల్ ఆర్ట్సు సంస్థగా మారింది. దీనికి కొసావో అత్యంత ప్రముఖ కళాకారుడైన ముస్లిం ముల్లిఖి పేరు పెట్టబడింది. అల్బేనియన్ చిత్రకారులైన ఎంజెల్ బెరిషా, మసార్ కాకా, తహిర్ ఎమ్రా, అబ్దుల్లా గెర్గురి, హిస్ని క్రాస్నిఖీ, నిమోన్ లోకాజ్, అజీజ్ నిమాని, రమాదాన్ రమదాని, ఎస్సేట్ వల్లా, లెండే జెకిరాజ్ కొసావోలో జన్మించారు.
కొసావోలోని వంటకాలు పరిసర ప్రాంతాల (అల్బేనియా, మోంటెనెగ్రో, గ్రీస్) వంటశాలకు సారూప్యంగా ఉన్నాయి. కొసావో వంటకాలు టర్కిష్ వంటకాలు, అల్బేనియన్ వంటకాల చేత గణనీయంగా ప్రభావితం చెందాయి. సాధారణ ఆహారాలాలో బ్యూరెక్, పైస్, ఫ్లీజా, కెబాబ్, సుక్సుహక్, ఇతర సాసేజ్లు, మిరియాలు, గొర్రె, బీన్స్, శర్మ, బజన్, పిటా, అన్నం భాగంగా ఉన్నాయి.[216] కోసావో అల్బేనియన్ వంటలలో బ్రెడ్, పాల ఉత్పత్తులు ముఖ్యమైనవి.
ఎక్కువగా ఉపయోగించే పాల ఉత్పత్తులలో పాలు, పెరుగు, అయ్యన్, స్ప్రెడ్స్, చీజ్, కయాక్ ఉన్నాయి. మాంసం (గొడ్డు మాంసం, కోడి, గొర్రె), బీన్స్, బియ్యం, మిరియాలు కొసావో అల్బేనియన్ ఆహారంలో ప్రధాన భాగాలుగా ఉంటాయి. కూరగాయలను కాలానుగుణమైనవి ఉపయోగిస్తారు. సాధారణంగా దోసకాయలు, టమోటాలు, క్యాబేజీ ఊరగాయలు ఉంటాయి. ఉప్పు, నల్ల మిరియాలు, ఎర్ర మిరియాలు, వెజెటా వంటి మూలికలు కూడా ప్రజాదరణ పొందాయి.[217]సాంప్రదాయ కొసావన్ డెజర్టర్లను తరచుగా షెర్బెతుతో తయారు చేస్తారు. ఇది నిమ్మ లేదా వనిల్లా రుచిని చేర్చి చక్కెరతో వండుతారు. బస్లావ అనేది కొసావోలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే రొట్టెలలో ఒకటి. మరొకటి కాజ్మాసిన్ ఇది కాల్చిన గుడ్లు, చక్కెర, నూనె కలిపి తయారు చేస్తారు. షెకెర్ పెరే బక్లావాలా ఉండే ఒక పాస్ట్రీ. దీనిని షెర్బెతుతో అలకరిస్తారు.
కాకామాక్, తెస్సిషీట్, రోవని, తుల్లామా, పల్లాకిన్కా వంటి ఇతర రొట్టెలు కూడా కొసావోలో బాగా ప్రాచుర్యం పొందిన అల్పాహారాలుగా ఉన్నాయి. అవి సాధారణంగా నుటేల్ల, జున్ను లేదా తేనెతో అలంకరించబడతాయి. షాంపిటు లేదా లాలోమామా పిల్లల కోసం ఒక ట్రీటుగా ఉపయోగపడుతుంది. అధికంగా బజ్రామ్ రోజులలో అతిథులకు మొట్టమొదటి ట్రీటుగా అందించబడుతుంది.[218]
Dokufest inPrizren. "Kosovo is known more for conflict than culture, but at a film festival in the country's prettiest town, partying and arts mix to great effect." –The Guardian[219]Bekim Fehmiu was the first Eastern European actor to star inHollywood during the Cold War.
కొసావోలో చిత్ర పరిశ్రమ 1970 లో మొదలైంది. 1969 లో కొసావో పార్లమెంట్ కొసావోఫిల్మును స్థాపించింది. ఇది ఉత్పత్తి, పంపిణీ, చిత్రాల ప్రదర్శన బాధ్యతలను నిర్వహిస్తుంది. దీని ప్రారంభ దర్శకుడు నటుడు అబ్దుర్రహ్మాన్ షాలా. తరువాత చిత్రానికి రచయిత కవి అజెం షెక్రెలీ దర్శకత్వం వహించాడు. ఆయన దర్శకత్వంలో అత్యంత విజయవంతమైన చిత్రాలు నిర్మించబడ్డాయి. కొసావో చిత్రాల తరువాతి దర్శకులుగా క్సెవర్ క్వొరాజ్, ఎక్రెం క్రియెజియు, గని మెహ్మెటాజ్ మొదలైన ఉన్నారు. పదిహేడు చలనచిత్రాలు, అనేక చిన్న సినిమాలు, డాక్యుమెంటరీలను ఉత్పత్తి చేసిన తరువాత 1990 లో ఈ సంస్థను సెర్బియా అధికారులు స్వాధీనం చేసుకున్న తరువాత అది రద్దు చేయబడింది. 1999 జూన్ లో యుగోస్లావ్ ఉపసంహరణ తర్వాత కోసోవాఫిల్మ్ పునఃస్థాపించబడింది. తరువాత కొసావోలో చిత్ర పరిశ్రమను పునరుద్ధరించడానికి కృషి చేశారు.
కొసావోలో అతిపెద్ద చిత్రోత్సవంగా " ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ " నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవం ఆగస్టులో ప్రిజ్రెన్లో నిర్వహించబడుతుంది. ఇది అనేక అంతర్జాతీయ, ప్రాంతీయ కళాకారులను ఆకర్షిస్తుంది. ఈ వార్షికంగా నిర్వహించిన ఉత్సవ చిత్రాలలో మూడు ఓపెన్ ఎయిర్ సినిమాలలో రోజులు రెండు చిత్రాలు, అలాగే రెండు రెగ్యులర్ సినిమాల్లో రోజుకి రెండుసార్లు ప్రదర్శించబడతాయి. చిత్రప్రదర్శన మినహాయించి ఉత్సవం తర్వాత సాయంత్రం ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఉత్సవం పరిధిలో వివిధ సంఘటనలు జరుగుతాయి: వర్క్షాపులు, డోకోఫోటో ప్రదర్శనలు, ఉత్సవ శిబిరాలు, కచేరీల నిర్వహణతో నగరాన్ని పూర్తిగా మనోహరమైన ప్రదేశంగా మారుస్తుంది. 2010 లో డోకోఫెస్ట్ 25 ఉత్తమ అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఉత్సవాల్లో ఒకటిగా ఎన్నుకోబడింది. 2010 లో డోకోఫెస్ట్ 25 ఉత్తమ అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఉత్సవాల్లో ఒకటిగా ఎంపికైంది.[220]
అల్బేరియన్ పూర్వీకత కలిగిన కొసావో నటులు ఆర్టా దోబ్రోషి, జేమ్స్ బెబీ, ఫరూక్ బెగోలీ, బెకిమ్ ఫెహ్మియు అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ప్రిస్టినా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కొసావో లోని ప్రిస్టినాలో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నాయి. ఇది బాల్కన్ ప్రాంతంలో ప్రముఖ అంతర్జాతీయ చలనచిత్రాలను ప్రదర్శిస్తుంది కోసావర్ చిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తుంది.
88 వ అకాడెమి పురస్కారాలలో అత్యుత్తమ " లైవ్ యాక్షన్ షార్ట్ హిల్ ఫర్ అకాడమీ " అవార్డుకు షొక్ చలన ప్రతిపాదించబడింది.[221] కోసావో యుద్ధ సమయంలో సంభవించిన నిజమైన సంఘటనల ఆధారంగా చిత్రీకరించబడిన ఈ చిత్రం ఆస్కార్ నామినేట్ చేయబడింది. ఈ చిత్రానికి దర్శకుడు జామి డోనౌగ్ దర్శకత్వం వహించాడు. షొక్ చిత్రానికి ఓట్ మాట్ సంస్థ పంపిణీ చేసింది. సోషల్ మీడియా ప్రచారం జట్టుకు అల్బేనియన్లు నాయకత్వం వనించారు.
కొసావో మాధ్యమంలో రేడియో, దూరదర్శన్, వార్తాపత్రికలు, అంతర్జాలం, వెబ్సైట్ వంటి వివిధ మాధ్యమాలు ఉన్నాయి. మాధ్యం అధికంగా ప్రకటనలు, చందాల ద్వారా లభించే నిధులతో నిర్వహించబడుతుంది. ఐ.ఆర్.ఇ.ఎక్స్. ఆధారంగా దేశంలో 92 రేడియో స్టేషన్లు, 22 దూరదర్శన్ కేంద్రాలు ఉన్నాయని అంచనా.[222]
అల్బేనియన్ భాష మాట్లాడే ప్రాంతాలలో ప్రిస్టినా ముఖ్యమైన ఫ్యాషన్ డిజైన్, ఉత్పత్తి, వాణిజ్య కేంద్రంగా ఉంది. మిస్ యూనివర్సు ప్రపంచ సౌందర్య అందాల పోటీలో విజయం సాధించడానికి కొసావో చక్కగా ప్రణాళిక చేసింది. అంతేకాక కొసావో అంతటా " మిస్ కొసావో " ప్రాముఖ్యత సంతరించుకుంది. మొదటి టైటిల్ హోల్డర్ జానా క్రాస్నిఖీ 2008 మిస్ యూనివర్స్ పోటీలో టాప్ 10 ఫైనలిస్ట్గా నిలిచింది. ఆమె మొదటిసారి కాసావో-అల్బేనియన్ మహిళగా 6 వ స్థానానికి చేరుకుంది. తరువాతి సంవత్సరం మిస్ యూనివర్స్ కోస్వో పేజికి మరో విజయాన్ని అందించింది: 2009 లో మాగాగోనా డ్రాకస్షా బహామాస్లో మిస్ యూనివర్స్ 2009 లో రెండో రన్నరప్గా నిలిచింది. ఆమె మొదటి ఐదు టాప్ టోర్నమెంట్లలో కొసావో ప్రతినిధిగా పాల్గొన్నది.
నియామకాల పరంగా మిస్ యూనివర్స్ పోటీలో అత్యంత విజయవంతమైన ప్రవేశం కల్పించబడిన దేశాలలో కొసావో కూడా ఉంది. 2008 ప్రారంభం నుండి కొసావో రెండుసార్లు సెమీఫైనల్ దశలో ఓటమికి గురైంది. 2010, 2014 లో సెమీ ఫైనల్కు రెండుసార్లు మాత్రమే సాధించింది.
జ్వెకాన్కు చెందిన కాతరినా సల్కిక్ 2015 లో మిస్ సెర్బియా అయింది. జుబిన్ పోటాక్కు చెందిన అండెల్కా టొమాసెవిక్ " మిస్ ఎర్త్ 2013 ", మిస్ యూనివర్సు 2014 లో సెర్బియా తరఫున ప్రాతినిధ్యం వహించింది.
కొసావో సమాజం, సంస్కృతిలో క్రీడలు ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. కోసావోలో క్రీడలు ఫుట్బాల్, బాస్కెట్బాల్, జూడో, బాక్సింగ్, వాలీబాల్, హ్యాండ్బాల్ అత్యత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. 2014 లో కొసావో ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో పూర్తి స్థాయి సభ్యుడిగా మారింది.[223] ఇది అజర్బైజాన్లో నిర్వహించిన 2015 యూరోపియన్ క్రీడలలో, బ్రెజిల్లో నిర్వహించిన 2016 వేసవి ఒలంపిక్సులో పాల్గొంది.
కొసావోలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. ఇది 1946 లో మొదట క్రోడీకరించబడింది. 1922 లో మొదటి క్లబ్లు ఎఫ్.సి.గ్జకొవా, ప్రిస్టినా ఏర్పడ్డాయి. 1945 నుండి 1991 వరకు జరిగిన యుద్ధ యుగంలో మాజీ యుగోస్లేవియాలో ఫుట్బాల్ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. 1946 లో ఇది ఫెడరేషన్ ఆఫ్ యుగోస్లేవియాకు అనుబంధంగా కొసావో సమాఖ్యగా ఏర్పడింది. యుగోస్లేవియా మొదటి లీగులలో ప్రిష్టినా అత్యంత విజయవంతమైన క్లబ్ అయ్యింది. కాగా కెఫ్ ట్రెపాకా ఒక సంవత్సరం లీగ్లో భాగంగా ఉంది. 1991 లో కొసావో ఫుట్బాల్ క్రీడాకారులు అందరూ యుగోస్లేవియా లీగ్ నుండి నిషేధించబడిన తరువాత కొసావో మొదటి " ఫెడరేషన్ ఆఫ్ కొసావో " స్థాపించబడింది. 1991 సెప్టెంబరు 13 న ప్రిస్టినాలో ఫ్లెమంటరి స్టేడియంలో మొదటి ఆట నిర్వహించబడింది. ఇ అదే సమయంలో కొసావోలో మొదటి స్వతంత్ర చాంపియన్షిప్పు ప్రారంభమైంది. ప్రధాన కప్ పోటీలు, జాతీయ జట్టుకు గవర్నింగ్ బాడీ బాధ్యత వహిస్తుంది.[224]
ప్రిజెరెన్ లో అల్బేనియన్ తల్లిదండ్రులలో జన్మించింది, అతను వెల్ష్ క్లబ్ స్వాన్సీ సిటీ కొరకు ఆడతాడు
1960 వేసవి ఒలింపిక్సులో బంగారు పతకాన్ని, 1960 యూరోపియన్ చాంపియన్షిప్పులో వెండి పతకాన్ని గెలుచుకున్న యుగోస్లేవియా జాతీయ ఫుట్బాల్ జట్టులో మిలాటిన్ ష్సోకిక్, ఫహ్రుడిన్ జుసుఫీ, వ్లాదిమిర్ డర్కోవిక్ వంటి కొసావోలో జన్మించిన మూడు ఫుట్బాల్ ఆటగాళ్ళు ఉన్నారు. కొసావో నుంచి వచ్చిన స్టెవాన్ స్టోజోనోవిక్ రెడ్ స్టార్ బెల్గ్రేడ్లో భాగంగా యుగోస్లేవియా తఫున క్రీడలలో పాల్గొన్నాడు. వారు 1990-91 యూరోపియన్ కప్ను గెలిచారు. ప్రస్తుతం అనేక ఐరోపా జట్లలో కొసావోకు చెందిన అల్బేనియన్ మూలాల కలిగిన క్రీడాకారులు ఉన్నారు. వీరు తమ ప్రతిభను, విలువలను చూపించే అవకాశం ఉంది. లారిక్ కానా ఒలంపిక్ డి మార్సిల్లే కెప్టెనుగా ఉన్నాడు, సుండర్ల్యాండ్ అల్బేనియా జాతీయ జట్టులో ఉన్నాడు, వెస్టన్ బెహ్రమి " వెస్ట్ హాం యునైటెడ్ " తరఫున పాల్గొని ప్రస్తుతం ఉడినిస్, స్విస్ జాతీయ ఫుట్ బాల్ జట్టు తరఫున ఆడుతున్నాడు. క్సెడన్షక్విరి లివర్పూల్ తరఫున, స్విట్జర్లాండ్ జాతీయ ఫుట్బాల్ జట్టు తరఫున క్రీడలలో పాల్గొంటున్నాడు.[225][226] లేదా అద్నాన్ జంజజ్ తరఫున క్రీడలలో పాల్గొంటున్నాడు.
కోసావోలో బాస్కెట్బాల్ కూడా ప్రజల అభిమాన క్రీడలలో ఒకటిగా ఉంది. తొలి చాంపియన్షిప్ 1991 లో నిర్వహించబడింది. 2015 మార్చి 13 న " కొసావో బాస్కెట్బాల్ సమాఖ్య " ఎఫ్.ఐ.బి.ఎ.లో పూర్తిస్థాయి సభ్యునిగా ఆమోదించబడింది.[227] కొసావోలో జన్మించిన ప్రసిద్ధ క్రీడాకారులు జ్యేర్ర్ అవిడి, మార్కో సైమోనోవిక్, దేజన్ ముస్లీ యుగోస్లేవియా, సెర్బియా జాతీయ జట్ల తరఫున పోటీలో పాల్గొన్నారు. ఎఫ్.ఐ.బి.ఎ. కొసావోను గుర్తించిన తరువాత వారిలో కొందరు సెర్బియా తరఫున పోటీ చేస్తున్నారు.
జుడోకా మాజిలిండా కెల్మెండి 2013, 2014 లో ప్రపంచ ఛాంపియనుగా, 2014 లో యూరోపియన్ ఛాంపియనుగా కూడా నిలిచాడు. వేసవి ఒలింపిక్స్ 2016 లో కెమ్మెండి ఒక బంగారు పతకాన్ని గెలుచుకునన్న మొట్టమొదటి కోసావన్ అథ్లెటుగా టోర్నమెంట్లో కొసావో కొరకు మొట్టమొదటి బంగారు పతకం సాధించాడు.[228] యురోపియన్ క్రీడలలో నోరా గిజకోవ 57 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించి కొసావోకు తొలి పతకాన్ని అందించింది.
↑27.027.1Milot Berisha,Archaeological Guide of Kosovo, Prishtinë, Kosovo Archaeological Institute and Ministry of Culture, Youth and Sports, 2012, Pg.7.
↑Milot Berisha,Archaeological Guide of Kosovo, Prishtinë, Kosovo Archaeological Institute and Ministry of Culture, Youth and Sports, 2012, Pg.8.
↑N G Hammond,The Kingdoms of Illyria c. 400 – 167 BC.Collected Studies, Vol 2, 1993
↑Wilkes, J. J. The Illyrians, 1992,ISBN0-631-19807-5, p. 85, "... Whether the Dardanians were an Illyrian or a Thracian people has been much debated and one view suggests that the area was originally populated with Thracians who where [sic?] then exposed to direct contact with illyrians over a long period..."
↑"the Dardanians [...] living in the frontiers of the Illyrian and theThracian worlds retained their individuality and, alone among the peoples of that region succeeded in maintaining themselves as an ethnic unity even when they were militarily and politically subjected by the Roman arms [...] and when at the end of the ancient world, the Balkans were involved in far-reaching ethnic perturbations, the Dardanians, of all the Central Balkan tribes, played the greatest part in the genesis of the new peoples who took the place of the old" The central Balkan tribes in pre-Roman times: Triballi, Autariatae, Dardanians, Scordisci and Moesians, Amsterdam 1978, by Fanula Papazoglu,ISBN90-256-0793-4, p. 131.
↑Curta 2001, p. 189. sfn error: no target: CITEREFCurta2001 (help)
the Hungarian attack launched in 1183 with which Nemanja was allied [...] was able to conquer Kosovo and Metohija, including Prizren.
↑Anne Comnène, Alexiade – Règne de l'Empereur Alexis I Comnène 1081–1118, texte etabli et traduit par B. Leib, Paris 1937–1945, II, 147–148, 157, 166, 184
↑Malcolm, Noel (1999).Kosovo: A Short History. New York: University Press New York. pp. 58, 75.ISBN0060977752.There are two popular assumptions about the great battle of Kosovo in 1389: that it was this Turkish victory that destroyed the medieval Serbian empire and that the defeated Serbs were immediately placed under Ottoman rule. Both are false." "Some of the early sources make a claim which is much stranger [than the battle ended with a draw]: they describe the battle as a Serbian victory
↑Cirkovic. Pg 115 Prior to the final conquest, the Turks often took inhabitants as slaves, frequently to Asia Minor
↑The Serbs, Sima Cirkovic.Blackwell Publishing. Pg 144Patriarch Arsenije III claimed that 30,000 people followed him (on another occasion the figure was 40, 000)
↑Fine (1994), p. 51.: "The Albanians were not to create any structure resembling a state until the fifteenth century. However, organized in tribes under their own chieftains, the Albanians dominated the mountains of most of what we today think of as Albania."
↑Cirkovic. Pg 244 "In Kosovo there were visible signs of ethnic change which had accumulated since theMiddle Ages with the immigration of Albanian cattle farmers. In addition to the continual flow of settlers and the Islamicisation of urban centres, changes in the population were also caused by political events ... Serbs left territories still under the Sultan's control."
↑Banac, p. 46) harv error: no target: CITEREFBanac (help)
↑The Balkans. From Constantinople to Communism, Dennis Hupchik
↑Cirkovic. Pg 244 "Since Islamicised Albanians represented a significant portion of the Ottoman armed forces and administration, they did not give up the Empire easily."
↑George Gawlrych,The Crescent and the Eagle, (Palgrave/Macmilan, London, 2006),ISBN1-84511-287-3
↑Pllana, Emin (1985). "Les raisons de la manière de l'exode des refugies albanais du territoire du sandjak de Nish a Kosove (1878–1878) [The reasons for the manner of the exodus of Albanian refugees from the territory of the Sanjak of Niš to Kosovo (1878–1878)] ".Studia Albanica.1: 189–190.
↑Rizaj, Skënder (1981). "Nënte Dokumente angleze mbi Lidhjen Shqiptare të Prizrenit (1878–1880) [Nine English documents about the League of Prizren (1878–1880)]".Gjurmine Albanologjike (Seria e Shkencave Historike).10: 198.
↑Şimşir, Bilal N, (1968).Rumeli’den Türk göçleri. Emigrations turques des Balkans [Turkish emigrations from the Balkans]. Vol I. Belgeler-Documents. p. 737.
↑Elsie, Robert (2010).Historical Dictionary of Kosovo. Scarecrow Press. p. XXXII.ISBN9780333666128.
↑Stefanović, Djordje (2005). "Seeing the Albanians through Serbian eyes: The Inventors of the Tradition of Intolerance and their Critics, 1804–1939."European History Quarterly.35. (3): 470.
↑Erik Zurcher, Ottoman sources of Kemalist thought, (New York, Routledge, 2004), Page. 19.
↑Noel Malcolm, A short history of Kosovo, (London, 1998), Page 248.
↑See: Isa Blumi,Rethinking the Late Ottoman Empire: A Comparative Social and Political History of Albania and Yemen, 1878–1918(Istanbul: The Isis Press, 2003)
↑Noel Malcolm,A short history of Kosovo, (London, 1995)
↑71.071.1Schabnel, Albrecht; Thakur, Ramesh (eds). Kosovo and the Challenge of Humanitarian Intervention: Selective Indignation,Collective Action, and International Citizenship. New York: The United Nations University, 2001. p. 20.
↑Daskalovski, Židas. Claims to Kosovo: Nationalism andSelf-Determination. In: Florian Bieber & Zidas Daskalovski (eds.),Understanding the War in Kosovo. L.: Frank Cass, 2003.ISBN0-7146-5391-8. P. 13-30.
↑Ramet, Sabrina P. The Kingdom of God or the Kingdom of Ends: Kosovo in Serbian Perception. In Mary Buckley & Sally N. Cummings (eds.),Kosovo: Perceptions of War and Its Aftermath. L. – N.Y.: Continuum Press, 2002.ISBN0-8264-5670-7. P. 30-46.
↑Vickers, Miranda (1998),Between Serb and Albanian : a history of Kosovo, New York: Columbia University Press,The Italian occupation force encouraged an extensive settlement programme involving up to 72,000 Albanians from Albania in Kosovo
↑Ramet 2006, p. 141. sfn error: no target: CITEREFRamet2006 (help)
↑Malcolm, Noel,Kosovo, A Short History, pp 312–313
↑81.081.181.281.381.481.581.6Independent International Commission on Kosovo.The Kosovo report: conflict, international response, lessons learned. New York, New York, US: Oxford University Press, 2000. Pp. 35.
↑Melissa Katherine Bokovoy, Jill A. Irvine, Carol S. Lilly. State-society relations in Yugoslavia, 1945–1992. Scranton, Pennsylvania, US: Palgrave Macmillan, 1997. Pp. 295.
↑83.083.183.2Melissa Katherine Bokovoy, Jill A. Irvine, Carol S. Lilly. State-society relations in Yugoslavia, 1945–1992. Scranton, Pennsylvania, US: Palgrave Macmillan, 1997. Pp. 296.
↑Melissa Katherine Bokovoy, Jill A. Irvine, Carol S. Lilly. State-society relations in Yugoslavia, 1945–1992. Scranton, Pennsylvania, US: Palgrave Macmillan, 1997. Pp. 301.
↑Independent International Commission on Kosovo.The Kosovo report: conflict, international response, lessons learned. New York, New York, US: Oxford University Press, 2000. Pp. 35–36.
↑86.086.186.2Independent International Commission on Kosovo.The Kosovo report: conflict, international response, lessons learned. New York, New York, US: Oxford University Press, 2000. Pp. 36.
↑Climatic Conditions, Independent Commission for Mines and Minerals of Kosovo, archived fromthe original on 27 May 2014, retrieved27 May 2014
↑Çavolli, Riza (1993).Gjeografia e Kosovës. p. 23.
↑ IMF Country Report No 12/100"Archived copy"(PDF).Archived(PDF) from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 4 అక్టోబరు 2012.{{cite web}}: CS1 maint: archived copy as title (link) "Unemployment, around 40% of the population, is a significant problem that encourages outward migration and black market activity."
↑"Prioritized Intervention List".Regional Programme for Cultural and Natural Heritage in South-east Europe: 8. 23 జనవరి 2009.Archived from the original on 2 మార్చి 2014. Retrieved 2 మార్చి 2014.
↑"Wayback Machine"(PDF). 6 May 2014. Archived from the original on 17 మే 2016. Retrieved 26 అక్టోబరు 2018.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)